ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి షాక్! 

Publish Date:Jun 4, 2021

Advertisement

ఇండియాతో వివాదాన్ని కొనసాగిస్తోంది సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్. భారత్ రూపొందించిన కొత్త ఐటీ రూల్స్ ను అంగీకరించడానికి ముందుకు రావడం లేదు. ఇతర సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు దిగొచ్చినా.. ట్విట్టర్ మాత్రం వాదనకు దిగుతోంది. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు షాకిచ్చింది ట్విట్టర్. వెంకయ్య నాయుడు అకౌంట్ నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్‌ను తొలగించింది. 

అయితే ప్రస్తుతం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉండటంతో... ఆయన కార్యాలయం సెక్రటేరియట్ నిర్వహిస్తున్న... VPసెక్రటేరియట్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా) మాత్రం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌తో కొనసాగుతోంది. "ట్విట్టర్... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధికారిక అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ని తొలగించింది." అని ANI న్యూస్ ఏజెన్సీకి... ఉపరాష్ట్రపతి కార్యాలయం స్వయంగా తెలిపింది.ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్‌కి 13 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారిక అకౌంట్‌కి 9,31,000 ఫాలోయర్స్ ఉన్నారు. వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి గతేడాది జులై 23న చివరి ట్వీట్ వచ్చింది. 

కొత్త ఐటీ రూల్స్‌కి సంబంధించి... గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు కేంద్రంతో డీల్ ఓకే చేసుకోగా... ట్విట్టర్ మాత్రం ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి అంగీకరించలేదు. కేంద్రంతో వాదనకు దిగుతోంది. ఇలాంటి సమయంలో... ఈ సంచలన పరిణామం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

By
en-us Political News

  
ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలు నిలబడతాయి. అందుకే అందరికీ సీపీఆర్ మీద అవగాహన వుండాలి. సీపీఆర్ నేర్చుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధాన్ని తలపించిన ఎన్నికల రణం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలలో ప్రధానంగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి మధ్యే పోరు జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత ఆయా పార్టీల నేతల భాష్, బాడీ లాంగ్వేజ్ ని బట్టి గెలుపు ఎవరిది, ఓటమి పాలయ్యేది ఎవరు అన్నది జనాలకు స్పష్టంగా తేలిపోయింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయను స్వంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలవడానికి పెద్దగా ఆసక్తికనబరచడం లేదు.
ముఖ్యమంత్రిగానే కాదు, ఆపద్ధమర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్ మోసాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు గతంలో బటన్ నొక్కేశాను, ఆ డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలలో అర్జంటుగా జమ చేసేయండి అంటూ తనకు తైనాతీగా వ్యవహరిస్తున్న సీఎస్ ను ఆదేశించారు. దీంతో సీఎస్ జవహరర్ రెడ్డి తక్షణం ఆ పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసేశారు.
ఏదో వాషింగ్ పౌడర్ ప్రకటనలో ‘మరక మంచిదే’ అంటూ వుంటారు. ఈ తరహాలోనే ఒక్కోసారి ‘పొరపాటు కూడా మంచిదే’ అనొచ్చు. అలాంటి మంచి పొరపాట్లు అరుదుగా జరుగుతాయి.
‘ఆశ కురుపులు’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక భూమి కు సంబంధించిన వివాదంలో  జూనియర్ ఎన్టీఆర్ హై కోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వరుస దాడులకు బరి తెగించింది. ఈసీ జోక్యం చేసుకుని ఆయా జిల్లాలకు చెందిన అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం , వేటు వేయడం వంటి చర్యలు తీసుకొంటున్నప్పటికీ దున్నపోతు మీద  వర్షం పడ్డట్టు తయారయ్యింది. 
ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో.
హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు.
తమ చిప్‌ని తింటూ వీడియో చేయాలి. తమ చిప్ తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా, పంచదార లాంటి ఏ పదార్థాలూ తినకుండా ఐదు క్షణాలు వుండగలగాలి. ఇదీ ఛాలెంజ్.
నిన్నటి వరకు ఉక్కపోతగా  వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శుక్రవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో ప్రారంభమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. 
ఏపీలో ఎన్నికలు పూర్తి అయి నాలుగు రోజులైనా రాష్ట్రంలో ఉద్రిక్తతలు చల్లారలేదు. హింసాకాండ అదుపులోనికి రాలేదు. పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సీఈసీ సీరియస్ అయింది. సీఎస్,డిజిపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. సరే దాదాపు మూడు గంటల పాటు సీఎస్, డీజీపీలో రాష్ట్రంలో పరిస్థితులపై వారి వివరణ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.