ప్రాంతం ఏదైనా, ప్రభుత్వాలు ఎన్ని మారిన, సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, పేరు ఏదైనా గాని నిత్యం ఆడవారిపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్తకొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చిత్తూరు నగరంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమోన్మాది కసాయిగా మారి ఆ యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చివరకు తను కూడా గొంతు కోసుకుని పడిపోయాడు.
ఆమె పేరు సుష్మితకు చిన్నప్పటి నుంచి చదువంటే చచ్చేంత ఇష్టం. అందుకే సుష్మిత అప్పులు చేసి మరీ కూతురిని చదివిచారు. పేద వారమైనా.. ఇరుకు ఇంట్లో ఉంటున్నా ఏనాడూ ఇబ్బంది పడలేదు తాను. చదువే తన సర్వాంగ, చదువే తన కష్టాలు తీరుస్తుందని కష్టపడి చదివింది. కానీ శుక్రవారం ఉదయం సుష్మితను చిన్నా అనే యువడుకు గొంతు కోసి చంపేయగా.. ఆమె కుటుంబసభ్యుల చేతిలో చిన్నా హతమయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరంతో పాటు రాష్ట్రంలోనే తీవ్ర అలజడి సృష్టించింది. ఈ దారుణ ఘటనతో గతంలో జరిగిన ప్రేమోన్మాద దాడులు ప్రజల కళ్లముందు కదలాడాయి. అసలు వివరాలు..
చీలాపల్లి సీఎంసీలో సుష్మిత నర్సుగా పనిచేస్తుంది. డ్యూటీ నిమిత్తం ఆమె సోదరుడు సునీల్ రోజూ మధ్యాహ్నం బైక్పై తీసుకెళ్లి.. మరుసటి రోజు ఉదయం ఇంటికి తీసుకొచ్చేవాడు. కట్ చేస్తే.. అదే ప్రాంతానికి చెందిన పని లేని ఒక పోరంబోకు, వాడి పేరు చిన్న సుస్మితను కొంతకాలంగా ప్రేమిస్తున్నాను అంటూ, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఈ ఏడాది జనవరిలో సుస్మిత కుటుంబ సభ్యులు చిన్నాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆయినా వాడి ఆగడాలు ఆగలేదు మళ్ళీ చిన్నా వేధింపులపై తిరిగి రెండు నెలల కిందట వరదయ్య మళ్లీ పోలీసులకు చెప్పగా.. పోలీసులు చిన్నాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా సుస్మితపై పగ పెంచుకుని ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో విధులు ముగించుకుని రోజులాగే శుక్రవారం ఉదయం 7.30గంటలకు తన అన్నతో కలిసి సుష్మిత ఇంటికి వచ్చింది. డ్యూటీ చేసి వచ్చిన కూతురికి టీ ఇద్దామని తల్లి తల పాల కోసం కొట్టుకి వెళ్ళింది. పనిలో పని అని టిఫిక్ కోసం సునీల్ హోటల్కు వెళ్లాడు. ఊరు వాతావరణం కదా అప్పటికే అప్పటికే సుష్మిత ఒంటరిగా ఉందని పసిగట్టిన చిన్న. పధకం ప్రకారం మిద్దెలు దూకుతూ వెళ్లి సుష్మిత ఇంటి మేడపైకి వెళ్ళాడు. వెనుక ఉన్న మెట్లు దిగి వెంట తెచ్చుకున్న కత్తితో ఇంటి గడియను విరగ్గొట్టాడు.
సౌండ్ లేకుండా లోపలి ఎంటర్ అయ్యాడు. సుస్మిత గాఢనిద్రలో ఉంది. ఒక్కసారిగా తనకు జరిగిన విషయాలు అన్ని గుర్తుకు చేసుకున్నాడు చిన్న.. ఒక్కసారిగా మెరుపు దాడి చేసినట్లు గదిలో నిద్రిస్తున్న సుష్మితపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. ఆ రక్తపు మడుగులో పడిఉన్న సుస్మిత చూసి మరి ఆ కసాయి వాడు ఏమనుకున్నాడో అనంతరం అదే గదిలో తానూ కూడా గొంతు కోసున్నాడు. పాలకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి సుష్మిత, చిన్నా ఇద్దరూ రక్తపుమడుగులో ఉండటంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సునీల్ కొనఊపిరితో ఉన్న చిన్నాను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి రాయితో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఈ ఘటనపై స్థానికంగా ఉండే మహిళా సంరక్షణ కార్యదర్శి చిత్తూరు వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం హత్యకు ఉపయోగించిన కత్తి, ఇతర ఆధారాలను సేకరించింది. చిన్నాను హతమార్చిన సునీల్పై పోలీసులు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/psycho-lover-attack-on-nurse-25-116945.html
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి హేమాహేమీలు తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్లో వున్న రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజకీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల అరెస్ట్ సంచలనమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా? లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.