గవర్నర్’తో సర్కార్ సయోధ్య యత్నాలు?

Publish Date:Jun 7, 2022

Advertisement

తెలంగాణ  గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు మధ్య విభేదాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవలసింది ఏదీ లేదు. ఇద్దరి మధ్య దూరం చాలా చాలా పెరిగి పోయింది. అడ్డుగోడలు ఎత్తుగా లేచాయి. గవర్నర్ నివాసం రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ మధ్య భౌతిక దూరం చాలా తక్కువే అయినా విభేదాల దూరం మాత్రం రాష్ట్ర విస్తీర్ణం దాటిపోయింది. ఒకరినొకరు కలవక, ఒకరినొకరు చూడక ఇంచుమించుగా ఓ అర్థ సంవత్సరం పైగానే గడిచి పోయింది. 
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తెరాస గూటికి చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసే విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం అనేక మలుపులు తిరిగి చివరకు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఏకంగా అగాధమే ఏర్పడిందనే అభిప్రాయం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో ఉద్దేశపూర్వకంగానే గవర్నర్’ కు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదనే అభిప్రాయం సామాన్యులకు కూడా చేరింది. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడం ఒకెత్తు అయితే, గవర్నర్’ను కించపరిచే విధంగా రాష్ట్ర మంత్రులు బహిరంగ వ్యాఖ్యలు, విమర్శలు చేయడం, కనీస మర్యాద పాటించక పోవడం  ఒక్కటీ ఒక ఎత్తుగా ఇరు వ్యవస్థల మధ్య సంబంధాలు చితికి పోయాయి . ఒక విదంగా, రాజ్ భవన్, ప్రగతి భవన్ శత్రు శిబిరాలు అనుకునే స్థితికి పరిస్థితి చేరిందనే అభిప్రాయమే అంతటా వినవస్తోంది. 

ఈ నేపధ్యంలోనే గవర్నర్’ కొద్ది నెలల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధాని, నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా’ తో సమావేశ మయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని, గవర్నర్ వ్యవస్థను అవమానాలకు గురి చేస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు కొచ్చి, కొంత మర్మగర్భంగానే అయినా, రాష్ట్ర ప్రభుత్వం పై  విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏమి జరుగుతోందో అందరికీ తెలుసునని చురకలు అంటించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా  వెనకడుగు వేసేది లేదని, రాజ్యాంగ విధులను తూచ తప్పకుండా పతిస్తానని, పేర్కొన్నారు. మరో వంక గవర్నర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నేరుగా స్పందించక పోయినా, మంత్రులు ఘాటుగా స్పందించారు. 

అయితే, ఇప్పుడు వాతావరణం కొంత చల్ల బడుతున్నట్లు తెలుస్తోంది. మంచు కరుగుతోందని రాజ్ భవన్,  ప్రగతి భవన్ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు త్వరలోనే గవర్నర్’ ను కలిసే అవకాశం ఉందని  తెలుస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి  చంద్రశేఖర రావు గవర్నర్’తో విభేదాల కారణంగా, మంత్రి వర్గ విస్తరణ విస్తరణ వంటి కొన్ని కీలక నిర్ణయాలను వాయిదా వేసుకున్నారని, రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.

అయితే ఇప్పుడు, కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడిన నేపధ్యంలో ముఖ్యమంత్రి ఒకడుగు ముదుకేసి గవర్నర్’తో సయోధ్య కోరుకుంటున్నారని అంటున్నారు.  ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నేపధ్యంలో అయన స్థానంలో, అదే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్’ ను మంత్రి వర్గంలోకీ తీసుకుంటారని అప్పట్లో గట్టి ప్రచారం జరిగింది. అందుకే ఆయన చేత ఎంపీ పదవికి రాజీనామా చేయింఛి, ఎమ్మెల్సీ చేశారు. అప్పటినుంచి, మంత్రివర్గ విస్తరణ పై ఉహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే, ఏడ్చే దానికి మొగుడొస్తే తన మొగుడు వస్తాడని, ఇంకొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ముహూర్తం కోసం వేయి కళ్ళతో ఎదురు చూశారు. కానీ, ఆ ముహూర్తం మాత్రం ముడి పడడం లేదు. అయితే, ఇలా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడానికి కూడా, గవర్నర్’తో విభేదాలే కారణమని అంటున్నారు. 

అయితే, ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి, కేసీఆర్, ఎన్నికలకోసం మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ అంటే గవర్నర్’ అనుమతి తీసుకొనక తప్పుదు. అంతే కాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్నా, అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. అదొకటి అలా ఉంటే, జుబ్లీ హిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ వ్యవహారానికి సంబంధించి, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.

ఒక విధంగా ఈ కేసు సర్కార్ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. మరోవంక, సిమిలర్ కేసులు మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే, రాష్ట్రంలో నేరాలు ఘోరాలు పెరిగిపోయాయని, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అది అటూ ఇటూ అయినా, గవర్నర్  రాష్ట్ర పతి పాలనకు సిఫార్సు చేసినా చేయవచ్చుననే ఆందోళన అధికార వర్గాల్లో వినవస్తోంది. 

అందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, రాజ్ భవన్, ప్రగతి భవాన్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు, ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక  కేంద్ర మాజీ మంత్రితో పాటుగా, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో కీలక నేత ద్వారా సయోధ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్’ విషయం కేంద్ర హోం శాఖకు చేరిన నేపధ్యంలో, తాను నిర్ణయం తీసుకోలేనని చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే, ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోరితే, రాజ్యాంగ పరిమితులకు లోబడి నిర్ణయం తీసుకునేందుకు తనకు అభ్యతరం లేదని, అదే విధంగా రాజ్యాంగ విధులను నిర్వర్తించే విషయంలో వ్యక్తిగత గౌరవ మర్యాదలు అడ్డు రావని తెలిపినట్లు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి నిజంగా, గవర్నర్’తో సయోధ్య కోరుకుంటున్నారా? అందుకోసం ఒక మెట్టు దిగేందుకు సిద్ధమయ్యారా? స్వయంగా వెళ్లి గవర్నర్’ను కలుస్తారా, అంటే రాజకీయాల్లో ఉన్నవారికి పట్టువిడుపులు సర్వసాధారణమని అంటున్నారు. అందులోనూ కేసీఆర్ ఈ విద్యలో అందరికంటే ఒకాకు ఎక్కువే చదివారని, అంటారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.