తెరాస ఉనికిని కాపాడుకొనేందుకే విద్వేష ప్రచారం

Publish Date:Sep 9, 2013

Advertisement

 

తెరాస నేతలు తాము బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ, ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ ఊహించినదాని కంటే చాలా విజయవంతంగా ముగియడంతో సహజంగానే జీర్ణించుకోలేకపోతున్నారు.

 

సభ సందర్భంగా వేలాది మంది తరలి వస్తున్నపుడు బయట జరిగిన చిన్నచిన్నసంఘటనలను, సభలో పోలీస్ కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, శ్రీశైలంలపై జరిగిన దాడి, సభలో జరిగిన అవకతవకలను, నేతల ప్రసంగాల వంటివి వాటిని తెరాస నేతలు భూతద్దంలో ఎత్తి చూపుతూ, ఆవేశంతో ఉన్నతెలంగాణా ప్రజలను మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా తెరాస నేతలు ప్రజాగ్రహాన్నితమకు అనువుగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా జరిగిన యావత్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నపటికీ, ఈ విషయంలో వారందరూ చాలా సంయమనంతో మాట్లాడటం గమనార్హం. అందుకు వారిని మెచ్చుకోక తప్పదు.

 

కాంగ్రెస్ తీసుకొన్నవిభజన నిర్ణయంతో తెరాస ఉనికి ప్రశ్నార్ధకమవగా, తెలంగాణాలో టీ-కాంగ్రెస్ పరిస్థితి చాలా మెరుగుపడింది. ఆ దుగ్ధతోనే తెరాస నేతలు తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తూ వారి ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని తిప్పలు పడుతున్నారు.

 

హైదరాబాదులో ఏపీఎన్జీవోలు సభ నిర్వహించడం నిజంగానే బల ప్రదర్శన అని ఒప్పుకోక తప్పదు. బల ప్రదర్శనకు వచ్చిన వారు, అందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తారు తప్ప నాలుగు శాంతి ప్రవచనాలు చెప్పుకొని ‘మమ’ అనుకోని వెళ్లిపోరనేది తెరాస నేతలకు కూడా తెలుసు. ఈ సందర్భంగా తెరాస నేతలు మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన విగ్రహాల విద్వంసం ఒకసారి గుర్తుకు తెచ్చుకొంటే మంచిది. ఒకవేళ ఆ రోజు వారికి ఎవరయినా సమైక్యవాది ఎదురుపడి ‘జై సమైక్యాంధ్ర’ అని నినదించి ఉండి ఉంటే, అతనికీ సభలో పోలీస్ కానిస్టేబుల్ కి పట్టిన గతే పట్టేదనేది కాదనలేని సత్యం.

 

తెరాస నేత హరీష్ రావు సభకు వచ్చినవారికి ఆహారం, పాలు, పళ్ళు, పూలు ఇచ్చి గౌరవించాలని చెపితే, ఏపీఎన్జీవోలు తిరిగి వెళుతున్నపుడు వారి బస్సులపై కొందరు రాళ్ళతో దాడి చేసినపుడు కొంత మందికి గాయాలయ్యాయి. సమైక్యవాదులు తెలంగాణా విద్యార్ధులపై దాడి చేసారని ఆరోపిస్తున్నతెరాస నేతలు, ఈ దాడిని ఖండించలేదు, గాయపడినవారి పట్ల సానుభూతి చూపలేదు, కనీసం ఆ దాడిని ప్రస్తావించలేదు కూడా.

 

ఉద్రేకంగా ఉన్న రెండు సమూహాలు ఎదురయితే ఇటువంటి ఘర్షణలు తప్పవనే సంగతి తెలిసినప్పటికీ, తెరాస నేతలు ప్రజల మధ్య మరింత చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకున్నతెలివిడి తెరాస నేతలకి లేక కాదు. కానీ తమ ఉనికిని కాపాడుకొనేందుకే వారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటారు.

 

ఒకసారి కేసీఆర్ , మరొకసారి ఈటెల, ఇంకోసారి హరీష్ రావు ప్రజలను రెచ్చగొడుతూ తెలంగాణా వేడిని కొనసాగిస్తుంటారు. ఈ నేతలందరూ మళ్ళీ అదే నోటితో ఆంధ్రా వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుతామని పలకడం చూస్తుంటే నోటితో నీతులు పలుకుతూ, నొసటితో వెక్కిరిస్తున్నట్లుంటుంది.

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.