తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా, వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా, ఓట్లే లక్ష్యంగా కొత్త పథకాలు తీసుకొచ్చినా పని చేయలేదు. కారు పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు హుజురాబాద్ ఓటర్లు. హుజురాబాద్ ఫలితం తర్వాత మరో అంశం అసక్తికరంగా మారింది. నవంబర్ నెల సీఎం కేసీఆర్ కు అచ్చిరావడం లేదనే చర్చ సాగుతోంది.
తెలంగాణ రాష్ట్రం వచ్చాకా ఇప్పటివరకు 8 ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ఆరింటిలో టీఆర్ఎస్ గెలవగా.. రెండు చోట్ల మాత్రమే ఓడింది.అవి మెదక్ జిల్లా దుబ్బాక, కరీంనగర్ జిల్లా హుజురాబాద్. అయితే ఈ రెండు ఎన్నికల ఫలితం నవంబర్ లోనే వచ్చాయి. దీంతో సీఎం కేసీఆర్ కు , టీఆర్ఎస్ కు నవంబర్ నెల గండం అనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి చనిపోవడంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీకి 2020 నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికను టీఆర్ఎస్ సవాల్ గా తీసుకుంది. మంత్రి హరీష్ రావే ఇంచార్జీగా ఉన్నారు. హుజురాబాద్ తరహాలోనే పోరాడారు. అయినా ఆ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించి సంచలనం స్పష్టించారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.
తాజాగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం నవంబర్ లోనే వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఎప్పుడు లేనంత హీట్ పుట్టించిన హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాకిస్తూ ఘన విజయం సాధించారు ఈటల రాజేందర్. దీంతో నవంబర్ మాసం కేసీఆర్ గండం అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఉప ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించిన రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఇద్దరూ తెలంగాణ ఉద్యమంలో ముందున్నవారే. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే కావడం మరింత ఆసక్తికరం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-facing-november-tention-25-125748.html
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది. ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి.
ఓయులో కరెంట్ , నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఓయు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో క్రిషాంక్ ను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది.
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.