కేసీఆర్ ప్రచారంపై నిషేధం.. స్పందించని తెలంగాణ సమాజం

Publish Date:May 1, 2024

Advertisement

రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి ఒకదాని వెంట ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత నుంచి ఆ పార్టీ పరిస్థితి పతనం నుంచి మరింత పతనానికి జారిపోతున్న చందంగానే కనిపిస్తోంది. 

అయితే తమ ఓటమికి ప్రజా వ్యతిరేకత కారణం కాదనీ, ప్రజలు తమ వెంటే ఉన్నారనీ, కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపి ప్రజలను మభ్యపెట్టి గెలిచిందనీ చెప్పుకోవడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇసుమంతైనా సందేహించడం లేదు. అయితే వారి మాటలను జనం విశ్వసిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే.. సొంత పార్టీ నేతలూ, శ్రేణులే విశ్వసించడం లేదనడానికి ఆ పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న వలసలే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇక సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీ పరిస్థితి కడు దయనీయంగా మారిందంటున్నారు. అధినేత కేసీఆర్ బస్సు యాత్ర వినా.. బీఆర్ఎస్ ప్రచారంలో ఎక్కడా జోష్ కనిపించడం లేదు. ముందే పరాజయాన్ని అంగీకరించేసినట్లుగా అభ్యర్థులు కూడా తమ తమ నియోజకవర్గాల పరిధిలో ప్రచారంపై దృష్టి సారించడం లేదు. కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గాలలో జరిగే సభలకే ఆ పార్టీ ప్రచారం పరిమితమైనట్లుగా కనిపిస్తోంది. ఇక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే పార్టీ క్యాడర్ తో సమావేశాలతోనే ప్రచారాన్ని మమ అనిపించేస్తున్నారు. అన్నిటికీ మించి బీఆర్ఎస్ ప్రచారం మొత్తం రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తిపోయడానికే పరిమితమైంది. నిండా ఆరు నెలలు కూడా నిండని రేవంత్ సర్కార్ పై విమర్శలను మించి దూషణలతో విరుచుకుపడుతూ అదే ప్రచారం అని జనాలను నమ్మించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం బెడిసికొట్టింది.  అభ్యంతరకరంగా మాట్లాడారంటూ కేసీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధాన్ని విధించింది.

నిన్నమొన్నటి వరకూ రాష్ట్రంలో రాజకీయాలను కనుసైగతో సాధించిన కేసీఆర్ ను అధికారం కలోయిన క్షణం నుంచి ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు వెంటాడుతున్నాయనే చెప్పాలి. పార్టీ పరాజయం పాలైన నాడే తన ఫామ్ హౌస్ బాత్ రూంలో కాలుజారి గాయపడ్డారు. దాని నుంచి కోలుకుని ప్రజలలోకి రావడానికి కొంత సమయం తీసుకున్నారు. ఈ లోగానే పార్టీ నుంచి వలసల వరద మొదలైంది.  పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా కారు దిగేశారు. సరే ఆరోగ్యం కుదుటపడింది. వలసల వల్ల పార్టీకి నష్టం లేదు, పార్టీ వీడిన వారంతా  తెలంగాణ ద్రోహులు అంటూ ఆయన హుంకరించడం మొదలు పెట్టారో లేదో.. ఆయన కుమార్తె   కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై  తీహార్ జైలుకు వెళ్లారు.

దాని నుంచి తేరుకుని కేంద్రం కుట్ర అంటూ ఆరోపణలు గుప్పించడానికి రెడీ అవుతుండగానే  కూడా ఫోన్ టాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు అరెస్టులు జరిగి.. ట్యాపింగ్ ఉచ్చు నేరుగా పార్టీ నేతల మెడకే చుట్టుకునే ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వచ్చాయి. ఇన్ని కష్టాల నడుమ పార్టీనీ  పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సిద్దచేసే పనిలో వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ ప్రసంగాలలో సంయమనం కోల్పోయారు.  సిరిసిల్ల సభలో  కేసీఆర్ కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారంటూ అందిన ఫిర్యాదులపై ఈసీ చర్యలు తీసుకుంది. బుధవారం (మే 1) రాత్రి 8 గంటల నుంచిఈ   48 గంటల పాటు అంటే శుక్రవారం (మే 3) రాత్రి ఎనిమిది గంటల వరకూ కేసీఆర్ ఎటువంటి ఎన్నికల ప్రచారం చేయకూడదంటూ నిషేధం విధించింది. ఆ 48 గంటలూ కేసీఆర్ ఎటువంటి  సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూ లలో పాల్గొనకూడదు. 

అయితే ఈసీ చర్యల పై స్పందించిన కేసీఆర్ తన మాటలు, స్థానిక మాండలికం ఈసీ అధికారులకు అర్ధం కాలేదంటూ నిందలు వేశారు.  తన ప్రచారాన్ని 48 గంటలు నిషేధిస్తే లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్విరామంగా 96 గంటల పాటు ప్రచారం చేస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే ఆయనపై నిషేధం విధించి గంటలు గడిచినా తెలంగాణలో ఎక్కడా నిరసన అన్నదే కనిపించని పరిస్ధితి ఉంది.  కవితను ఈడీ అరెస్టు చేసిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపునకు తెలంగాణ ప్రజల నుంచి స్పందన కరవైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ విధించిన నిషేధంపై ప్రజల నుంచి ఎటువంటి నిరసనలూ వ్యక్తం కావడం లేదు. ఆయన భాష అభ్యంతరకరంగానే ఉందన్న చర్చ కూడా జనబాహుల్యంలో సాగుతోంది. పరిశీలకులు సైతం అదే మాట చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు రోజుల ముందు కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం బీఆర్ఎస్ కు గోరుచుట్టుపై రోకలి పోటువంటిదేనని అంటున్నారు. 

By
en-us Political News

  
‘ఆశ కురుపులు’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక భూమి కు సంబంధించిన వివాదంలో  జూనియర్ ఎన్టీఆర్ హై కోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వరుస దాడులకు బరి తెగించింది. ఈసీ జోక్యం చేసుకుని ఆయా జిల్లాలకు చెందిన అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం , వేటు వేయడం వంటి చర్యలు తీసుకొంటున్నప్పటికీ దున్నపోతు మీద  వర్షం పడ్డట్టు తయారయ్యింది. 
ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో.
హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు.
తమ చిప్‌ని తింటూ వీడియో చేయాలి. తమ చిప్ తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా, పంచదార లాంటి ఏ పదార్థాలూ తినకుండా ఐదు క్షణాలు వుండగలగాలి. ఇదీ ఛాలెంజ్.
నిన్నటి వరకు ఉక్కపోతగా  వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శుక్రవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో ప్రారంభమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. 
ఏపీలో ఎన్నికలు పూర్తి అయి నాలుగు రోజులైనా రాష్ట్రంలో ఉద్రిక్తతలు చల్లారలేదు. హింసాకాండ అదుపులోనికి రాలేదు. పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సీఈసీ సీరియస్ అయింది. సీఎస్,డిజిపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. సరే దాదాపు మూడు గంటల పాటు సీఎస్, డీజీపీలో రాష్ట్రంలో పరిస్థితులపై వారి వివరణ ఇచ్చారు.
గెలుస్తున్నాం.. ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పకుండా, గెలుస్తారని ఆశిస్తున్నానని, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను అన్నప్పుడే బొత్సకి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మకం పోయిందని అనుకుంటున్నారు.
పొలిటికల్ కామెడీడలో ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను మించిపోయారు. ఇంత కాలం రోహిణీకార్తె ఎండలను మించి వేడెక్కిన రాజకీయ మంటల నుంచి పాల్ మాత్రమే తన ప్రసంగాలతో ఒకింత ఉపశమనం కలిగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తరువాత యథేచ్ఛగా సాగిన హింసాకాండకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేసింది. పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వారందరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం కావడానికి బాధ్యులెవరని నిలదీసింది. హింస ప్రజ్వరిల్లిన పల్నాడు ఎస్పీపై బదిలీ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.