తెలంగాణాలో వైకాపా నేతలను పావులుగా వాడుకొంటున్నారా?

Publish Date:Jun 4, 2015

Advertisement

 

రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణాను విడిచిపెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో ప్రవేశించి అక్కడ బలపడేందుకు ప్రయత్నిస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. అందుకోసం రాష్ట్ర వైకాపా నేతలు తెరాస ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నారు. ఆ పార్టీ నేత షర్మిల రెండు సార్లు పరామర్శయాత్రలు చేసారు. మళ్ళీ ఈనెల 9నుండి మూడవసారి యాత్రలకి బయలుదేరుతున్నారు. కానీ మొన్న జరిగిన తెలంగాణా శాసనమండలి ఎన్నికలలో తెరాసకు వైకాపా మద్దతు ఇవ్వడంతో రాష్ట్ర నేతలు కంగు తిన్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు యం.యల్యేలను తెరాస తన వైపు త్రిప్పుకొన్నప్పుడు సహజంగా ఆగ్రహం కలగాలి. కానీ అందుకు ఏ మాత్రం స్పందించకపోగా తిరిగి ఆ పార్టీ అభ్యర్ధికే ఓటు వేయడంతో వైకాపాకు నిజంగానే తెలంగాణాలో బలపడాలనే ఉద్దేశ్యం ఉందా...లేక రాష్ట్రంలో వైకాపా నేతలను ఆ రెండు పార్టీలు కలిసి తమ రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకొంటున్నాయా? అనే అనుమానం కలుగకమానదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయం వలన రాష్ట్ర నేతలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణా ప్రభుత్వంతో పోరాడుతున్నట్లు నటిస్తున్నట్లయింది. తెలంగాణా ప్రజలు వారి చిత్తశుద్ధిని శంఖించే పరిస్థితి ఏర్పడింది.

 

రెండు రాష్ట్రాలలో తెదేపా-బీజేపీలు కలిసి పనిచేస్తున్నట్లే, ఒకవేళ తెలంగాణాలో తెరాసతో కలిసి పనిచేయాలని వైకాపా భావిస్తే అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. ఒకవేళ చెప్పినా ఆ రెండు పార్టీలకు ప్రజలకు జవాబు చెప్పుకోగల దైర్యం ఉన్నట్లయితే ఎవరినీ పట్టించుకోనవసరం లేదు. కానీ తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నట్లు నటిస్తూ మళ్ళీ అవసరం పడినప్పుడు ఈవిధంగా మద్దతు ప్రకటించడం గమనిస్తే ఆ పార్టీకి తెలంగాణాలో బలపడాలని కాక వేరే ఇతర కారణాలు, ఉద్దేశ్యాలు ఉన్నట్లు అనుమానించవలసి వస్తోంది.

 

ఆ రెండు పార్టీలు తమ ఉమ్మడి శత్రువు అయిన తెదేపాను, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీసేందుకే వైకాపాను తెలంగాణాలో ప్రవేశపెట్టి ఉండవచ్చును. అందుకే వైకాపా యం.యల్యేలను తెరాస తనవైపు త్రిప్పుకొన్నప్పటికీ ఆ పార్టీ అస్సలు పట్టించుకోలేదు. కానీ తెలంగాణాలో ఎలాగయినా బలపడి, వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని భావిస్తున్న తెదేపా, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ యం.యల్యేలను తెరాస ఆకర్షించినప్పుడు దానిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా న్యాయపోరాటాలు కూడా చేస్తుండటం గమనిస్తే, ఈ విషయంలో వైకాపా ఎందుకు ఉదాసీనంగా ఉందో అర్ధమవుతుంది.

 

ఇక మరో కారణం ఏమయి ఉండవచ్చంటే తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజల ఓట్లు తెరాసకు పడతాయనే నమ్మకం లేదు. కనుక వారి ఓట్లను తెరాసకు బదలాయించేందుకే వైకాపాను తెలంగాణాలోకి రప్పించి ఉండవచ్చుననే అనుమానాలు కలుగుతున్నాయి. నల్గొండలో పరామర్శ యాత్ర పూర్తయిన తరువాత రంగారెడ్డి, హైదరాబాద్ లలో షర్మిల యాత్రలు చేస్తారని ఆ పార్టీ ప్రకటించడం గమనిస్తే, త్వరలో జరుగనున్న జి.హెచ్.యం.సి. ఎన్నికలలో వైకాపా పోటీ చేసి ఆంద్ర ప్రజల ఓట్లను తెరాసకు బదలాయించేందుకేనని అనుమానం కలుగుతోంది. మొన్న శాసనమండలి ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇచ్చినట్లే, జి.హెచ్.యం.సి. ఎన్నికలలో తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీ అభ్యర్ధుల ఓట్లను చీల్చి తెరాసకు ప్రయోజనం కలిగించవచ్చును. లేదా ఎన్నికల తరువాత తెరాసకు మద్దతు ప్రకటించవచ్చును.

 

వైకాపా ఉద్దేశ్యం తెలంగాణాలో బలపడి ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారం చేప్పట్టడం కాదు కనుకనే తెదేపాను, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యాత్రలను వ్యతిరేకించినట్లుగా షర్మిల పరామర్శ యాత్రలను, తమ ప్రభుత్వంపై వైకాపా చేస్తున్న పోరాటాలను తెరాస పెద్దగా పట్టించుకోవడంలేదని భావించవలసి ఉంటుంది. తెలంగాణాపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆసక్తి లేదు కనుకనే ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ ఇంత వరకు తెలంగాణాలో పర్యటించకుండా అప్పుడప్పుడు తన సోదరి షర్మిలను పరామర్శ యాత్రలకు పంపిస్తున్నట్లున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

 

ఆమె కూడా తన యాత్రలు రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్నవి కావు కనుక తను రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని చాలా లౌక్యంగా తెరాసపై ఎటువంటి విమర్శలు చేయకుండా వెళ్లి వచ్చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఓదార్పు యాత్రలు, రైతు భరోసా యాత్రలు చేస్తునప్పుడు మాత్రం తన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను, అది నడిపిస్తున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎంత ఘాటుగా విమర్శిస్తారో అందరికీ తెలుసు. దీనిని బట్టి చూస్తే వైకాపాకు తెలంగాణాపై ఆసక్తి లేదని, తన రాజకీయ శత్రువు అయిన తెదేపాను తెలంగాణాలో నిలువరించేందుకు తెరాసకి సహాయపడేందుకే ఆ రాష్ట్రంలో తిరిగి ప్రవేశించినట్లు అనుమానం కలుగుతోంది. అయితే ఇది కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వేరే ఇతర అవసరాలు, ప్రయోజనాలు లేదా ఇతర కారణాలు కూడా ఉండి ఉండవచ్చును. కానీ ప్రధాన కారణం మాత్రం పైన పేర్కొన్నవే అయ్యి ఉండవచ్చును.

 

ఈ అనుమానాలే నిజమయితే అందరి కంటే ఎక్కువ నష్టపోయేది వైకాపాను నమ్ముకొన్న నేతలు, కార్యకర్తలే. ఇంతకు ముందు కొండా సురేఖ వంటి నేతలు వైకాపాను నమ్ముకొన్నందుకు తెలంగాణా ద్రోహులుగా అనేక అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ వైకాపా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని, తెలంగాణాలో పార్టీకి కొండంత అండగా నిలబడిన కొండా సురేఖ దంపతులతో సహా అనేకమంది తెలంగాణా నేతలను నడిరోడ్డు మీద విడిచిపెట్టేసి రాత్రికి రాత్రి తెలంగాణా నుండి ఆంధ్రాకు తరలిపోయిన విషయం అందరికీ తెలుసు. బహుశః మళ్ళీ మున్ముందు తెలంగాణాలో వైకాపా నేతలకు అటువంటి పరిస్థితే ఎదురయినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.