రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమా?

Publish Date:Jun 3, 2015

Advertisement

 

తెలంగాణాలో జరిగిన రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల జగన్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటీ కాదు...రెండూ కాదు ఏకంగా 11 చార్జ్ షీట్లలో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్, రేవంత్ వ్యవహారంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుని కూడా ఏ-1 ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేయడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. “త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది...మనకీ మళ్ళీ మంచిరోజులు వస్తాయి...మా పార్టీ అధికారంలోకి రాగానే మీ భూములు మీకు ఇచ్చేస్తాము,” అంటూ జగన్ తరచూ పలికే మాటల్లో ముఖ్యమంత్రి అయిపోదామనే ఆయన తాపత్రయం స్పష్టంగా కనబడుతోంది.

 

రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి పదవులు, అధికారం సంపాదించుకోవాలని ఆశ పడటం నేరమేమీ కాదు. కానీ అందుకోసం ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలు కూలిపోవాలని లేదా ఏదో విధంగా కూల్చివేయాలనుకోవడమే చాలా దారుణమయిన ఆలోచన. ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కూల్చేస్తానని బెదిరించి, చివరికి అన్నంత పనీ చేసి భంగపడిన సంగతి అందరికీ తెలిసిందే. బహుశః అటువంటి ప్రయత్నమే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నట్లున్నారు. అందుకే జగన్ తనకు అసలు సంబంధం లేని వ్యవహారంలో చాలా చురుకుగా కదిలి గవర్నర్ నరసింహన్ న్ని కలిసి, తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై పిర్యాదు చేసినట్లు అనుమానిస్తున్నారు.

 

జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణించినప్పటి నుండి ముఖ్యమంత్రి అవ్వాలనే ఏకైక లక్ష్యంతోనే పార్టీని స్థాపించి విశ్వప్రయత్నాలు చేసారు. అయితే ఆయన తన నాయకత్వ లక్షణాలు చాటుకొని ప్రజలను మెప్పించి అధికారం కోసం ప్రయత్నించకుండా, తన తండ్రిపై ప్రజలలో ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకొనేందుకు ఓదార్పు యాత్రలు చేస్తూ, ఆయన ప్రవేశ పెట్టిన కొన్ని ఆకర్షణీయమయిన పధకాల గురించి చెప్పుకొని ఎన్నికలలో గెలవాలని ప్రయత్నించి భంగపడ్డారు. అందుకు తనను తాను నిందించుకోకపోగా చంద్రబాబు కారణంగానే తన ఆశలు అడియాసలయ్యాయని ఆయనే స్వయంగా చాలాసార్లు నిసిగ్గుగా చెప్పుకొన్నారు. అప్పటి నుండే ఆయన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తన శత్రువులుగా భావిస్తూ పోరాటాలు మొదలు పెట్టారు. కనుక ఆయన చేస్తున్న ఈ సమర దీక్షలు...పోరాటాలు అన్నీ కూడా కేవలం తెదేపాపై ప్రతీకారేచ్చతో చేస్తున్నవే తప్ప నిజంగా ప్రజల కోసం చేస్తున్నవి మాత్రం కాదని చెప్పవచ్చును.

 

ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల కోసం, వారి సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆయన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న వారికి మద్దతు ఇచ్చి, వారితో చేతులు కలిపి ఉండేవారు కాదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన రాష్ట్ర ప్రయోజనాల కంటే తన పార్టీ ప్రయోజనాలకి, తన స్వార్ధ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తునందునే ఆయన ఆవిధంగా చేస్తున్నారని అనుమానించక తప్పదు.

 

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు కదులుతోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నాలుగేళ్ల కాలంలో రాజధానికి రూపురేఖలు తీసుకువచ్చి, పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్రాన్ని ఆర్ధిక సమస్యల నుండి  బయటపడేయగలిగినట్లయితే ఇక వచ్చే ఎన్నికలలో కూడా వైకాపా గెలిచే అవకాశాలు ఉండబోవని తేలికగానే ఊహించవచ్చును. రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణంలో వైకాపా పాలుపంచుకోకపోవడానికి దానికి అడుగడుగునా అడ్డుపడటానికీ కారణం అదేనని భావించవచ్చును. బహుశః అందుకే ఆయన తన సమరదీక్షకు మంగళగిరిని వేదికగా ఎంచుకొన్నారని భావించవచ్చును..

 

అధికారం కోసం రాజకీయ పార్టీలు ఎన్ని పోరాటాలు చేసినా ప్రజలు సహిస్తారు కానీ అధికార దాహంతో తాము ఎన్నుకొన్న ప్రభుత్వాలను ఎవరయినా కుట్రలు పన్ని కూల్చాలని ప్రయత్నించినా, రాష్ట్రాభివృద్దికి ఆటంకాలు సృష్టించినా సహించబోరనే విషయం గతంలో చాలాసార్లు రుజువు చేసారు. వైకాపా కూడా మళ్ళీ అటువంటి పొరపాటే చేస్తే అందుకు ఆ పార్టీయే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.