విశాఖ‌కు టాలీవుడ్‌!.. కారు కిరికిరి.. హిజాబ్‌పై మోదీ రియాక్ష‌న్‌.. టాప్‌న్యూస్ @7pm

Publish Date:Feb 10, 2022

Advertisement

1. సినీ ప‌రిశ్ర‌మ ఏపీకి షిఫ్ట్ అవ్వాల్సిందేనంటూ సీఎం జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కనీసం 20 శాతం షూటింగ్ జరిపేలా చూడాలన్నారు. నెమ్మదిగా సినీపరిశ్రమ విశాఖపట్నం రావాలని తేల్చి చెప్పారు. తెలంగాణాతో పోలిస్తే సినీపరిశ్రమకి ఏపీ ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేస్తోందని గుర్తు చేశారు. అందరికీ విశాఖపట్నంలో ఇళ్ల స్థలాలు, స్టూడియోలకు భూములు ఇస్తాం.. జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేయాల‌న్నారు సీఎం జ‌గ‌న్‌.

2. సినీ పరిశ్రమ సంక్షోభానికి శుభంకార్డు పడిన‌ట్టేన‌న్నారు చిరంజీవి. ఈ నెల చివరి నాటికి జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 5వ షోకు సైతం జగన్ ఆమోదం తెలిపారన్నారు. మ‌రోవైపు, తెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమాల మనుగడ చాలా కష్టంగా ఉందన్నారు నటుడు ఆర్ నారాయణమూర్తి. నంది అవార్డులు ఇచ్చేలా చూడాలని సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న‌ కోరారు.

3. టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 67వేల కోట్ల ఇరిగేషన్ పనులు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. రెండున్నరేళ్లలో ఎన్ని పనులు చేశారో ప్రభుత్వానికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. మంత్రి సొంత జిల్లాలో సోమశిల డ్యాంకి మరమ్మతులు చేపట్టలేదని విమ‌ర్శించారు. నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు పూర్తిచేయలేదని ఆరోపించారు.

4. అప్పులు, ఓవర్ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారని టీడీపీ నేత పట్టాభిరాం మండిప‌డ్డారు. ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని విమర్శించారు. వేజ్ అండ్ మీన్స్‌, ఓవర్ డ్రాప్టులు వాడటంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు ప‌ట్టాభి. 

5. పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. హౌస్‌కి లీడర్ అయిన ప్రధాని పార్లమెంట్‌ను కించపరిచారని ఆ పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విభజన బిల్లు పట్ల ప్రధాని సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారని.. సభా హక్కుల ఉల్లంఘించేలా ప్రధాని మాట్లాడారని మండిపడ్డారు.

6. పార్లమెంటులో కాపుల రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు లేవనెత్తారు. ఏపీలో వెంటనే కాపులకు ఓబీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలన్నారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారన్నారు. ఏపీ జనాభాలో 18% ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందట్లేదని జీవీఎల్  అన్నారు.

7. ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. మే 2 నుంచి 13 వరకు టెన్త్ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు.  ఉదయం తొమ్మిదిన్న‌ర‌ నుంచి మధ్యాహ్నం 12:45 వరకు టెన్త్ పరీక్షలు.. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ ఉంటుందని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

8. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం జడపల్లి తండాలో ప్రాధమిక పాఠశాల టీచర్ శ్యామలరావు ఓ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరికీ చెప్పొద్దంటూ వికలాంగురాలైన ఆ బాలికను బెదిరించాడు.  విష‌యం తెలిసి.. టీచ‌ర్‌ శ్యామలరావును గ్రామస్తులు గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

9. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని మోదీ హిజాబ్ ఎపిసోడ్‌పై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. బాధితురాలైన ప్రతి ముస్లిం మహిళకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు తమ హక్కులను కాపాడుకోవడానికి, ఓట్ల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయని మోదీ అన్నారు. ముస్లిం కుమార్తెల జీవితం ఎప్పుడూ వెనుకబడి ఉండేలా ఆ వ్యక్తులు.. ముస్లిం సోదరీమణులను మోసగిస్తున్నారని మోదీ విమర్శించారు.

10. 15వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో ఆఫ్‌లై‌న్‌లో ఇవ్వ‌నున్న‌ట్టు టీటీడీ తెలిపింది. రోజుకు 10వేలు చొప్పున భక్తులకు టోకెన్లు ఇస్తామ‌న్నారు టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిపై ఫిబ్రవరి 17వ తేదీన జరగనున్న పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.