విశాఖకు టాలీవుడ్!.. కారు కిరికిరి.. హిజాబ్పై మోదీ రియాక్షన్.. టాప్న్యూస్ @7pm
Publish Date:Feb 10, 2022
Advertisement
1. సినీ పరిశ్రమ ఏపీకి షిఫ్ట్ అవ్వాల్సిందేనంటూ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కనీసం 20 శాతం షూటింగ్ జరిపేలా చూడాలన్నారు. నెమ్మదిగా సినీపరిశ్రమ విశాఖపట్నం రావాలని తేల్చి చెప్పారు. తెలంగాణాతో పోలిస్తే సినీపరిశ్రమకి ఏపీ ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందని గుర్తు చేశారు. అందరికీ విశాఖపట్నంలో ఇళ్ల స్థలాలు, స్టూడియోలకు భూములు ఇస్తాం.. జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేయాలన్నారు సీఎం జగన్. 2. సినీ పరిశ్రమ సంక్షోభానికి శుభంకార్డు పడినట్టేనన్నారు చిరంజీవి. ఈ నెల చివరి నాటికి జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 5వ షోకు సైతం జగన్ ఆమోదం తెలిపారన్నారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమాల మనుగడ చాలా కష్టంగా ఉందన్నారు నటుడు ఆర్ నారాయణమూర్తి. నంది అవార్డులు ఇచ్చేలా చూడాలని సీఎం జగన్ను ఆయన కోరారు. 3. టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 67వేల కోట్ల ఇరిగేషన్ పనులు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. రెండున్నరేళ్లలో ఎన్ని పనులు చేశారో ప్రభుత్వానికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. మంత్రి సొంత జిల్లాలో సోమశిల డ్యాంకి మరమ్మతులు చేపట్టలేదని విమర్శించారు. నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు పూర్తిచేయలేదని ఆరోపించారు. 4. అప్పులు, ఓవర్ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్రెడ్డి తగ్గేదేలే అంటున్నారని టీడీపీ నేత పట్టాభిరాం మండిపడ్డారు. ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని విమర్శించారు. వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్టులు వాడటంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు పట్టాభి. 5. పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. హౌస్కి లీడర్ అయిన ప్రధాని పార్లమెంట్ను కించపరిచారని ఆ పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విభజన బిల్లు పట్ల ప్రధాని సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారని.. సభా హక్కుల ఉల్లంఘించేలా ప్రధాని మాట్లాడారని మండిపడ్డారు. 6. పార్లమెంటులో కాపుల రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు లేవనెత్తారు. ఏపీలో వెంటనే కాపులకు ఓబీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలన్నారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారన్నారు. ఏపీ జనాభాలో 18% ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందట్లేదని జీవీఎల్ అన్నారు. 7. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. మే 2 నుంచి 13 వరకు టెన్త్ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12:45 వరకు టెన్త్ పరీక్షలు.. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. 8. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం జడపల్లి తండాలో ప్రాధమిక పాఠశాల టీచర్ శ్యామలరావు ఓ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరికీ చెప్పొద్దంటూ వికలాంగురాలైన ఆ బాలికను బెదిరించాడు. విషయం తెలిసి.. టీచర్ శ్యామలరావును గ్రామస్తులు గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ హిజాబ్ ఎపిసోడ్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బాధితురాలైన ప్రతి ముస్లిం మహిళకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు తమ హక్కులను కాపాడుకోవడానికి, ఓట్ల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయని మోదీ అన్నారు. ముస్లిం కుమార్తెల జీవితం ఎప్పుడూ వెనుకబడి ఉండేలా ఆ వ్యక్తులు.. ముస్లిం సోదరీమణులను మోసగిస్తున్నారని మోదీ విమర్శించారు. 10. 15వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో ఆఫ్లైన్లో ఇవ్వనున్నట్టు టీటీడీ తెలిపింది. రోజుకు 10వేలు చొప్పున భక్తులకు టోకెన్లు ఇస్తామన్నారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిపై ఫిబ్రవరి 17వ తేదీన జరగనున్న పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
http://www.teluguone.com/news/content/top-news-7pm-39-131575.html





