సలహాదారులకు కోట్ల‌ల్లో జీతాలు!.. వాళ్లకి దోచిపెడుతున్న జ‌గ‌న్ స‌ర్కారు!

Publish Date:Feb 10, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది? వారికి ఇచ్చే జీతభత్యాల సంగతేంటి? వారంతా ఎవరికి.. ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలపై ఏపీలోని సాధారణ ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. సలహాదారుల పేరుతోనే కాకుండా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వాటి డైరెక్టర్ల నియామకం పేరుతో నెలనెలా కోట్లాది రూపాయల జనం సొమ్మును జగన్ సర్కార్ దోచిపెడుతోందనే విమర్శలు ఉన్నాయి.

జగన్ రెడ్డి సర్కార్ ప‌దుల సంఖ్య‌లో సలహాదారులను నియమించుకుంది. ఆ సంఖ్య 40కి పైనే అంటారు.  వారిలో ఓ 10 మందికి కేబినెట్ ర్యాంకు కూడా ఇచ్చింది. వారికి కేబినెట్ హోదాలోనే జీతభత్యాలు ఇస్తోంది. ఒక్కో ప్రభుత్వ సలహాదారుకు నెలనెలా 3 లక్షల వరకూ జీతం రూపేణా జనం ధనం అందుతోంది. ఇతర భత్యాల రూపంలో మరో 2 లక్షల వరకు ముడుతోంది. అంటే, అడ్వైజ‌ర్లు అంద‌రికీ క‌లిపి నెల‌కు సుమారు 2 కోట్లు ఖ‌ర్చు అవుతోంది. ఇక‌, సలహాదారుల్లో చాలా మందికి కారు, డ్రైవర్, ఇతర సిబ్బంది లాంటి సౌకర్యాలు కూడా జగన్ ప్రభుత్వం కల్పించింది. అలాంటి వారికి ఇచ్చే జీతాలు ఆ 2 కోట్ల‌కు అదనం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్నా.. సలహాదారులకే ఎక్కువ జీతం ఇస్తున్నారని అంటున్నారు. 

ఏపీలో రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లాంను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా జగన్ రెడ్డి నియమించుకున్నారు. అయితే.. అనంతర కాలంలో ఆయన పవర్ క‌ట్ చేశారు జగన్క. కె.రామచంద్రమూర్తి, సజ్జల రామకృష్ణారెడ్డి, జుల్ఫీరావ్డీ, సాగి దుర్గాప్రసాదరాజు, తలశిల రఘురాం, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్, పీటర్ హసన్, ఎం.శామ్యూల్ కు జగన్ రెడ్డి సర్కార్ కేబినెట్ ర్యాంక్ ఇచ్చింది. వీరిలో అజయ్ కల్లాంకు ఇప్పుడు అధికారాలు లేవు. తన సలహాలు తీసుకోవడం లేదని అలిగిన రామచంద్రమూర్తి పదవికి రాజీనామా చేశారు. దేవులపల్లి అమర్ అయితే.. అడపా దడపా టీవీ చర్చల్లో పాల్గొంటారు. జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయాలను సమర్థించలేక సతమతం అవుతుంటారు. జీవీడీ కృష్ణమోహన్ సీఎం స్పీచ్ లు రాస్తుంటారు. తలశిల రఘురాం వైసీపీ కార్యక్రమాలను కో ఆర్డినేట్ చేస్తుంటారు. చాలామంది సలహాదారులకు పెద్ద‌గా పనేమీ ఉండదంటారు. అయినప్పటికీ, కేవ‌లం ల‌క్ష‌ల్లో జీత‌భ‌త్యాలు ఇచ్చేందుకే అన్న‌ట్టు.. వారంద‌రినీ అడ్వైజ‌ర్లుగా పెట్టుకున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలో హైకోర్టు సైతం అంత‌మంది స‌ల‌హాదారులు ఏంట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ప్ర‌జాధ‌నాన్ని ఇలా స‌ల‌హాదారుల పాలు చేయ‌డం ఏంట‌నేది ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్న‌.

ఇక ప్రభుత్వ సలహాదారులు అంద‌రిలోకి సజ్జల రామకృష్ణారెడ్డి దారి వేరు, తీరు వేరు. ఏపీ సీఎం జగన్ మౌత్ పీస్ మాదిరిగా వ్యవహరిస్తుంటారు. సజ్జల చెబితే జగన్ చెప్పినట్లే అనే రేంజ్ లో ఆయన వ్యవహారం ఉంటుంది. సజ్జల ‘ఆల్ ఇన్ వన్’ అన్నమాట. ఒకే ఒక్క పవర్ ఫుల్ సలహాదారు సజ్జల. యాక్టింగ్ సీఎం మాదిరి. ప్రజా వ్యవహారాల సలహాదారు అనేది సజ్జలకు ఇచ్చిన పోస్టు. అయితేనేం.. అన్ని శాఖల వ్యవహారాలనూ ఆయనే చక్కబెట్టేస్తారు. డీజీపీ ఆఫీస్ మొత్తం సజ్జల కనుసన్నల్లోనే ఉంటుందనేది టీడీపీ నేతల నుంచి తరచుగా వస్తున్న ఆరోపణ. మిగతా సలహాదారులకు పని ఉన్నా లేకపోయినా గానీ సజ్జలకు మాత్రం ఒక్క క్షణం కూడా తీరికే ఉండదు. ఆయన చక్కబెట్టాల్సిన వ్యవహారాలు అంతలా ఉంటాయి మరి!

కేబినెట్ హోదా లేని సలహాదారులు, సహాయ సలహాదారులు కూడా ఓ 23 మంది వరకు ఉన్నారు. వారికి కూడా కేబినెట్ ర్యాంక్ ఉన్న సలహాదారులతో సమానంగానే జీతభత్యాలు అందుతుంటాయి. కాకపోతే వారికి ప్రోటోకాల్ వర్తించదు అంతే. ప్రత్యేక ఆబ్లిగేషన్ ప్రకారం కొందరిని సలహాదారులుగా నియమించారని అంటారు. అలాంటి వారికి జీతభత్యాలు ఇవ్వడం లేదు. గత ఎన్నికలకు ముందు డేటా చోరీ పేరుతో హంగామా చేసిన తుమ్మల లోకేశ్వర్ రెడ్డి నుంచి వివిధ సందర్భాల్లో తమ పార్టీకి, తనకు సహకరించిన వారికి కృతజ్ఞతగా సలహాదారు పదవులు ఇచ్చినట్లు చెబుతుంటారు. తెలంగాణకు చెందిన డాక్టర్ శిల్పా టేకుపల్లికి ఢిల్లీలో ఉండేలా హెల్త్ సలహాదారు పదవిని జగన్ సర్కార్ కట్టబెట్టింది. డాక్టర్ శిల్పా టేకుపల్లికి ఢిల్లీలో నివాస అవసరం తీర్చేందుకు ఈ పదవి ఇచ్చారని టాక్‌. 

ఇక ఏపీలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, పాలక మండళ్లను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ఏపీలో ఉన్న మొత్తం136 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా 56 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారు. మొత్తం 80 కార్పొరేషన్లకు చైర్మన్లు, 960 మంది డైరెక్టర్లను జగన్ రెడ్డి నియమించారు.

నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లకు కూడా నెలనెలా ప్రజల సొమ్ము పెద్ద మొత్తంలో జీతంగా అందుతుంది. గత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఒక్కో కార్పొరేషన్ చైర్మన్ కూ నెల జీతంగా లక్ష రూపాయలు ముట్టజెపుతుంది ప్రభుత్వం. అలా చూసుకుంటే ఏపీలోని మొత్తం 136 మంది నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. అంటే వారికి నెల నెలా కోటీ 36 లక్షల రూపాయలు జీతంగా అందుతుంది. దాంతో పాటుగా ఒక్కో నామినేటెడ్ చైర్మన్ కు ప్రభుత్వ క్వార్టర్ ఉంటే సరి.. లేదంటే ప్రతి నెలా ఒక్కొక్కరికీ 50 వేల రూపాయలు ఇంటి అద్దెగా చెల్లిస్తుంది. అంటే ప్రతి నెలా వారి ఖాతాల్లోకి ఇంటి అద్దె రూపేణా 68 లక్షల రూపాయలు వెళ్లిపోతాయి. వారు అద్దె ఇంట్లో ఉన్నా లేక సొంతింట్లో ఉన్నా అంతే మొత్తం వారికి అందిపోతుంది. ఒక్కో చైర్మన్ కు ప్రభుత్వమే వాహనం సమకూరిస్తే సరి.. లేదంటే వెహికల్ అలవెన్స్ కింద నెలకు మరో 50 వేల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తుంది. అంటే ఈ మొత్తం కూడా నెలకు 68 లక్షల రూపాయలన్నమాట. దాంతో పాటుగా ఒక్కో నామినేటెడ్ చైర్మన్ కు ఆల్ ఇండియా సర్వీస్ అధికారి లేదా మంత్రితో సమానంగా వైద్య సదుపాయాలు ఉంటాయి. ఇక ఒకసారి గ్రాంట్ కింద ఒక్కో చైర్మన్ కు వంటింటి పాత్రలు, ఇతర సామాన్ల కోసం లక్షా 50 వేల రూపాయలు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా చూస్తే ఏపీలోని మొత్తం నామినేటెడ్ చైర్మన్లకు కోటీ 4 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇంకో విషయం ఏమంటే.. ఒక్కో చైర్మన్ కు ఇంటికి సంబంధించిన ఫర్నీచర్ కోసం 3 లక్షల రూపాయలు ఖర్చు చేయవచ్చు. అలా చూస్తూ.. ఏపీలోని 136 మంది నామినెటెడ్ చైర్మన్లకు మొత్తం 4 కోట్ల 8 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్న మాట.

కార్పొరేషన్ల చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమితులైన వారికి రాజకీయ పునరావాసంలో భాగంగానే ఇలాంటి పదవులు వరిస్తాయనే వ్యాఖ్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాక, ఒకవేళ వచ్చినా గెలవని అత్యంత ఆప్తుల కోసం ఇలా నామినేటెడ్ పోస్టుల పందేరం చేస్తారంటారు. ఇలాంటి వారికి కూడా జీత, భత్యాల పేరుతో పెద్ద మొత్తంలో ప్రజల కష్టార్జితాన్నే దోచిపెడుతుండడం గమనార్హం. ఇలా ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం కార్పొరేషన్ పదవుల పేరుతో ఏలినవారి అస్మదీయులకు, పార్టీకి సేవలు చేసినవారి జేబుల్లోకి పోతుండడం విశేషం. జగన్మోహన్ రెడ్డి ఇంత మంది సలహాదారుల నుంచి ఎలాంటి సలహాలు స్వీకరిస్తున్నారో తెలియదని రాజకీయ, ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. అసలే ఆర్థికంగా దిగజారిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఏపీ. ఎలాంటి అభివృద్ధీ లేకుండా కునారిల్లిపోతున్న ఏపీకి ఇలా సలహాదారులు, కార్పొరేషన్ల పేరుతో కోట్లకు కోట్లు దోచిపెట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమా? అనే ప్రశ్న ఆర్థిక, రాజకీయ రంగాల నిపుణుల నుంచి వస్తోంది. అయితే.. ఇలా జనం సొమ్మును స‌ల‌హాదారుల పాలు చేస్తున్న జ‌గ‌న‌న్న మాత్రం.. ఎవరి సలహాలూ అడగరని.. ఇచ్చినా తీసుకోరని అంటారు. అంత‌మాత్రానికి మ‌రెందుకు ఇంత‌మంది స‌ల‌హాదారులనేదే అస‌లు ప్ర‌శ్న‌. జ‌గ‌న‌న్నా.. మ‌జాకా..!!

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.