ప్యాకేజీ ఏది జగన్.. ఎమ్మెల్యే కొడుకు కీచక పర్వం.. బీజేపీ హ్యాండ్సప్.. మిథాలీ టైమ్.. టాప్ న్యూస్@1PM

Publish Date:Jan 6, 2022

Advertisement

సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పోల‌వ‌రం నిర్వాసితుల‌ స‌మ‌స్య‌లు త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించి, వారి దీక్ష‌లు విర‌మింప‌జేయాలన్నారు. అంద‌రికీ చ‌ట్ట‌ప్ర‌కారం పున‌రావాసం క‌ల్పించాలన్నారు. ఆర్అండ్ఆర్‌ ప్యాకేజీ అంద‌రికీ ఇవ్వాలన్నారు. సీఎం గ‌తంలో ప్ర‌క‌టించిన 10 ల‌క్ష‌ల ప్యాకేజీ అందించాలని నారా లోకేష్ కోరారు. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టాన్ని అమ‌లు చేయాలన్నారు.
-------
 ఫిట్‌మెంట్‌తో పాటు అన్ని డిమాండ్‌లను సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావిస్తామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.తెలంగాణ, తమిళనాడులో ఎక్కువ ఫిట్ మెంట్ ఇచ్చారని, 27 శాతం ఐఆర్ ఇస్తున్నారన్నారు. ఏపీలో అంతకంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఉండాలని కోరతామన్నారు. 27 శాతం కన్నా తక్కువ ఫిట్ మెంట్ ఇవ్వడం వారికి మర్యాద కాదన్నారు. 27 శాతం కంటే తక్కువ ఇస్తే ఉద్యోగుల జీతాలు తగ్గుతాయన్నారు. 
------
రాష్ట్రానికి బీజీపీ ఒక శనిగ్రహమని.. టీడీపీ, వైసీపీలు రాహుకేతువులని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలిపారు. బీజేపి ఒక మోసకారి పార్టీ అని.. టీడీపీ అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. వైసీపీ అరచేతిలో కైలాసం చూపిస్తోందన్నారు. దుష్ఠత్రయ పార్టీలైన బీజేపీ, టీడీపీ, వైసీపీలను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుందని తులసిరెడ్డి పేర్కొన్నారు. 
--------
కడప జిల్లా జమ్మలమడుగులో ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుంది. సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ దేవగుడి కుటుంబ సోదరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.  బీజేపీనేత మాజీమంత్రి  ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత నారాయణరెడ్డి.. ఇరుపార్టీ నేతల ప్లెక్సీలను చించివేశారు. అయితే సీపీ ఫుటేజీతో ఎవరు చించారనేది బయటపడింది. దీంతో  గొడవలు జరగకుండా ముందస్తుగా పోలీసులు అప్రమత్తమయ్యారు. 
-----
సిమెంటు, ఇసుక రేట్లు తగ్గించి భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్ సర్కార్‌కు సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంలో ఉన్న శ్రద్ధ సిమెంటు, ఇసుక ధరలు తగ్గించడంలో లేదెందుకని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత రెండున్నర ఏళ్ళ కాలంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. అల్ట్రాటెక్, భారతి సిమెంట్ రేట్లు అధికంగా ఉన్నాయన్నారు
-------
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ కీచక పర్వానికి ఓ కుటుంబం బలైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసిన ఆవేదన చూస్తే సభ్యసమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. తక్షణం రాఘవను అరెస్టు చేయాలని, ఎమ్మెల్యే గా వనమాతో రాజీనామా చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
-------
భారీగా డ్రగ్స్‎ను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్‌ వేడుకల కోసం పెద్ద ఎత్తున్న ముంబై నుంచి హైదరాబాద్‎కు డ్రగ్స్‌‎ను తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ ముఠా డ్రగ్స్‎ను ఎక్కడికి సరఫరా చేసిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
--
పంజాబ్ లో నిన్న ప్రధాని మోదీ కాన్వాయ్ ని అడ్డుకున్న ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ పై ఆగిపోయింది. ఈ ఘటనకు తామే కారణమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించుకుంది. ప్రధానికి నిరసనను తెలిపేందుకు పియారియానా గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు వచ్చామని తెలిపింది. 
---
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా 'అఖండ' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 14న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇంతకు ముందు ప్రకటించింది. అయితే కొంత ఆలస్యంగా స్ట్రీమింగ్ 21 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు ఇప్పుడు తెలిపింది. 
---
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 పోటీలకు వెటరన్ క్రికెటర్ మిథాలీ రాజ్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెనుగా ఉండగా, మిథాలీ రాజ్ భారత్‌కు నాయకత్వం వహించనుంది.ఆల్ ఇండియా ఉమెన్స్ సీనియర్ సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్ టూర్,షో పీస్ ఈవెంట్ కోసం జట్లను ఎంపిక చేసిందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
-------

By
en-us Political News

  
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.