మంచుకు మెగా పంచ్‌.. స‌జ్జ‌ల‌కు ఉద్యోగుల వార్నింగ్.. టాప్ న్యూస్ @ 7pm

Publish Date:Oct 12, 2021

Advertisement

1. ‘‘మా’’ లో ముస‌లం ముదిరింది. ప్ర‌కాశ్‌రాజ్‌ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు త‌మ పదవులకు రాజీనామా చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి కార‌ణాలు వివ‌రించారు ప్ర‌కాశ్‌రాజ్‌. ‘‘మా ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయి. బెనర్జీపై చేయి చేసుకున్నారు. పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు చాలా బాధ కలిగించాయి. అందుకే రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై అందరం కూర్చుని చర్చించాం. ‘మా’ ఎన్నికలలో గెలిచిన విష్ణు‌కి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు మా ప్యానల్‌లో గెలిచిన వారందరం రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. విష్ణు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం’’ అని ప్ర‌కాశ్‌రాజ్ అన్నారు.

2. మోహన్‌బాబు తనని అందరి ముందు దారుణంగా బూతులు తిట్టటం బాధ కలిగించిందని న‌టుడు బెనర్జీ కంట‌త‌డి పెట్టారు. మంచు కుటుంబంతో తనకు ఎన్నో దశాబ్దాల అనుబంధం ఉందని.. అటువంటి తనని మోహన్‌బాబు తీవ్రమైన పదజాలంతో దూషించటం తీవ్రంగా బాధించిందని బెనర్జీ మీడియా ముందు కంటతడి పెట్టారు. మా ఎన్నిక‌ల రోజు మంచు విష్ణు, మంచు మ‌నోజ్ లేకుంటే.. మోహ‌న్‌బాబు చేష్ట‌ల‌కు తమ మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగేద‌న్నారు ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు.

3. పిల్ల‌లకు 'కొవాగ్జిన్‌' టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమ‌తించింది. 2 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ వేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. గత నెలలో పిల్లలపై రెండు, మూడు దశల్లో ప్రయోగాలు చేసి.. ఆ వివరాలను భార‌త్ బ‌యోటిక్ సంస్థ డీసీజీఐకి తెలియజేస్తూ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. స‌మాచారం పరిశీలించిన డీసీజీఐ.. పిల్ల‌ల‌కు కొవాగ్జిన్ వేసేందుకు అనుమతి ఇచ్చింది.

4. విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని అమ్మ‌వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంత‌కుముందు.. తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం జ‌గ‌న్ సమీక్ష నిర్వహించారు. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోసేవా, నవనీత సేవలపై సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు అధికారులు.

5. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం భేటీ వివ‌రాల‌ను ఏపీజేఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు తెలిపారు. ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటోన్న సమస్యలను సజ్జల దృష్టికి తెచ్చాం. దసరా కానుకగా ప్రభుత్వం పీఆర్సీ ఇస్తుందని ఆశిస్తున్నాం. 12వ తేదీ వచ్చినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు రావడం లేదు. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బులు రావడం లేదు. ప్రతి నెలా ఒక‌ట‌వ‌ తారీఖున వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాం.. అని బండి శ్రీనివాసులు అన్నారు.

6. కృష్ణా, గోదావ‌రి బోర్డుల ప‌రిధిని నిర్ణ‌యిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేష‌న్ ఈ నెల 14 నుంచి అమ‌ల్లోకి వ‌స్తున్న‌ట్టు కేఆర్ఎంబీ ప్ర‌క‌టించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్ అవుట్‌లెట్ల‌ను బోర్డు ప‌రిధిలోకి తీసుకోనున్న‌ట్టు తెలిపింది. దీంతో శ్రీశైలం, నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్ అవుట్‌లెట్లు బోర్డు ప‌రిధిలోకి వెళ్ల‌నున్నాయి. ఇందుకు తెలుగురాష్ట్రాలు స‌హ‌క‌రించాల‌ని కేఆర్ఎంబీ విజ్ఞప్తి చేసింది. 

7. ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీకి రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 7.14 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు 20 ఏళ్లలో చెల్లించే విధంగా అప్పు చేసింది. మరో రూ. వెయ్యి కోట్లు 7.13 శాతం వడ్డీకి 15 ఏళ్లలో చెల్లించే విధంగా రుణం సేకరణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా అనుమతించిన రూ.10,500 కోట్లలో.. ఇప్పటికే రూ.8వేల కోట్లు బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం సేకరించింది. వచ్చే వారంతో కేంద్రం అనుమతించిన అదనపు పరిమితి నిధులు మొత్తం వ్యయం అయ్యే అవకాశముంది. బాండ్ల వేలం ద్వారా సేకరించిన రూ.2వేల కోట్లతో మిగిలిన తమ పెన్షన్లు, వేతనాలు వస్తాయని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు.

8. ఎంపీ విజయసాయిరెడ్డిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. విజయసాయి సేవలను ఢిల్లీలో ఉపయోగించుకునేందుకే.. ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను, విజయసాయి కలిసి ఢిల్లీలో పని చేస్తామని రఘురామ తెలిపారు. జగనన్న ట్రూ చార్జ్‌తో ప్రజలకు కష్టాలు వస్తే.. ఇప్పుడు జగనన్న కరెంట్‌ కోత పేరుతో కొత్త పథకం అమలు మొదలైందంటూ దుయ్య‌బ‌ట్టారు ఎంపీ ర‌ఘురామ‌. 

9. హెటిరోలో తవ్విన కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. 16 లాకర్లను ఐటీ అధికారులు ఓపెన్ చేసి.. భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క లాక‌ర్‌లో రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల నగదు ఉంది. లాక‌ర్ల‌లోని రూ.30 కోట్ల క్యాష్‌ను ఐటీ అధికారులు సీజ్‌ చేశారు. ఇప్పటికే రూ.142 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.550 కోట్ల అనుమానిత లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. 20లోపు తమ ఎదుట హాజరవ్వాలని హెటిరో యాజ‌మాన్యానికి ఐటీ నోటీసులు జారీ చేసింది.

10. మానవ హక్కులను నచ్చినట్లుగా వివరిస్తున్నవారిపై ప్రధాని మోదీ మండిప‌డ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను రాజకీయ లాభ, నష్టాల దృష్టితో చూసే వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. వీరి వైఖరి మానవ హక్కులకు మాత్రమే కాకుండా దేశానికి కూడా హానికరమన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా మోదీ మాట్లాడారు. 
 

By
en-us Political News

  
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.