Publish Date:Oct 12, 2021
వివాదాలకే కేరాఫ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా వివాదమే. వివాదం అయ్యేలానే ఆయన వ్యవహారశైలి, ఆయన తీరు ఉంటుందని అంటారు. వర్మ సినిమా తీసినా... ఎవరినైనా టార్గెట్ చేసినా... ఏ సమస్యపై అయినా స్పందించినా అది సంచలనంగానే ఉంటుంది. కొన్నేండ్లుగా అలా జరుగుతూనే ఉంటోంది. రాజకీయాల్లోనూ ఆయన తలదూర్చి రచ్చ చేస్తుంటారు. అయితే ఎక్కువగా ఏపీ విషయాలపైనే ఆయన రియాక్ట్ అవుతుంటారు. తెలంగాణ అంశాలపై స్పందించినా.. ఏపీతో పోలిస్తే చాలా తక్కువ.
వరంగల్ జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్లు కొండా దంపతుల బయోపిక్ తీసే పనిలో ఉన్నారు రాంగోపాల్ వర్మ. కొండా సురేఖ, మురళీ సమక్షంలో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. కొండా దంపతుల బయోపిక్ ఎలా ఉంటుందన్నదే వివాదంగా మారగా... తాజాగా మరో సంచలనానికి తెర తీశారు వర్మ. సినిమా షూటింగ్ కోసం వరంగల్ లో పర్యటిస్తున్న రాంగోపాల్ వర్మ.. చిత్రయూనిట్తో స్థానిక మైసమ్మ టెంపుల్ను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి విస్కీని సాకగా పోస్తూ(తాగిస్తున్నట్టు) ఓ ఫొటోను తన ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. అంతేకాదు ‘నేను వోడ్కా మాత్రమే తాగినప్పటికీ, మైసమ్మ దేవతను విస్కీ తాగేలా చేసాను’ అంటూ ట్వీట్ చేయడంతో రాంగోపాల్ వర్మపై దుమారం రేగుతోంది.
సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లపై ఆర్జీవీ వేసే సెటైర్లను అంతగా పట్టించుకోని నెటిజన్లు.. మైసమ్మకు విస్కీ పోయడంపై మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోస్తున్నారు. హిందూ దేవుళ్లపై నమ్మకం లేకపోతే వదిలేయండి కానీ, తరతరాలుగా వస్తున్న ఆచరాలను హేళన చేయకండి అంటూ హిందూ బంధువులు మండిపడుతున్నారు. కత్తి మహేష్కు పట్టిన గతే ఆర్జీవీకి పడుతోంది అంటూ కొందరు బండ బూతులు తిడుతున్నారు. ఇతర మతాలపై కూడా ఇదే విధంగా వ్యవహరిస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చెప్పుతో కొట్టేవారు లేక ఇలాంటి చేష్టలు చేస్తున్నాడని.. మైసమ్మ తల్లితో ఆటలు ఆడొద్దు అంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ramgopal-verma-mysamma-temple-whisky-goes-viral-39-124455.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.