మరో మైలు రాయిని చేరుకున్న తెలుగువన్
Publish Date:May 29, 2026
Advertisement
తెలుగు డిజిటల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న తెలుగువన్ మరో మైలు రాయిని చేరుకుంది. నిరంతరం విశ్వసనీయమైన వార్తలను అందిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న తెలుగువన్ న్యూస్ (tone news) తాజాగా 1 మిలియన్ సబ్స్క్రైబర్ల క్లబ్లో చేరింది. టెక్నాలజీ, రాజకీయాలు, వినోదం సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ తెలుగువన్ డిజిటల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ అద్భుత విజయంపై తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. తమను నిరంతరం ఆదరిస్తూ, నమ్మకమైన ఛానెల్గా నిలబెట్టినందుకు కోట్లాది మంది తెలుగు వీక్షకులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. '1 మిలియన్ స్ట్రాంగ్ అనే నినాదంతో ఛానెల్ మున్ముందు మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలతో ముందకు సాగుతుందన్నారు. సంచలనాల కోసం కాకుండా, వాస్తవాలను చేరవేయడమే ధ్యేయంగా పెట్టుకోవడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. 10 లక్షల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నప్పటికీ.. సబ్స్క్రైబర్ల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టిస్తామని చెప్పారు. మిలియన్ సబ్ స్క్రిప్షిన్స్ మైలు రాయిని చేరుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా ఎండీ రవిశంకర్ , తెలుగువన్ న్యూస్, బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/tone-news-reached-another-mile-stone-36-221229.html





