అమరావతిలో తిరుమల.!

Publish Date:Jul 7, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని  అమరావతిలో తిరుమల  వెలుస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం  శ్రీకారం చుట్టింది.  రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలోని  శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ  260 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న భారీ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో నిర్మితం కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిపూజను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాస్త్రోక్తంగా నిర్వహించి  శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ   ప్రాజెక్టును కేవలం రెండున్నరేళ్ల కాలపరిమితిలోనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

ఈ   ప్రాజెక్టును మొత్తం రెండు విడతల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత పనుల కోసం  140 కోట్ల రూపాయలు కేటాయించారు.  మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన   ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా   ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు. వీటితో పాటు ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఆంజనేయస్వామి ఆలయం,  పుష్కరిణి , అలాగే ఆలయ పరిసరాల అంతటా సుందరమైన కట్-స్టోన్ ఫ్లోరింగ్ పనులను ఈ విడతలో పూర్తి చేయనున్నారు. అమరావతి నగరానికి వచ్చే భక్తులకు తిరుమల దివ్య క్షేత్రాన్ని దర్శించిన అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా ఈ నిర్మాణ శైలి ఉండ నుంది. 

ఇక రెండవ విడత పనుల కోసం రూ. 120 కోట్లను కేటాయించి భక్తుల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ఇందులో భాగంగా తిరుమల కొండ తరహాలోనే ఇక్కడ కూడా ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆలయానికి అనుసంధానంగా ఉండే ప్రధాన రహదారులను విస్తరించనున్నారు. వేలాది మంది భక్తులకు నిత్యం అన్నప్రసాద వితరణ చేసేందుకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన భారీ అన్నదానం కాంప్లెక్స్, అలాగే భక్తులకు   వసతి గృహాలు,  ఆలయ అర్చకులు,   ఇతర సిబ్బంది నివాస సముదాయాలను నిర్మించనున్నారు. 

వాస్తవానికి  2019 కంటే ముందే కృష్ణా నది తీరాన దాదాపు 25.4 ఎకరాల సువిశాల స్థలంలో తిరుమల ఆలయ ప్రతిరూపాన్ని నిర్మించాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి భూమిని కేటాయించింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తగ్గించి, పనులను దాదాపు నిలిపివేసింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను మళ్లీ వేగవంతం చేసి, అమరావతిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు ఈ భారీ విస్తరణ ప్రణాళికను పునరుద్ధరించారు. రాజధాని అమరావతిని దైవసంకల్పంతో కూడిన నగరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభివర్ణించారు.  

Amaravati TTD Temple, Sri Venkateswara Swamy Temple Amaravati, Chandrababu Naidu Temple Foundation

By
en-us Political News

  
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై  కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని వి మార్క్ ఇండియా మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కరోజే 81% పతనమైందా ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో, 5:1 బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు మార్కెట్ లెక్కలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.