ఆంధ్రప్రదేశ్లోని మన్యప్రాంత గ్రామాల్లో పెద్దపులి సంచారం బెంబేలెత్తిస్తోంది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్దపులి దాడిలో 14 లేగదూడలు చనిపోయాయి. మంగళవారం రాత్రి గ్రామ శివారులో పశువుల మందపై పెద్ద పులి దాడి చేసి 14 లేగదూడలను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో ఈ ప్రాంత ప్రజలు భయంతో వణికి పోతున్నారు.
ఉదయాన్నే పశువుల కాపరులు, యజమానులు తమ పశువుల శాలల వద్దకు వెళ్లేసరికి అక్కడ కనిపించిన దృశ్యాలు వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. రక్తం మడుగులో చెల్లాచెదురుగా పడి ఉన్న 14 దూడల మృతదేహాలను చూసి పశువుల యజమానులు గుండె లబోదిబోమన్నారు. తమ జీవనాధారమైన పశుసంపద ఇలా పులి పంజాకు బలికావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. ఈ ఘోర ఉదంతం చుట్టుపక్కల గ్రామాల్లో దావానలంలా వ్యాపించడంతో, గంగంపాలెంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఇప్పుడు బయటకు రావాలంటేనే భయంతో గజగజలాడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖఅధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పెద్ద పులిని వీలైనంత త్వరగా బంధించడానికి రాపిడ్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దించి ఒక ప్రత్యేక ఆపరేషన్ను ప్రారంభించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tiger-kills-14-calves-36-221636.html
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.