వైసీపీ ఎంపీల కాషాయం బాట?.. కారణమేంటంటే?

Publish Date:Jun 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం అనిపించే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే రాజకీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ నుంచి త్వరలో భారీ వలసలు ఉండే అవకాశం ఉందన్న చర్చ ఏపీ రాజకీయవర్గాలలో జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన  ముగ్గురు కీలక ఎంపీలు త్వరలోనే కాషాయం కండువా కప్పుకోనున్నారన్న వార్త  ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.  గత ఎన్నికల తర్వాత ఏపీలో  అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి తిరుగులేని ఐక్యతతో ముందుకు సాగుతోంది. అయితే..  ఆ ఎన్నికలలో ఘోర పరాజయం పాలై, కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోని వైసిపి పరిస్థితి మాత్రం నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారింది.  ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీ గూటికి చేరనన్నారన్నవార్తలు గట్టిగా వినిపిస్తుననాయి.   పార్లమెంటు ముంగిటకు రానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోనుందన్న వార్తలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

 పునర్విభజన బిల్లు  ఆమోదం పొందితే, ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా దాదాపు 80 అసెంబ్లీ స్థానాలు,  13 లోక్ సభ స్థానాలు పెరిగే  అవకాశం ఉంది.  ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గాలు పెరిగితే, భవిష్యత్ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీకిి  బలమైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని అంటున్యనారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆ పార్టీ నేతలకు తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోలన మొదలైందిజ ఈ నేపథ్యంలోనే వచ్చే కొద్దిరోజులలో  వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.  

ఈ మారుతున్న పరిణామాలను గమనించిన జనసేన పార్టీ ఇప్పటికే ప్రత్యేకంగా ఒక చేరికల కమిటీని ఏర్పాటు చేసి, వలసలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి  ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వచ్చే రాజకీయ లబ్ధిని అందిపుచ్చుకోవడానికి ఈ ఎంపీలు కమలం గూటికి చేరడమే ఉత్తమ మార్గమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

డీలిమిటేషన్  బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరగడం అన్నది కేవలం నంబర్స్ మాత్రమే కాదు.. అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసే కీలక పరిణామంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే..   వైసిపికి, ఆ పార్టీలో కొనసాగితే.. తమకూ రాజకీయ భవిష్యత్ లేదని భావిస్తున్న ఆ పార్టీకి చెందిన నేతలు.. పార్టీ మారడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ముగ్గురు వైసీపీ ఎంపీలు కమలం గూటికి చేరడానికి రెడీ అయిపోయారని చెబుతున్నారు. అయితే  ఈ వలసల పర్వం ఈ ముగ్గురితో ఆగే అవకాశం లేదనీ, ముందు ముందు మరింత మంది వైసీపీయులు కూటమి పార్టీలలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.