ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగానే..!

Publish Date:Apr 15, 2026

Advertisement

ఈ వేసవి తెలుగు రాష్ట్రాలను నిప్పుల గుండంగా మారుస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.  ఈ నెల   19 నుండి వచ్చే నెల 31 వరకు ఎండల తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.  ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత  కిరణాల ప్రభావం భూమిపై నేరుగా పడే అవకాశం ఉన్నందున, చర్మ సంబంధిత వ్యాధులు రావడమే కాకుండా, వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా లేదా నీరసంగా అనిపించినా తక్షణమే వైద్యులను సంప్రదింలని చెబుతున్నారు. 

ఎండల తీవ్రత నేపథ్యంలో వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కార్లలో గ్యాస్ లైటర్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు, బ్యాటరీలు లేదా కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంచడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అధిక వేడి వల్ల ఇవి పేలిపోయే అవకాశం ఉంది. అలాగే వాహనాల్లో ఇంధనాన్ని పూర్తిగా నింపకుండా కొంత ఖాళీ ఉంచడం,  టైర్లలో గాలి మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవడం అవసరమని చెబుతున్నారు. 

ఇళ్లలో ఉండేవారు గదుల్లో గాలి ధారాళంగా ఆడేలా కిటికీలు తెరిచి ఉంచాలనీ, అలాగే విద్యుత్ పరికరాలపై లోడ్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచిస్తున్నారు. ఇక పోతే గ్యాస్ సిలిండర్లను నేరుగా సూర్యరశ్మి పడే చోట ఉంచకూడదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చల్లని పానీయాలైన మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవడం ద్వారా డీహైడ్రుషన్ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలుంటాయి.

ఇక పెంపుడు జంతువుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఏసీలను  24-25 డిగ్రీల వద్ద ఉంచుకోవడం వల్ల విద్యుత్ ఆదా అవడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతినదు. రాబోయే రెండు నెలలు  భానుడి ప్రతాపం అధికంగా ఉంటుంది కనుక అందరూ జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

By
en-us Political News

  
ప్రపంచ చమురు రవాణాలో 20శాతం కంటే ఎక్కువ భాగం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. అయితే ఇరాన్, ఆ తరువాత అమెరికా అమెరికా నావికాదళ దిగ్బంధన ఆదేశాల కారణంగా గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. అయితే ఈ పరిస్థితులలో కూడా భారత్ వృద్ధి అంచనాను ఐఎమ్ఎఫ్ పెంచడం సానుకూల సంకేతమనే చెప్పాలి.
ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడింది. అయితే ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు. నాలుగు మ్యాచ్ లలో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో పాయింట్ల పట్టికలో అడుగు నుంచి తొలి స్థానంలో నిలిచింది.
ఎండీ జాకీర్ ఉస్మాన్, బషీర్‌బాగ్‌కు చెందిన జువెలర్ సుఖేష్ గుప్తా కలిసి నిజాం కాలం నాటి విలువైన ఆభరణాల్లో వాటా ఇస్తామని చెప్పి తన నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని అగర్వాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
చిన్న వయస్సులోనే కాలేయ సమస్యల బారిన పడటం వల్ల వారి ఉత్పాదకత దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. అయితే కాలేయ వ్యాధులు ప్రారంభంలోనే గుర్తిస్తే 90 శాతం వరకు తిరిగి నయం చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఖరీదైన మందుల కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలే ప్రధానమైన పరిష్కారం.
1990 నుంచి 2023 వరకు దేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి విస్తరణలో 23% పెరుగుదల ఉంది. అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో ఫ్యాటీ లివర్ కేసులు 23% కంటే ఎక్కువగా పెరిగాయి. నగర ప్రాంతాల్లో ఇది 9 నుంచి 32 శాతం పెరుగుదల ఉండగా, రాష్ట్రాల్లో అయితే ఏకంగా 60శాతం వరకూ చేరినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమ్యానికి చేరుకోవడానికి కేవలం ఇరవై నిమిషాల దూరంలో ఉన్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం రెండు ప్రాణాలను బలితీసుకుంది. అదే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Publish Date:Apr 14, 2026
ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చేనెల 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఆ లోగా తమ సమస్యలు పరిష్కరించాలనీ లేకుంటే థియేటర్ల మూత తప్పదని స్పష్టం చేసింది.
జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు.
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు.
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.