Publish Date:May 10, 2023
అమరావతి భూములను పేదలకు దక్కకుండా చేయడంలో ప్రభుత్వ కుట్రను
అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి (జే ఏ సీ) నేత పువ్వాడ సుధాకర్ రావు బయట పెట్టారు. రాజకీయ స్వార్థంతో కూడినటువంటి నిర్ణయం వలన ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు రాజధాని అమరావతిలో ఉచితంగా ఇంటిని పొందే అవకాశాన్ని ఈ ప్రభుత్వం భూస్థాపితం చేస్తుందన్నారు. వారికి శాశ్వతంగా రాజధానిలో నివాసాన్ని లేకుండా చేస్తుందని ఆయన ఆరోపించారు.
‘‘అమరావతి రాజధాని లో గత ప్రభుత్వ హయాంలో 44 ఎకరాలలో 5024 అత్యంత మన్నిక గల, గౌరవప్రదమైన టిడ్కో ఇళ్లను నిర్మించడం జరిగినది అనగా ఒక ఎకరమునకు 114 ఇళ్లను నిర్మించడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రస్తుతం 1134 ఎకరాలతో పాటు ఇప్పుడు అదనంగా కోరిన 268 ఎకరాలను కలుపుకొని మొత్తం 1402 ఎకరాలలో సుమారుగా 50వేల మందికి సెంటు భూమిని పంపిణీ చేస్తుంది. అనగా ఒక ఎకరం 35 కుటుంబాలకు కేటాయిస్తుంది, అదే 1402 ఎకరాలలో టిడ్కో ఇళ్ల నిర్మాణం తరహాలో ఎకరానికి పైన పేర్కొన్న విధంగా ఎకరం ఒక్కింటికి 114 ఇళ్ల చొప్పున 160000 కుటుంబాలకు ఇళ్లను నిర్మించవచ్చు.ప్రభుత్వ స్వార్థపూరిత నిర్ణయం వలన, అమరావతి రాజధాని విధ్వంసకర కుట్రకు పాల్పడటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న సుమారుగా 110000 ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు అమరావతి రాజధాని లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉచితంగా ఇంటిని పొందే మహత్భాగ్యాన్ని, అమరావతి రైతుల త్యాగ ఫలితంగా ఏర్పడిన సువర్ణ అవకాశాన్ని ఈ ప్రభుత్వం సమూలంగా నాశనం చేయడం కాదా?
ఇది కాదా మోసం? ఇది కాదా దుర్మార్గం? ఇది కాదా ప్రభుత్వ దుందుడుకు చర్య?ఈ ప్రభుత్వం కాదా పేదల పాలిట శాపం?వాస్తవాలను నిర్భయంగా ప్రకటిద్దాం.పేదల పక్షాన నిలబడదాం.ఈ ప్రభుత్వ కుట్రలను చేదిద్దాం ప్రభుత్వాన్ని నిలదీద్దాం పేదవాడిని గెలిపిద్దాం’’ అని పువ్వాడ సుధాకర్ పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-is-governement-conspiracy-25-155061.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.