Publish Date:Oct 25, 2024
సలీం పెయింటింగ్స్ వేసి కుటుంబాన్ని పోషించుకునే వాడు. సలీం భార్యకు ఇది నచ్చేది కాదు. తన భర్త పెద్ద వ్యాపారిగా స్థిర పడలేదని భార్య ఆవేదన చెందేది. సలీంతో ప్రతీరోజు గొడవపడేది. మేరా బద్ కిస్మతీ( నా దురదృష్టం) అని గొడవపడేది. సలీం అన్నదమ్ములు బాగా సెటిలయ్యారు. పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు. సలీం పరిస్థితి దిగ జారిపోవడంతో చుట్టాల్లో చులకనభావం అయ్యాడు . చివరకు ఫంక్షన్స్ కు కూడా ఆహ్వానం అందడం లేదు. మనస్థాపానికి గురైన సలీం మౌలానా దగ్గరికి వచ్చాడు.
సలీం: సలాం వాలేకుం మౌలానా సాబ్
మౌలానా: వాలేకుం సలాం సలీం భాయ్ , కైరియత్
సలీం: అల్ హమ్ దు లిల్లా మౌలానా సాబ్... జీ మౌలానా సాబ్ మేరా పైదాయిష్ ఏత్తే ఫాక్ సే ( నా పుట్టుక అనుకోకుండా జరిగింది) అంటూ నిట్టూర్చాడు.
మౌలానా: డార్విన్ సిద్దాంతం ప్రకారం భూమిపై 2000 మిలియన్ సంవత్సరాల క్రితం జీవాల పుట్టుక జరిగింది. ఇది సైన్స్ ప్రకారం చూస్తే బయటపడిన నిజం.
తొలుత ఏకకణ జీవులు, ఆ తర్వాత బహుళ సెల్యులార్ జీవులు క్రియాశీలకంగా మారాయి.
దవడలేని చేపలు పరిణామం చెందాయి. తరువాత, ఉభయచరాలు, సరీసృపాలు మరియు కొన్ని క్షీరదాలు ఉనికిలోకి వచ్చాయి.
ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. వారి శారీరక లక్షణాలు, ప్రవర్తన మొదలైన వాటిలో ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.
కొన్ని లక్షణాలు వారి తల్లిదండ్రుల నుండి సంతానానికి వారసత్వంగా సంక్రమిస్తాయి.
అన్ని జీవ జాతులలో పునరుత్పత్తి రేటు మారుతూ ఉంటుంది. కొన్ని ఎక్కువ కొన్ని కనిష్టంగా పునరుత్పత్తి చేస్తాయి.
లక్షణాలు లేదా వ్యక్తిత్వాలు తరచుగా తల్లిదండ్రుల నుండి సంతానానికి సంక్రమిస్తాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన అల్లాకి తెలియకుండా ఏదీ జరగదు .. అన్నీ ఆయన కనుసన్నల్లో జరిగినవే. ఎవరికి సంపద ఇవ్వాలో ఎవరి సంపద ఇవ్వకూడదో అన్నీఆయనకు తెలుసు. మనిషి పుట్టుక కోసమే ఈ ప్రపంచం ఆవిష్కృతం అయ్యింది. 50 , 60 ఏళ్ల జీవితానికే మనిషి కలలు కంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు.కొన్ని వేల మిలియన్ సంవత్సరాల క్రితమే సృష్టి జరిగింది. మనం చనిపోయిన తర్వాత కూడా ఈ సృష్టి అలానే ఉంటుంది. మనిషి కేరక్టర్ అతి చిన్నది. మంచి పనులు చేయడానికే మనిషి జన్మనెత్తాం. ఆ పనులు చేసి వెళ్లిపోవాలి. మనిషికి ఆక్సిజన్ అత్యంత ఆవిశ్యం. . ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండానే దేవుడు సహజసిద్దమైన ఆక్సిజన్ తయారు చేస్తున్నాడు ప్రకృ తి ద్వారా అది మనకందుతుంది. త్రాగడానికి నీళ్లు అవసరం కాబట్టి మేఘాలు గర్జించగానే వర్షం పడుతుంది. భూమిలో ఫిల్టర్ అయ్యే ఏర్పాట్లను కూడా అల్లా చేశాడు. గాలి, నీళ్ల తర్వాత రొట్టె ముఖ్యమైన ఆహారం. అది కూడా మనకు భూమి ద్వారా ఇవి పొందుతూనే ఉన్నాం. దేవుడు ఈ సెటప్ చేసేశాడు. ఇస్లాం పుట్టుక నుంచే సైన్స్ ఉంది. శాస్త్రవేత్తలను ఇస్లాం అందించింది. బ్రిటీషు వారు వచ్చాక ఇస్లాం సైంటిస్ట్ లు మరుగన పడ్డారు. ఈ విషయం ఖురాన్, హదీస్ లో కూడా ఉంది. అల్లా సంకల్పం తో మనిషి పుట్టుక జరిగింది.
ఎంటర్ టైన్ మెంట్ కోసమే మనిషి పుట్టుక ఉండ కూడదు. కోరికలు ఉండకూడదు.లక్ష్యాలు మాత్రం ఉండాలి. ఏదీ ఆశపడకూడదు. అల్లా సంకల్పిస్తే ఇస్తాడు. సంకల్పించకుంటే ఇవ్వడు. ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే వారే తల్లిదండ్రులను వృద్దాశ్రమాలలో దించేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కోసమే బ్రిటీష్ వాళ్లు మత్తు పదార్థాలను పరిచయం చేశారు. మంచి పనులు చేయడానికే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటూ మౌలానా తన తక్రీర్( ప్రవచనం) ముగించాడు.
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-creation-is-for-the-birth-of-man-39-187400.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.