తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిపోక తప్పదా?

Publish Date:Jul 15, 2014

Advertisement

 

 స్వర్గీయ యన్టీఆర్ హయంలో తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకి రప్పించడం కోసం సినీ ప్రముఖుకు కొందరికి ప్రభుత్వం ఉదారంగా భూములు ఇచ్చి ప్రోత్సహించింది. వారందరూ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదులో స్థిరంగా నిలద్రోక్కుకొనేందుకు చాలా కృషిచేసిన మాట ఎవరూ కాదనలేరు. వాటిలో చాలా మంది సినీ ప్రముఖులు స్టూడియోలు, రికార్డింగ్ ధియేటర్లు వంటివి నెలకొల్పినప్పటికీ, కొందరు వాటిలో మల్టీ ప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్సులు వంటివి నెలకొల్పడం, మరి కొందరు ప్రముఖులు తమ స్టూడియోలకు కేటాయించిన భూములలో భవనాలు నిర్మించి వ్యాపార సంస్థలకు లీజుకు ఇవ్వడం, తమ భూములను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడంవంటి పనుల వలన సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ వారు రాష్ట్ర ప్రభుత్వాలతో, వాటిని నడిపే రాజకీయ నాయకులతో సత్సంబంధాల వల్ల వారు ఆడించే ఆట, పాడిందే పాటగా ఇన్నాళ్ళు నడిచింది. అయితే కాలం ఎల్లపుడు ఒక్కలాగే సాగదని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి.

 

సినీ పరిశ్రమలో చాలా మంది ఆంద్ర ప్రాంతానికి చెందినవారే అయి ఉండటంతో సహజంగానే వారు తెలంగాణకు వ్యతిరేకులనే భావన చాలా మందిలో ఉంది. పవన్ కళ్యాణ్ వంటి నటులు ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో తెరాస పార్టీని తీవ్రంగా విమర్శించడం ఆ వాదనలకు బలం చేకూర్చినట్లయింది. అదిగాక చిత్ర పరిశ్రమ చాలా కాలంగా కొందరు ఆంద్ర నిర్మాతల చేతిలో ఉండిపోవడంతో, పరిశ్రమలో తెలంగాణాకు చెందినవారు తమకు చాలా అన్యాయం జరుగుతోందనే అభిప్రాయంతో ఉన్నారు.

 

కొందరు వ్యక్తులు చేసిన తప్పులకు, దానివల్ల ఏర్పడిన వ్యతిరేఖత కారణంగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం కూడా ఇటువంటి అభిప్రాయాలే కలిగి ఉండటంతో అక్రమాలకు పాల్పడిన సినీ ప్రముఖులకు కేటాయించిన భూములను వెనక్కు తీసుకోవడం మొదలుపెట్టింది. అంతేగాక ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని నిశ్చయించుకొంది. ఆ లిస్టులో చాలా మంది సినీ ప్రముఖులే ఉన్నారు. గనుక వారందరూ ఇప్పుడు తీవ్ర అభద్రతా భావంతో ఉండటం సహజమే.

 

అయితే ఇప్పటికిప్పుడు హైదరాబాదు నుండి సినీ పరిశ్రమను ఏ వైజాగుకో తరలించడం సాధ్యమయ్యే పనికాదు గనుక తీవ్ర అభద్రతాభావంతో ఉన్న సినీ ప్రముఖులు వీలయినంత త్వరగానే పరిశ్రమను ఆంధ్రాకు తరలించే అవకాశం ఉంది. వారు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించినప్పటికీ, కొన్ని స్వయంకృతాపరాధాల వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. వాటికి తోడూ రాష్ట్ర విభజన వల్ల సినీ పరిశ్రమలో చీలికలు ఏర్పడటం, ప్రభుత్వం కూడా తెలంగాణా సినీ పరిశ్రమను, కళాకారులను ప్రోత్సహించాలని భావించడం వంటి అనేక కారణాలు తెలుగు సినీపరిశ్రమ ఆంధ్రాకు తరలిపోయేందుకు అవకాశం కల్పిస్తోంది.

 

బహుశః రానున్న ఒకటి రెండేళ్ళలోనే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు పూర్తిగా తరలివచ్చేసినా ఆశ్చర్యం లేదు. కానీ వారు దురాశకు పోయి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా ఇప్పుడయినా జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇటువంటి దుస్థితి కలగదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిరావడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూనే, ఎవరూ నిబంధనలు అతిక్రమించకుండా కటినంగా వ్యవహరించడం చాలా అవసరం.

By
en-us Political News

  
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.