బాబు నిర్ణయాలకు ‘దేశం’ బలి?
Publish Date:Sep 18, 2012
Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలకు ఆ పార్టీ బలపీఠం ఎక్కనుంది. పార్టీని పటిష్టం చేసే కంగారులో చంద్రబాబు ఎస్సీల్లో మాదిగలకు మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఒక వర్గానికైనా దగ్గరయ్యామని చంద్రబాబు చంకలుగుద్దుకున్నారు. తాజాగా మాదిగదండోరా రాష్ట్ర అధ్యక్షుడు మందాకృష్ణమాదిగ సొంతంగా రాజకీయపార్టీని నెలకొల్పనున్నారు. దీని కోసం ముమ్మరంగా ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. అయితే మాలలు తెలుగుదేశం పార్టీకి దూరం కావాలని నిశ్చయానికి వచ్చారు. వీరిని కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆకర్షిస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి మాలల ఓటుబ్యాంకు దూరమైంది. అయితే ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు మాదిగలను వర్గీకరణ పేరుతో దగ్గర చేసుకునేందుకు కసరత్తులు చేశారు. దీనిలో భాగంగానే వారితో కలిసి ఆందోళనకార్యక్రమాలు సాగిస్తున్నారు. అయితే మందాకృష్ణ పెట్టబోయే పార్టీలో అభ్యర్థులందరూ మాదిగలే. పైగా, దండోరా జిల్లా కమిటీల సహాయంతో పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్ల మాదిగలు వర్గీకరణ కోసమని చంద్రబాబుకు మద్దతు పలికినా, తిరిగి తమ పార్టీలోకి వెళ్లిపోతారు. కేవలం తెలుగుదేశం పార్టీలో ఏళ్ల నుంచి కొనసాగుతున్న మాదిగ సామాజికనేతలే మిగులుతారు. మాదిగల ఓటుబ్యాంకు మొత్తం మందాకృష్ణ వెనుకే నిలవాలని నిశ్చయించుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ వర్గీకరణ వైపు మొగ్గు చూపి ఒకవైపు మాలలకు, మరోవైపు మాదిగలకు దూరమయ్యే స్థితిలో ఉంది. దీన్ని పట్టించుకోకుండా చంద్రబాబు తమ వెనుక మాదిగలున్నారని భావించారు. వర్గీకరణ నిర్ణయాన్ని బలపరిచి చంద్రబాబు పార్టీని బలి చేశారని మాలలు అంటున్నారు. తమ మందాకృష్ణ మాట దాటి అడుగుకూడా కదపబోమని మాదిదిగలు చెబుతున్నారు. ఎస్సీల్లో కీలకమైన ఈ రెండు సామాజికవర్గాలూ దూరమయ్యాక మిగిలిన సామాజికవర్గాలు ప్రభావం అంతగా కనిపించదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
http://www.teluguone.com/news/content/telugu-desham-24-17453.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





