‘సర్వే’ జనాః సుఖినోభవంతు

Publish Date:Aug 18, 2014

Advertisement

 

ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా సర్వే జరుగబోతోంది. దానిపై ప్రజలలో, రాజకీయ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు ఈ సర్వేతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సర్వే కేవలం బోగస్ లబ్దిదారులను ఏరివేసి, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పధకాలను చేరవేయడానికేనని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగా చెపుతున్నప్పటికీ, తెదేపా నేత రేవంత్ రెడ్డి బయటపెట్టిన కేసీఆర్ ఇటీవల అధికారుల సమావేశంలో మాట్లాడిన ఒక సంభాషణల ఆడియో టేపు ఆంధ్రప్రజలలో కలకలం సృష్టిస్తోంది. వారిలో మరింత అభద్రతాభావం కలిగిస్తోంది.

 

తెలంగాణా ప్రజలకు మేలు చేయడానికి నిర్వహిస్తున్న ఈ సర్వే పట్ల ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ దానిలో స్థానికత అంశం గురించి ఉన్న ప్రశ్నలు తమనే లక్ష్యంగా చేసుకొన్నవని ఆంద్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈరోజు కాకపోతే రేపయినా ఈ సర్వే కారణంగా తాము ఏదో రూపంగా వివక్ష ఎదుర్కోక తప్పదని, తెలంగాణాలో స్థిరపడినందుకు గాను భారీ మూల్యం చెల్లించకతప్పదని వారు గట్టిగా నమ్ముతున్నందునే వారు ఈ సర్వేపట్ల విముఖత చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఆంధ్రా నుండి వచ్చి తెలంగాణాలో పరిశ్రమలు, ఉన్నత విద్యాసంస్థలు వగైరా నెలకొల్పినవారు, ప్రైవేట్ సంస్థలలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న ఉన్నత వర్గాల వారు తాము ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డులు, వృధాప్య పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు వంటివేవీ కోరకపోయినా తమపై బలవంతంగా ఈ సర్వేను ఎందుకు రుద్దుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ సర్వే భవిష్యత్తులో తమపై, తమ సంస్థలపై ప్రభావం చూపబోతోందనే ఆందోళన ఉన్నత వర్గాలలో సైతం వ్యక్తం అవుతున్నట్లు అర్ధమవుతోంది. తెలంగాణా ప్రభుత్వం మీడియా ద్వారా వారి సందేహాలను తీర్చేందుకు చాలా కృషి చేసినా, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తమపట్ల ప్రదర్శిస్తున్న విద్వేష వైఖరి కారణంగా ఆంద్ర ప్రజలలో ఆయన సర్వే గురించి చెపుతున్న మాటలను నమ్మడం లేదు. అందువలన ఈ సర్వేపై వారిలో అనుమానాలు పోలేదు.

 

కానీ వారి వాదనలను, భయాలను, అనుమానాలను అర్ధం లేనివని కొట్టిపారేస్తున్నారు తెలంగాణాకు చెందిన రాజకీయ నేతలు, విశ్లేషకులు. తెలంగాణా ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను అనుభవిస్తూ, వాటిని అందిస్తున్న ప్రభుత్వానికి సహకరించబోమని చెప్పడం ఏవిధంగా సమర్ధనీయమని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండు మూడు దశాబ్దాలుగా తెలంగాణాలో స్థిరపడినప్పటికీ వారందరూ నేటికీ తాము తెలంగాణాకు చెందినవారముకామనే భావన వారిలో ఉన్నందునే ఈ సర్వేపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచి ఆలోచన కాదని, అందువల్ల తెలంగాణాలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు జరిగే సర్వేలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణాకు చెందిన రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. అప్పుడే ప్రభుత్వం కూడా ప్రజావసరాలకు, వారి సామాజిక స్థితిగతులకు అనువయిన ప్రణాళికలను రూపొందించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పధం వైపు నడిపించగలదని సూచిస్తున్నారు.

 

ఇక తెలంగాణా ప్రజలు, రాజకీయ నేతలు ఈ సర్వేను పూర్తిగా సమర్ధిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన అనేక హామీలను, సంక్షేమ పధకాలను ఒకటొకటిగా అమలుచేస్తుండటంతో, వారికి ప్రభుత్వంపై దానిని నడిపిస్తున్న కేసీఆర్ పై క్రమంగా నమ్మకం ఏర్పడుతోంది. ఈ సర్వేలో తమ పేరు నమోదు చేయించుకొనగలిగితే ప్రభుత్వం నుండి ఏదో ఒక రూపంలో తమకు లబ్ది చేకూరుతుందని వారు దృడంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన ప్రకటించిన ఈ సర్వేలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన తెలంగాణా ప్రజలు స్వస్థలాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

 

ఈ విధంగా చివరికి సర్వేపై కూడా పూర్తి విరుద్దమయిన ఆలోచనలు, అభిప్రాయలు అందరిలో నెలకొని ఉన్నాయి. అందువల్ల ఈ సర్వేలో ఎంతమంది పాల్గొంటారు? ఈ సర్వే విజయవంతం అవుతుందా లేదా? అయితే అది ఆంద్ర, తెలంగాణా ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపబోతోంది? దీనివలన ఎవరు లబ్ది పొందబోతున్నారు? ఎవరు నష్టపోబోతున్నారు? వంటి ధర్మ సందేహాలన్నిటికీ త్వరలోనే జవాబులు దొరకవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.