ముఖ్యమంత్రుల సమావేశం ఉభయ రాష్ట్రాలకు శుభపరిణామం

Publish Date:Aug 17, 2014

Advertisement

 

ఆంధ్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడక ముందు నుండే వాటి మధ్య మొదలయిన యుద్ధం, ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత కూడా కొనసాగుతూనే ఉంది. ఎంతో బాధ్యాతాయుతంగా మెలగవలసిన ప్రభుత్వాలు నిత్యం ప్రతీ చిన్న అంశంపై అతిగా స్పందిస్తూ ఘర్షణపడటాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. ఇక ఈ పరిస్థితిలో ఎన్నటికీ మార్పు రాబోదని అందరూ నిరాశ చెందుతున్న వేళ, గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యేలా చేయగలిగారు. ఆయన ప్రతిపాదనకు వారిరువురూ అంగీకరించడం, నిన్న సమావేశం అవడం ఒక మంచి పరిణామమని చెప్పవచ్చును.

 

అయితే మొదటి సమావేశంలోనే ఏవో అద్భుతం జరిగి, సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ఆశించడం అత్యాసే అవుతుంది. కానీ ఇంతవరకు పరస్పరం కత్తులు దూసుకొంటున్న ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు తొలిసారిగా సమావేశమవడం, ఇరువురూ కూడా పట్టువిడుపులు ప్రదర్శిస్తూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొనేందుకు సిద్దపడటం రెండు రాష్ట్రాలకు కూడా శుభపరిణామమేనని చెప్పవచ్చును. ఒకరిపై మరొకరు పిర్యాదులు చేసుకొంటూ కేంద్రం వద్ద, సుప్రీంకోర్టులో పంచాయితీలు పెట్టుకోకుండా, రాష్ట్ర స్థాయిలోనే వాటి పరిష్కారానికి ప్రయత్నిద్దామని ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించడం చాలా హర్షణీయం.

 

ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, నీరు, విద్యుత్ వంటి పంపకాలను రాష్ట్ర స్థాయిలోనే చర్చించుకొని పరిష్కరించుకొందామని ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించడం చాలా తెలివయిన నిర్ణయం. ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, నీరు, విద్యుత్ వంటి పంపకాలను రాష్ట్ర స్థాయిలోనే చర్చించుకొని పరిష్కరించుకొందామని ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించడం చాలా తెలివయిన నిర్ణయం. సానుకూల దిశలో పడిన తొలి అడుగు అని చెప్పవచ్చును. నిజానికి ఈ పని వారు అధికారం చేప్పట్టిన వెంటనే చేసి ఉండి ఉంటే, బహుశః నేడు ఈ సమావేశం కూడా అవసరమయి ఉండేది కాదేమో! కానీ ఇంతవరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న తెరాస, తెదేపా రాజకీయ నేతలుఈ విభజన సమస్యలకు రాజకీయాలు కూడా జోడిస్తున్నందునే అవి మరింత ముదిరిపోయాయి. ఆలస్యంగానయినా ఈ విషయాన్నీ ఇరువురు ముఖ్యమంత్రులు గుర్తించి, ఇకపై ఈ సమస్యల పరిష్కరించే బాధ్యతను ఇరు రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు అప్పగించి, వారు పరిష్కరించలేనప్పుడే తాము జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకోవడం చాలా మంచి నిర్ణయం.

 

గవర్నరు పుణ్యమాని ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కొంత సయోధ్య కుదిరింది గనుక వారు చెప్పిన మాటకు కట్టుబడి అధికారులకే ఆ భాద్యత వదిలిపెట్టినట్లయితే, నిపుణులు మేధావులయిన అధికారులు చాలా సమస్యలను పరిష్కరించగలరు. ఉదాహరణకు ఇటీవల ఆంద్ర, తెలంగాణా నీటిపారుదల శాఖా కార్యదర్శులు చర్చించుకొని, ఆంద్ర రాష్ట్రం అధీనంలో ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ నుండి దిగువన తెలంగాణకు చెందిన హైడల్ విద్యుత్ ప్రాజెక్టుకు నీళ్ళు విడుదలయ్యేలా చేసి విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చేయగలిగారు. అదేవిధంగా ముఖ్యమంత్రులిరివురూ తమ నేతలు అధికారులపై అనవసరమయిన కర్ర పెత్తనం చేయకుండా నియంత్రించి, అధికారులకు కొంత స్వేచ్చ ఇచ్చినట్లయితే వారు ఇదేవిధంగా అనేక సమస్యలను పరిష్కరించగల సమర్ధులు.

 

ఇరువురు ముఖ్యమంత్రులు తమ సమావేశం సహృద్భావ వాతావరణంలో సానుకూలంగా జరిగిందని వేర్వేరుగా మీడియా సమావేశాలు పెట్టి మరీ చెప్పడం గమనిస్తే వారి సమావేశం ఫలవంతం అయిందని అర్ధమవుతోంది. రౌతును బట్టే గుర్రం నడుస్తుంది కనుక, ముఖ్యమంత్రులిరువురూ ఘర్షణ వైఖరి విడనాడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోనేందుకే మొగ్గు చూపినట్లయితే, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా ఆ దిశలోనే నడిచే అవకాశం ఉంటుంది. అప్పుడే రెండు రాష్ట్రాల మధ్య పెరిగిన ఈ దూరం క్రమంగా తగ్గి, అభివృద్ధి పధం వైపు సాగేందుకు వీలు చిక్కుతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.