Publish Date:Oct 30, 2020
తెలంగాణలో ఓ మంత్రి ఇబ్బందుల్లో పడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ మంత్రి రాసలీలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది. ఆ మంత్రి వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో రచ్చ కావడంతో ఆ మంత్రి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సంజాయిషీ ఇచ్చుకునే పనిలో పడ్డారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వాట్సాప్ చాటింగ్ వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి సినీ నటితో సరసాలు చేయాలనుకున్నారు. అయితే, ఆ విషయం ఆమెతో నేరుగా చెప్పకుండా మరో మహిళను రంగంలోకి దింపాడు. మంత్రి తరఫున రంగంలోకి దిగిన ఆ మహిళ సినీ నటితో చర్చలు మొదలు పెట్టింది. మంత్రి చాలా మంచి వాడని, అతడితో చాలా పనులు ఉంటాయని, టచ్లో ఉంటే మంచిదంటూ చెప్పడం మొదలు పెట్టింది. అయితే, ఆ సినీ నటి ఇవేవీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంత్రి నియమించిన మహిళ ఏకంగా మరో దుశ్చర్యకు పాల్పడింది. ఆ సినీ నటికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను కూడా తీసింది. ఆ ఫొటోలను మంత్రికి పంపించింది.
ఆ మహిళతో ఏదో మామూలుగా మాట్లాడుతున్న సమయంలో ఆ మహిళ సెల్ ఫోన్ చూసిన సినీ నటికి అందులో తన ప్రైవేట్ ఫొటోలు ఉండడం గమనించి షాక్ తింది. ఆ సినీ నటి గురించి మంత్రితో మహిళ చర్చించిన అంశాలు కూడా వాట్సాప్ ఛాటింగ్ లో ఉన్నాయి. దీంతో మరింత షాక్ తిన్న సినీ నటి .. ఆ మహిళ ఫోన్ తీసుకుని ఆ సమాచారం మొత్తం స్క్రీన్ షాట్లు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని చెబుతున్నారు.
'మన దేశ రాజధానిలో నిర్భయపై జరిగిన హింసాకాండ. మన రాష్ట్ర రాజధానిలో దిశపై జరిగిన హింసాకాండ. నేటికీ ఏ మార్పు రాలేదు. మహిలలపై ఈ హింసని మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా ఆపలేమా? మన తెలంగాణ నాయకులు ఏం చేస్తున్నారు? ఒకవేళ మనం నమ్మిన నాయకులే మహిళలపై రాక్షస వాంఛతో ప్రవర్తిస్తే వాళ్లని ఏం చేయాలి?' అంటూ బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలంగాణలోని ఓ ప్రముఖ పట్టణంలోని హోటల్లో ఆమె ఉన్నప్పుడు సదరు మంత్రి ఒంటరిగా హోటల్కు వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. యువతి బస చేసిన హోటల్లో రికార్డులను ప్రభుత్వ ఇంటిలిజెన్స్ పరిశీలించినట్టు సమాచారం. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించారని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-minister-whatsapp-chat-leaked-25-105748.html
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్కడ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొనసాగుతోంది
ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం
కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది.
దెందులూరులో మరోసారి వైసిపి గుండాల అరాచకం
2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,
బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి
రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.