తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Publish Date:Jun 26, 2026

Advertisement

 

తెలంగాణ ప్రభుత్వం కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల్లో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు సీనియర్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో పాటు, కొందరికి పూర్తి అదనపు బాధ్యతలు (FAC) కూడా కేటాయించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎండోమెంట్స్, విపత్తుల నిర్వహణ, హ్యాండ్లూమ్స్, మైనారిటీల సంక్షేమం, గనులు, రోడ్లు-భవనాల శాఖల వరకు ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

ప్రధాన బదిలీలు, నియామకాలు ఇలా ఉన్నాయి..

సబ్యసాచి ఘోష్‌కు హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ & హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు. అలాగే టీజీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (VC & MD), టీజీసీవో ఎండీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

శైలజా రామయ్యర్‌ను ఎండోమెంట్స్ శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. అదనంగా ఈపీటీఆర్‌ఐ (EPTRI) డైరెక్టర్ జనరల్ బాధ్యతలు కూడా అప్పగించారు. అహ్మద్ నదీమ్‌ను రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనకు మైనారిటీల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు.

ఎన్. శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం సీఎం కార్యాలయ పరిపాలనలో కీలకంగా మారనుంది. సెలవుల అనంతరం విధుల్లో చేరిన రాహుల్ బొజ్జాను విపత్తుల నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు కొనసాగనున్నాయి.

ఎం. రఘునందన్ రావుకు గనులు & భూగర్భ శాఖ కార్యదర్శి అదనపు బాధ్యతలు అప్పగించారు. బి. అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా బదిలీ చేశారు. ముషర్రఫ్ అలీ ఫారూకీకి టీజీఆర్ఈడీసీవో (TGREDCO) వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పి. కాత్యాయనీ దేవిని హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ & హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. అదనంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ ఎండీ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.

కె. గంగాధర్‌ను రోడ్లు & భవనాల (R&B) శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో రాష్ట్రంలోని కీలక శాఖల్లో పరిపాలనా పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు స్పష్టమవుతోంది. కొత్త బాధ్యతలు చేపట్టనున్న అధికారులు త్వరలోనే తమ తమ శాఖల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

By
en-us Political News

  
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని వినతి..!
జింబాబ్వేపై 3-0తో సాధించిన క్లీన్ స్వీప్ భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి డెబ్యూటెంట్లలో కాన్ఫిడెన్స్ నింపి, వారి నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టిన వెరీ వెరీ స్పెషల్ వీవీవీఎస్ లక్ష్మణ్ ప్రశాంతత, విజన్ క్రికెట్ అభిమానుల మనస్సులను హత్తుకుంది.
ఆధార్ కోసం తిరిగి తిరిగి ఆలసి.. కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం..!
కిరాణా దుకాణం నడుపుతూ బయటకు సాధారణ వ్యాపారిలా కనిపించిన ఇద్దరు వ్యక్తులు
అమెరికా కలలతో సుదూర తీరాలకు వెళ్లిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్న ట్రైనీ ఐపీఎస్..!
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే.. ఫేస్‌బుక్ పోస్ట్ వేదిక నుంచి ఆ వీడియో అదృశ్యమైంది. కంటెంట్ నిబంధనలను ఉల్లంఘించిందనో లేదా చట్టపరమైన అభ్యంతరంఉందనో ఉందనో చూపే సందేశం ఆ వీడియో క్లిక్ చేస్తే రావడం వినియోగదారులను విస్మయానికి గురి చేసింది.
కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది.
ఒకవైపు మంచినీటి కొరతతో జనం అల్లల్లాడుతుంటే.. మరోవైపు పది రోజులుగా నీరు వృధాగా పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. శివారెడ్డి పల్లి గేట్ ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా గ్రామంలోని పలు కాలనీ వాసులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం మహిళలు, గ్రామస్థులు కిలోమీటర్ల కొద్దీ దూరంలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్‌వెళ్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం నేషనల్ హైవే నుంచి ఎయిర్‌పోర్టుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే రహదారి, ఫ్లై ఓవర్ నిర్మాణాలు, సర్కిల్ విభాగాలు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవ సమయానికి అవసరమైన ప్రధాన మౌలిక వసతులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది, వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే ప్రముఖుల ప్రసంగాలు, బహిరంగ సభ కోసం భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ నేతృత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోజరిగిన తొక్కిసలాటలో 41 మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
తాము ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటైన మరుక్షణం నుంచీ.. తన భర్త పవన్ కల్యాణ్ ఇంటిపేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారిపోయానన్నారు. ఈ పేరులోనే తనకు పరిపూర్ణత, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఎమోషనల్ గా పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.