ఇండియాను క్షమాపణలు కోరిన మెటా.. ఎందుకంటే?

Publish Date:Jul 28, 2026

Advertisement

సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ మెటా భారత ప్రభుత్వానికీ, అలాగే ప్రధాని కార్యాలయానికీ క్షమాపణలు చెప్పింది. ఇంతకీ మెటా క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ప్రధాని ఫేస్ బుక్ అక్కౌంట్ నుంచి ఆయన వీడియోను తొలగించింది. ఈ ఘటన తీవ్ర కలకలానికి కారణమైంది.  ఇంతకీ మెటా తొలగించిన వీడియో ఏమిటంటే.. నీట్ లీకేజీపై  ఉద్యమిస్తున్న  యువత, విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు తెస్తామని పేర్కొంటూ ఆయన విడుదల చేసిన సెల్పీ వీడియో  సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసిన స్వల్ప వ్యవధిలోనే   మిలియన్ల సంఖ్యలో వ్యూస్ లభించాయి.

అయితే..  ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే..  ఫేస్‌బుక్ పోస్ట్ వేదిక నుంచి ఆ వీడియో  అదృశ్యమైంది. కంటెంట్ నిబంధనలను ఉల్లంఘించిందనో లేదా చట్టపరమైన అభ్యంతరంఉందనో  ఉందనో చూపే సందేశం ఆ వీడియో క్లిక్ చేస్తే రావడం వినియోగదారులను విస్మయానికి గురి చేసింది. ఈ క్రమంలో ప్రధాని వీడియో అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంపై సోషల్ మీడియాలో  చర్చ మొదలైంది. దీంతో భారత ప్రభుత్వం స్పందించి మెటాను వివరణ కోరింది. దీనిపై మెటా సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందనీ, పొరపాటును వెంటనే సరిదిద్ధి ఆ వీడియోను పునరుద్ధరించినట్లు వివరణ ఇచ్చింది.  ప్రధాని మోడీ వీడియోలో నిబంధనల ఉల్లంఘనలేవీ లేవని, అది పూర్తిగా తమ తప్పిదమని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పింది.  

 IT Ministry Summons Meta, Facebook Video Removal, Meta Apology, Technical Glitch, Paper Leak Message, PM modi Video

By
en-us Political News

  
జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుండటంతో ఏడాదంతా సాగునీటికి కొదవ ఉండదని రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వరద తాకిడికి పలు గ్రామాలు ముంపునకు గురికావడం, రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించడంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికాలోని ఎంపోరియాలో 1,000 ఎకరాల డేటా సెంటర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్‌లో చప్పట్లు కొట్టినందుకు లక్స్ క్లారిడ్జ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగ హక్కులు, 1 గిగావాట్ విద్యుత్ వివాదం మరియు ఈ సంచలన ఘటన వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇక్కడ చదవండి!
గూగుల్ పేలోకి Gemini AI సాంకేతికతతో Ask Google Pay ఫీచర్ వచ్చింది. మీ ఖర్చులు, పొదుపు మార్గాలు మరియు CIBIL స్కోర్ వివరాలను 10 భారతీయ భాషల్లో సులభంగా తెలుసుకునే విధానం గురించి పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.
AIG ఉమెన్స్ ఓపెన్ 2026 ప్రత్యక్ష ప్రసారాలు, నెల్లీ కోర్డా గ్రాండ్ స్లామ్ వేట, మియు యమషిత డిఫెండింగ్ రికార్డులు మరియు మ్యాచ్ సమయాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా ఎంపికై, ప్రత్యేక సెలవులో ఉండటంతో 2025 బ్యాచ్‌తో కలిసే శిక్షణలో చేరారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది.
కాకినాడ జిల్లాకు చెందిన దర్జీ కుమారుడు మాల్తి అఖిలేశ్ సంచలన విజయం సాధించాడు. కెనడా ఏఐ సంస్థలో ఏడాదికి రూ. 1.06 కోట్ల ప్యాకేజీతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పొందిన స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ చదవండి.
బెంగళూరులో రూ.2.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లను ఐటీ ఉద్యోగులు ఎలా కొనుగోలు చేస్తున్నారు రెడ్డిట్ వేదికగా వైరల్ అవుతున్న ఆసక్తికర వివరాలు, టెక్కీల అసలు సీక్రెట్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 9,275 కోట్ల మెగా ఐపీఓ పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రైస్ బ్యాండ్, లేటెస్ట్ జిఎమ్‌పి GMP , సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, అలకేషన్ తేదీలు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలు ఇక్కడ క్లియర్ గా చదవండి.
22వ కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఇంగ్లాండ్‌పై అద్భుత విజయాలు, మానవ్ ఠక్కర్ వీరోచిత పోరాటం, శ్రీజ అకుల థ్రిల్లింగ్ ప్రదర్శనతో భారత్ మలేషియాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ ఆడటంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ భవిష్యత్తు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని, గిల్ ముందుకు వచ్చి మద్దతు ఇస్తేనే హిట్‌మ్యాన్ వరల్డ్ కప్ ఆడగలడని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత్ పతకాల పంట పండించింది. దిలీప్ గావిత్ స్వర్ణ పతకం సాధించగా, మురళీ శ్రీశంకర్ లాంగ్ జంప్‌లో రజతంతో చరిత్ర సృష్టించాడు. బాక్సింగ్‌లో ఏకంగా 10 పతకాలు ఖాయమయ్యాయి. పూర్తి వివరాలు చదవండి!
36 ఏళ్ల యువ శాస్త్రవేత్త, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్లగురం దీపక్ రెడ్డి తన  నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయి కనిపించారు. దీపక్ రెడ్డి స్వస్థలం హైదరాబాద్.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు! హౌలిహాన్ లోకీ నివేదిక ప్రకారం రూ. 2,984 కోట్ల బ్రాండ్ వ్యాల్యూతో అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB . ముంబై, చెన్నై, సన్‌రైజర్స్ స్థానాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.