Publish Date:Nov 23, 2019
ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ రాబోతుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. స్టాఫ్ తగ్గించటం ద్వారా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో 50 వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు. యాభై శాతం ప్రైవేట్ రూట్లకు ప్రైవేటు బస్సులను తీసుకు వస్తే ఇక ఆర్టీసీలో మిగిలేది అయిదు వేల బస్సులు మాత్రమే. ఇప్పటి వరకూ 10,400 ల బస్సులకు ఈ యాభైవేలమంది కార్మికులు పనిచేసేవారు. బస్సుల సంఖ్య సగానికి తగ్గడంతో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది కార్మికులు సరిపోతారు. దీంతో ఆర్టీసీలో విఆర్ఎస్ స్కీమ్ తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీని పై కొంత కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటించకపోవచ్చు అనేది మరికొందరు అధికారులు చెబుతున్న మాట. సమ్మె ముగిసిన తరువాత యాభైవేలమంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. ఆ తరువాత వీఆర్ఎస్ ను తెరపైకి తేవాలని ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తుంది. వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు కొంత ప్రోత్సాహకంగా ఆర్టీసీ ఇచ్చే బెనిఫిట్స్ తో పాటు ప్రభుత్వం కూడా కొంత నగదును కలిపే అవకాశముంది. వాలెంటరీ రిటైర్ మెంట్ పథకాన్ని అమలులోకి తెస్తే అప్పటికప్పుడు కాకుండా ఒకట్రెండేళ్లలో సగం మంది ఉద్యోగులు తగ్గుతారని ఆర్టీసీ యాజమాన్యం అంచనా. ప్రభుత్వం వీఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే రిటైర్ మెంట్ దగ్గరగా లేదా మరో ఐదారేళ్ల సర్వీసున్న కొంతమంది ఉద్యోగులు వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
దీనిపై విమర్శలు రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రతి పక్షాలు ఎదురు దాడికి దిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం వెనక ప్రతిపక్షాల రాజకీయ లబ్ది ఉందని అధికార పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. ఈ సమ్మె వల్ల ఆర్టీసి కోలుకోలేని ఆర్ధిక భారం మూటగట్టుకున్నదని ఇక ఆర్టీసీని ఆదుకోవడం ప్రభుత్వానికి కూడా కష్టమే అంటూ ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరించాలనేది ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. అయితే యాభై శాతం మించకుండా ఉంటుందనేది సీఎం స్పష్టంగా చెప్తున్న మాట. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సంస్థల్లో వీఆర్ఎస్ తీసుకొస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-govt-thinking-about-introduce-vrs-in-tsrtc-25-91535.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.