Publish Date:Nov 23, 2019
చంద్రబాబు, లోకేష్ అండ్ పవన్ పై మంత్రి పేర్ని నాని పంచ్ లు పేల్చారు. యూటర్న్ చంద్రబాబు.... మరోసారి యూటర్న్ తీసుకున్నారని సెటైర్లు వేశారు. నిన్నటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న చంద్రబాబు.... ఇప్పుడు తామే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక, చంద్రబాబు సొంత పుత్రుడు నారా లోకేష్.... దత్త పుత్రుడు పవన్ కల్యాణ్.... కూడా మాట మార్చడం అలవాటైపోయిందని పేర్నినాని నిప్పులు చెరిగారు. ఇంగ్లీష్ మీడియం అమలుకు తాము ప్రయత్నిస్తే ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అడ్డుకున్నారని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దే వద్దన్న బాబు.... ఇప్పుడు ఆంగ్ల మాధ్యమానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తెలుగు కూడా ఉండాలనడం యూటర్నే అన్నారు పేర్ని నాని. ఇంగ్లీష్ మీడియంతోపాటు తెలుగు అలాగే ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టులు ఉంటాయని తాము మొదట్నుంచి చెబుతున్నామని అన్నారు.
అయితే, జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక.... మతం పేరుతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు కంటే... బీజేపీ, శివసేన, ఎంఐఎమ్మే బెటర్ అన్నారు. కనీసం వాళ్లు... తాము తమతమ మతాల కోసం పనిచేస్తామని డైరెక్టుగా చెబుతారని, కానీ తెలుగుదేశం సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.
ఇక, బీజేపీ నేత సుజనాచౌదరిపై మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. సుజనాచౌదరి... చంద్రబాబు ఏజెంటన్న పేర్ని నాని... ఇది బీజేపీ వాళ్లకు ఎప్పుడు అర్ధమవుతుందో ఆ దేవుడికే తెలియాలన్నారు. సుజనాచౌదరి రోజూ చంద్రబాబుతో మాట్లాడకపోతే.... కాల్ డేటాను మీడియా ఇవ్వాలని పేర్ని నాని సవాలు చేశారు. ఇక, ఎప్పటిలాగే సుజనా... ఒక బ్యాంకుల దొంగ, మోసగాడు అంటూ పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-perni-nani-fires-on-chandrababu-25-91537.html
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.