కాంగ్రెస్ హస్తవాసి తెలంగాణాకి మేలు చేస్తుందా?
Publish Date:Dec 14, 2012
Advertisement
రాష్ట్రంలో ‘డ్డాo’ అని ‘అఖిలపక్షం బాంబు’ ను పేల్చిన కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రంలో మంటలురాజేసి ఆ మంటలో చలికాచుకొంటోంది. రేపు ౨౮న జరుగ బోయే అఖిలపక్ష సమావేశంలో ఏవో అద్బుతాలు జరిగిపోతాయని ఏపార్టీకి పెద్దగా నమ్మకాలు లేకపోయినప్పటికీ, తెలంగాణా సమస్యతో సతమతమవుతున్న రాష్ట్రానికి ఇప్పుడయినా బయటపడే అవకాశం దొరకకపోదా? అని అందరు అడియాసకిపోయి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే, సమావేశం తేది ప్రకటించిననాటి నుండి నేటి వరకు డిల్లీకాంగ్రెస్ పెద్దలు మొదలుకొని నిన్న బొత్ససత్తిబాబు వరకు “అఖిలం అంతా ఒక టైం పాస్ వ్యవహారం’ అని ప్రత్యక్ష పరోక్షంగా ఎంత నెత్తి మొత్తుకొని చెపుతున్నపటికీ అమాయకులయిన ప్రజలు ఇంకా ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు అఖిలపక్ష సమావేశంలో తెలంగాణా ప్రకటించేసి ఆ క్రెడిట్ అంతా ఇంతకాలం తెలంగాణా కోసం ఉద్యామాలు చేస్తున్న కెసిఆర్ చేతిలో ఎందుకు పెడుతుంది? అయితే గియితే ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకొంటుంది గానీ ఇతరులకు ఎందుకు ఇస్తుంది? అని ఆలోచిస్తే అది ప్రస్తుత పరిస్తితుల్లో ఇవ్వదని తెలుస్తుంది. రాష్ట్రంలో తనకి ఎప్పుడయితే అనుకూల వాతావరణం సృష్టిoచుకోవాలని అది తలస్తుoదో అప్పుడే అది ఏ ప్రకటనయినా చేస్తుంది. అంటే, ఎన్నికలు సమీపిస్తున్నపుడో, లేక తనకి ఓటేస్తేనే ఇస్తామనో చెప్పుకొని తెలంగాణా సమస్యని బ్రహ్మాస్త్రంలాగ అది వాడుకొంటుంది. అంతవరకూ, ఈ అఖిలాలు అనేకం జరుపుతూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అయితే, పై కారణాలవల్లనే కాంగ్రెస్ ఇప్పట్లో తెలంగాణా ఇవ్వదని రాజకీయాలలో కాకలుతీరిన తెలంగాణా కాంగ్రెస్ నేతలకి మరి తెలియకనే ఒత్తిడి తెస్తున్నారనుకోవాలా? లేక కాంగ్రెస్ అధిష్టానం వారు కలగలిసి ఆడుతున్న నాటకం ఇది అనుకోవాలా? ఇప్పుడు తెలంగాణా ఇవ్వడంవల్ల పార్టీకి జరిగే నష్టం గురించి వారికి అధిష్టానం వివరించి ఉండవచ్చును. అప్పుడు, వారుకూడా ప్రజలలో తమకు ఏర్పడుతున్న ఇబ్బందులు, తే.ర.స. నుండి ఎదురవుతున్న ఒత్తిళ్ళ గురించి తమ అధిష్టానానికి వివరించినట్లు వారే తెలుపుతున్నారు. మీరు పార్టీలో ఉంటూనే మీ ఉనికిని కాపాడుకొంటూ, రాజకీయ భవిష్యత్తుని కాపాడుకొనేందుకు మీరుకూడా ఉద్యమాలు చేసుకోండని కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలుగుదేశం పార్టీ లాగానే తన పార్టీ తెలంగాణా నేతలకి చెప్పి ఉండవచ్చును. అందుకే వారు ఎంత తీవ్ర పదజాలం వాడుతున్న పార్టీ పట్టించుకోవట్లేదు. పార్టీ పట్టించుకోక పోయినా వారు పదవులు వీడట్లేదు అనుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో లోపాయికారిగా సాగుతున్న ఈ నాటకం తెల్సుండబట్టే కెసిఆర్ ఆపుదపుడు కాంగ్రెస్ మీద విరుచుకు పడుతున్నడా?
http://www.teluguone.com/news/content/telangana-congress-leaders--24-19748.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





