Publish Date:Apr 13, 2026
రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై కొనసాగుతున్న బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సివిల్ సప్లైస్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించిన అధికారులు అక్రమంగా నిల్వ చేసి, గుప్తంగా విక్రయానికి సిద్ధం చేసిన వేలాది సిలిండర్లను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.
ఇంటింటికీ చేరాల్సిన గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు కొంతమంది దందాగాళ్ల చేతుల్లో బ్లాక్ మార్కెట్ సరుకుగా మారుతున్నాయన్న సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో ఒకేసారి దాడులు చేపట్టగా అక్రమ వ్యాపారం విస్తృత స్థాయిలో నడుస్తున్నట్లు బయటపడింది. ఇప్పటివరకు 5,079 గృహ వినియోగ సిలిండర్లు, అదనంగా 70 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
సబ్సిడీ గ్యాస్ను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాలు ప్రజల భద్రతకే ముప్పుగా మారుతున్నాయని అధికారులు హెచ్చరించారు. ఈ కేసులో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,089 కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
“గ్యాస్ సిలిండర్ ప్రజల అవసరానికి సంబంధించినది… దందాకు కాదు” అని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పదంగా సిలిండర్ల నిల్వ, రవాణా లేదా విక్రయాలు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ఈ బ్లాక్ మార్కెట్ దందాను పూర్తిగా అరికట్టాలని సివిల్ సప్లైస్ శాఖ సంకల్పం వ్యక్తం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-civil-supplies-department-operation-36-217275.html
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్