కర్ణాటకలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను అక్కడి బిజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలో వస్తే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని మేనిఫెస్టో పేర్కొనడం బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. హిందువుల వోట్లను పొందడానికి భజరంగ్ దళ్ బిజేపీకి తన వంతు సహకారం అందిస్తోంది. కాబట్టి కర్ణాటక బిజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రేస్ మేనిఫెస్టోను చించేస్తే తెలంగాణా బిజేపీ చీఫ్ బండి సంజయ్ భజరంగ్ దళ్ బాటలో ముందుకెళుతున్నారు.
ఈ నెల 14 న కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనున్నట్లు టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో లక్షలాది మంది పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
ఈ యాత్ర హిందువుల ఐక్యతను చాటి చెబుతుందన్న ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారందరూ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా ఈ యాత్రలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తో పాటు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఇంకా ప్రముఖ నేతలు పాల్గొననున్నారని సమాచారం. అయితే ఈ యాత్రపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ కావాలనే మత ప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకు చేస్తున్న మరో ప్రయత్నమే ఈ యాత్ర అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికేనని భావిస్తున్నారు. మరో వైపు రాజకీయంగా క్యాష్ చేసుకునేందుకే ఆ పార్టీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే చేవెళ్ల సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లపై అలా మాట్లాడారని.. ఇప్పుడు కర్ణాటకలో బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని ప్రకటిస్తే.. ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. బీజేపీ మాత్రం రాష్ట్రంలో అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుంది. ప్రతి నెలా పలువురు కేంద్ర బీజేపీ నేతలను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలకు తీసుకొని రావాలని తెలంగాణా బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-bjp-hindutva-card--25-154904.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.