నానాటికి తీసికట్టు మన చట్ట సభల పరిస్థితి

Publish Date:Mar 7, 2015

Advertisement

 

ఒకప్పుడు రాష్ట్ర విభజన సమయంలో గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తుంటే, తెరాస సభ్యులు ఆయన చేతిలో నుండి ప్రసంగ ప్రతులను లాక్కొని చింపివేసి సభలో నానా రభస చేసిన సంగతి అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఇప్పుడు అదే గవర్నరు తెరాస ప్రభుత్వ విధానాలను, ఆశయాలను వివరిస్తూ ఉపన్యసించవలసివస్తోంది. ఆనాడు ఆయన చేతిలో నుండి ఉపన్యాస కాగితాలు లాక్కొన్ని ఆయన ప్రసంగానికి అడ్డు తగిలినప్పుడు, తెరాస యం.యల్యే.లకు ఏమీ తప్పు అనిపించలేదు. కానీ ఈ రోజు తెదేపా, కాంగ్రెస్ యం.యల్యే.లు పోడియంలో నిలబడి పార్టీ ఫిరాయింపు చేసినవారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ నినాదాలు చేస్తుంటే, తెరాస యం.యల్యే.లకు వారిపై పట్టరాని ఆగ్రహం కలిగింది. వారూ తమ స్థానాలలో నుండి లేచి అందుకు అభ్యంతరం చెప్పి ఉండి ఉంటే బాగుండేది. కానీ వారు కూడా పోడియంలోకి దూసుకు వచ్చేసి గవర్నరు నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు స్పీకర్ మధుసూధనాచారి సమక్షంలోనే ప్రతిపక్ష యం.యల్యే.లతో వాగ్వాదాలకు, తోపులాటలకు దిగడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఆ తోపులాటలో ప్రతిపక్ష సభ్యులు కొందరు క్రిందపడిపోయారు.

 

ప్రతిపక్ష సభ్యులు సభా సాంప్రదాయాలు తుంగలో తొక్కుతూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడం ఒక తప్పయితే, బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికార పార్టీ సభ్యులు గవర్నర్ సమక్షంలోనే వారిపై భౌతిక దాడులు చేయడం మరో తప్పు. అటువంటి పరిస్థితుల్లో సభాపతి స్పీకర్, ముఖ్యమంత్రి మౌనంగా చూస్తూ కూర్చోవడం అంతకంటే పెద్ద తప్పు. అధికార, ప్రతిపక్షాలు ఒకరిని మరొకరు రాజకీయంగా దెబ్బతీయలనుకొంటే అటువంటి కార్యక్రమాలు సభ బయట నిర్వహించుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండబోదు. కానీ ప్రజాసమస్యలను చర్చించి, పరిష్కరించేందుకు ప్రజాధనం వెచ్చించి నిర్వహిస్తున్న చట్ట సభలలో ఈవిధంగా వ్యవహరించడం చాలా దారుణం. అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ కలిసి గవర్నర్ పట్ల ఈవిధంగా అమర్యాదగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యానికి మూలస్థంభమయిన చట్టసభలను చివరికి ఈ స్థాయికి దిగజార్చడం చూస్తుంటే చాలా ఆందోళన కలుగుతోంది.

 

ప్రజలకు మార్గదర్శనం చేయవలసిన ప్రజా ప్రతినిధులే ఈ విధంగా వ్యవస్థలను, చట్టసభలను అపహాస్యం చేయడం, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకోవడం చూస్తుంటే అటువంటి వారిని ఎన్నుకొన్నందుకు ప్రజలు కూడా సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి కలుగుతోంది. ఒకవేళ ప్రభుత్వాలు గాడి తప్పుతుంటే వాటిని మళ్ళీ గవర్నరే గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది కనుక ఆయన ఇటువంటి సంఘటనలను ఎంతమాత్రం ఉపేక్షించకుండా బాధ్యులపై కటినమయిన చర్యలు తీసుకొన్నట్లయితే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చును. అలా కాదని ఆయన కూడా ప్రేక్షకపాత్ర వహిస్తే చట్టసభల స్థాయి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.