ఆమాద్మీ రోడ్డున పడ్డాడు

Publish Date:Mar 6, 2015

Advertisement

 

అపూర్వమయిన మెజార్టీతో డిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమాద్మీ పార్టీకి ఇక ఎదురే ఉండబోదని అందరూ భావిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఆ పార్టీలో కూడా అప్పుడే తిరుగుబాట్లు, అసమ్మతి స్వరాలు, గ్రూప్ రాజకీయాలు అన్నీ మొదలయిపోయాయి. అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా గడవక ముందే పార్టీ మళ్ళీ రోడ్డున పడింది. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలను పార్టీలో సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లపై నిరసించడంతో వారిని కీలకమయిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తప్పించేందుకు అరవింద్ కేజ్రీవాల్ తన కన్వీనర్ పదవికి రాజీనామా అస్త్రం ప్రయోగించవలసి వచ్చింది. తక్షణమే పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సమావేశమయ్యి ఆ ఇరువురు సభ్యులను తప్పించేరు. కానీ ఆ సమావేశానికి హాజరయిన మొత్తం 19 మంది సభ్యులలో 11 మంది మాత్రమే వారి ఉద్వాసనకు మద్దతు పలుకగా మిగిలిన 8మంది వ్యతిరేకించారు. అంటే వారు కూడా అరవింద్ కేజ్రీవాల్ పట్ల ఎంతో కొంత వ్యతిరేకత కలిగి ఉన్నారని స్పష్టం అవుతోంది. మెజార్టీ నిర్ణయం ప్రకారం యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లను రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తప్పించగలిగారు, కానీ చేజేతులా మరో 8 మంది సీనియర్ నేతలను శత్రువులుగా తయారుచేసుకొన్నట్లయింది.

 

వారిలో ఒకరయిన మయాంక్‌ గాంధీ మీడియా ముందుకు వచ్చి జాతీయ కార్యవర్గ నిర్ణయాన్ని తప్పుపట్టారు. యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ ఇరువురూ స్వచ్చందంగా రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తప్పుకొనేందుకు అంగీకరించినప్పుడు వారిని ఇంత అవమానకరంగా బయటకు సాగనంపవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు తనను కూడా ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని తన పార్టీ నేతలు ఆదేశించారని, కానీ తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీరును గట్టిగా విమర్శించారు. అంటే నేడో రేపో ఆయనకీ ఉద్వాసన పలికే సమయం ఆసన్నమయిందని స్పష్టం అవుతోంది.

 

అరవింద్ కేజ్రీవాల్ ని ప్రశ్నించినందుకు ఇద్దరు సభ్యులను బయటకు పంపినందుకు పార్టీలో అసంతృప్తి మొదలయింది. మరి కొందరు ఇప్పుడు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలలో ఓడిపోయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇదే అదునుగా అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరిటువంటి సమయంలో ఆయనను విమర్శిన్న కారణంగా మయాంక్ గాంధీపై కూడా వేటువేసినట్లయితే మరిన్ని విమర్శలు, పార్టీలో అంతర్గతంగా మరిన్ని సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది. అలాగని ఉపేక్షించినా ప్రమాదమే. కనుక ఏదోవిధంగా పార్టీలో ఈ పరిస్థితులను చక్క దిద్దవలసి ఉంటుంది.

 

తమ పార్టీ మిగిలిన అన్ని రాజకీయ పార్టీల కంటే విభిన్నమయింది. అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. పదవులు, అధికారం, రాజకీయాల కంటే ప్రజలకు సేవ చేయడానికే తామంతా అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొన్న ఆమాద్మీ పార్టీ, దాని నేతలు మిగిలిన రాజకీయ పార్టీలకు ఏమాత్రం భిన్నమయినవారు కారని నిరూపిస్తున్నారు. ఇదివరకు అధికారంలోకి వచ్చినప్పుడు తప్పుడు నిర్ణయాల కారణంగానో లేక సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఏకంగా దేశాన్నే ఏలేయాలనే దురాశాతోనో అధికారం వదులుకొన్నారు. అందుకు అరవింద్ కేజ్రీవాల్ చాలా సార్లు ప్రజల ముందు లెంపలు వేసుకొన్నారు కూడా. ప్రజలు ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి కూడా మళ్ళీ పార్టీని చక్కదిద్దుకోలేక చతికిలపడినట్లయితే ఆయన ప్రభుత్వానికే ప్రమాదం.

 

డిల్లీ ప్రజలు కోటి ఆశలతో ఆమాద్మీని అఖండ మెజార్టీతో గెలిపించుకొంటే ఆ పార్టీ నేతలు ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజల ఆశలు నెరవేర్చే ప్రయత్నాలు చేసే బదులు వారిలో వారే కుమ్ములాడుకోవడం చాలా దురదృష్టకరం. వారు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకోలేకపోతే ప్రజలు వారికి మళ్ళీ మరో అవకాశం ఇవ్వరని గ్రహిస్తే మంచిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.