అద్దాల మేడలో కూర్చొని రాళ్ళు విసిరితే...

Publish Date:Jun 13, 2015

Advertisement

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ఆయన ప్రభుత్వంలో చాలమంది మంత్రులు ఓటుకు నోటు కేసు పట్ల తమకు ఎటువంటి ఆసక్తి, తీరికా లేవని ఒకపక్క చెపుతూనే మరోపక్క ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు...ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు......ఆధారాలు చాలా ఉన్నాయి... ముందుంది ముసళ్ళ పండగ...అంటూ మాట్లాడటం గమనిస్తే వారి ఉద్దేశ్యం ఏమిటో స్పష్టమవుతోంది. కనుక ఒకవేళ ఈవిషయంలో కేంద్రం జోక్యం చేసుకొనకపోతే తెలంగాణా ప్రభుత్వం తన పధకం ప్రకారమే ముందుకు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఈ కేసులో రేవంత్ రెడ్డితో సహా మిగిలిన ఇద్దరినీ కూడా ఎసిబి ప్రశ్నించడం పూర్తయింది. రేవంత్ రెడ్డిపై పిర్యాదు చేసిన నామినేటడ్ యంయల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ వాగ్మూలం తీసుకొని తదుపరి చర్యలకు ఎసిబి ఉపక్రమించవచ్చును. అదే జరిగితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేయవచ్చును. అప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య మరింత ఘర్షణ జరిగి అది వాంచనీయమయిన సంఘటనలకు లేదా రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. కనుక ఇంతవరకు జరిగిన పరిణామాలన్నీ ఒక ఎత్తయితే ఇక ముందు జరుగబోయే పరిణామాలు మరొక ఎత్తుగా భావించవచ్చును.

 

ఈ వ్యవహారం గురించి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులను పిర్యాదు చేసారు. గవర్నర్ కూడా దీనిపై తన నివేదిక కేంద్రానికి సమర్పించారు. ఈ వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన కూడా చాలా హడావుడిగా డిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు చేయడం తెదేపా చేస్తున్న ఆరోపణలను నిజమని రుజువు చేస్తున్నట్లుంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రినే అరెస్ట్ చేయాలని భావిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఇంతవరకు ఆ విషయం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనుకోలేదు. హైదరాబాద్ పై సర్వాధికారాలు ఉన్న గవర్నర్ కి కూడా ఆ విషయం తెలియకుండా మొత్తం వ్యవహారం చాలా గుట్టుగా నడిపించారు. ఒకవేళ ఆ విషయం ముందుగా గవర్నర్ కి తెలిపి ఆయన అనుమతి తీసుకొని ఉండి ఉంటే, ఆ సంగతి ఆయనైనా కేంద్రానికి తెలియజేసి ఉండాలి. కానీ టీవీలలో ఈ సంచలన వార్త బయటపడేవరకు గవర్నర్ కి కూడా ఆ విషయం గురించి తెలియదంటే చాలా ఆశ్చర్యమే!

 

ఇంత జరిగిన తరువాతయినా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి తదుపరి చర్యలకు ఉపక్రమించి ఉండి ఉంటే అప్పుడు ఎవరూ అనుమానించేవారు కాదు. కానీ ఇంత జరిగినా, ఇంకా చాలా జరుగబోతున్నా కూడా కేసీఆర్ నేటికీ కేంద్రానికి తెలియజేసి దాని అనుమతి తీసుకోవాలనుకాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రప్రభుత్వానికి తెలియజేయకుండా పొరుగు రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేందుకు దోహదపడే ప్రమాదకరమయిన నిర్ణయాలు తీసుకొనేందుకు కేసీఆర్ సిద్దపడటం చూస్తుంటే ఆయన కేంద్రాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను కూడా ఖాతరు చేస్తున్నట్లు లేదు. ఇటువంటి ఆలోచనలు, పోకడలు అన్నీ కేవలం రాజరికవ్యవస్థలలో మాత్రమే కనబడతాయి తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలలో తావు లేదు. బహుశః ఆ సంగతి ఆయన అనుభవపూర్వకంగానే తెలుసుకొంటారేమో?

 

ఇంతవరకు జరిగిన సంఘటనల గురించి గవర్నర్ తెలుసుకో(లే)కపోవడం తప్పేనని చెప్పవచ్చును. కానీ ఇకపై జరుగబోయే సంఘటనల గురించయినా తెలంగాణా ప్రభుత్వం నుండి పూర్తి సమాచారం రప్పించుకొని, వాటి గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, ఎటువంటి విపరీత పరిణామాలు ఏర్పడకుండా గవర్నర్ తగు చర్యలు చేప్పట్టవలసి ఉంటుంది. లేకుంటే అది ఆయన వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది. ఆయన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డితో నిన్న సమావేశం కావడం గమనిస్తే, తెలంగాణా ప్రభుత్వం తన పధకం ప్రకారం ముందుకే సాగేందుకు నిశ్చయించుకొన్నందున, హైదరాబాద్ జంట నగరాలలో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు అనుమానం కలుగుతోంది.

 

ఈ వ్యవహారం ఆ రెండు పార్టీలకు, వ్యక్తులకు మధ్య ఉన్న రాజకీయ వైషమ్యాల కారణంగా జరుగుతున్నదే అయినా తెలంగాణా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల వలన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజల మధ్య ఎన్నటికీ పూడ్చలేని ఒక అగాదం సృష్టించడం తధ్యం. తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నంత కాలమే తెలంగాణాలో తెరాస ఎదురులేకుండా నిలబడగలుగుతుంది. అది పోయిన మరుక్షణం తెదేపాతో సహా అన్ని ఇతర పార్టీలకు సమాన అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ తెలంగాణా సెంటిమెంటును మళ్ళీ బలపరిచేందుకే దోహదపదేవిగా ఉన్నాయని చెప్పవచ్చును. ఈ వ్యవహారంలో తెదేపా నేతలు తమ తెరాస ప్రభుత్వంపై ఎంతగా ఎదురు దాడిచేస్తే దాని వలన వారిపట్ల తెలంగాణా ప్రజలలో మరింత వ్యతిరేకత పెరుగుతుందనే ఆలోచన ఇందులో ఇమిడి ఉన్నట్లు కనబడుతోంది. బహుశః అందుకే కేసీఆర్ ఇంత రిస్క్ తీసుకొంటున్నారేమోననే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ పార్టీలు, వాటి నేతలు అందరూ కూడా అద్దాల మేడలో కూర్చొన్నట్టి వాళ్ళే! ఈ చిన్న సంగతి గ్రహించకుండా అవకాశం దొరికింది కదాని ఇతరుల మీద రాళ్ళు విసిరి ఆనందిద్దామనుకొంటే ఆ ఆనందం తాత్కాలికమే అవుతుంది. ఏదో ఒకనాడు తమ అద్దాలమేడ మీది ఎదుటవాళ్ళు కూడా రాళ్ళు విసిరే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే ఇటువంటి సాహసాలు చేయబోరు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.