అనంతలో దూసుకొస్తున్న టీడీపీ యువ కెరటం పరిటాల శ్రీరామ్

Publish Date:May 6, 2022

Advertisement

ఏపీ రాజకీయ చరిత్రలో పరిటాల రవి కుటుంబానికి ప్రత్యేక పేజీ ఉంటుంది. అనంతపురం జిల్లాలో ఆ కుటుంబానికి చెరగని ముద్ర ఉంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో ‘పరిటాల కుటుంబం మాటే శాసనం’ అన్నట్లు ఉంటుంది. ఆ కుటుంబం అధికారంలో ఉన్నా.. లేకపోయినా పరిటాల ఫ్యామిలీ మాటే ఫైనల్ అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ యువ కెరటం దూసుకొచ్చింది. ఆ యువ కెరటమే పరిటాల శ్రీరామ్. మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్ర (రవి), మాజీ మంత్రి సునీత దంపతుల కొడుకు శ్రీరామ్.

ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ చార్జిగా పార్టీ బాధ్యతల్ని ఎంతో చాకచక్యంగా నిర్వర్తిస్తున్నారీ యువనేత శ్రీరామ్. పరిటాల రవి, సునీత దంపతుల వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శ్రీరామ్ గత ఎన్నికల్లో రాప్తాడులో టీడీపీ అభ్యర్థిగా ఓటమి చవిచూశారు. ఓడినప్పటికీ రాప్తాడు టీడీపీపై పరిటాల శ్రీరామ్ పట్టు ఏమాత్రం తగ్గలేదంటే ఆశ్చర్యంలేదు. రాప్తాడు టీడీపీ శ్రేణులకు శ్రీరామ్ ఎంత చెబితే అంత అనే టాక్ ఉంది. తన కుటుంబం నుంచి సహజంగా పుణికిపుచ్చుకున్న రాజకీయ చైతన్యంతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడానికి ముందుంటారు. పరిటాల శ్రీరామ్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో చక్కని అనుబంధం ఉంది. టీడీపీలో శ్రీరామ్ మంచి నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు..

వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు శ్రీరామ్ రెడీ అవుతున్నారు. తాను చెబితే పార్టీ అధినేత చెప్పినట్లే అనేలా ధర్మవరంలో దూసుకుపోతున్నారు శ్రీరామ్. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో ఢీకొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ సర్కార్ పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, కష్టాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు.

ధర్మవరంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణ కమలం గూటిలో చేరడంతో టీడీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ ఓ టార్చ్ బేరర్ లా నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చారు. అయోమయంలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జనం నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ లీడర్ శ్రీరామ్ జోరు పెంచారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. పంచ్ డైలాగ్ లతో టీడీపీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఆయన ప్రసంగాలు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. శ్రీరామ్ జోష్ చూసిన టీడీపీ అధినేత ధర్మవరం పార్టీ బాధ్యతలు అప్పగించడం విశేషం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి మరీ ధర్మవరానికి నియోజకవర్గం నేతలు తెచ్చుకున్నారంటే.. శ్రీరామ్ పై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతోంది.

ధర్మవరంలో ఆయన మంచి పునాదినే వేసుకున్నారనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా తానున్నానంటూ భరోసాగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా శ్రీరామ్ తప్పకుండా హాజరై అందరికీ తలలో నాలుకలా మెలుగుతున్నారు. తరచూ పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. కరోనా లాక్ డౌన్ సందర్భంగా శ్రీరామ్ మరింత యాక్టివ్ గా పనిచేయడం అందరి నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రజలకు కూరగాయల పంపిణీ, భోజనం ఏర్పాట్లు చేయడం, మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు అందజేసి శెభాష్ అనిపించుకున్నారు.

సీఎం జగన్ కు ఎదురొడ్డి నిలిచేందుకు కూడా శ్రీరామ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సీమలో దివంగత పరిటాల రవి ఇమేజ్ ను కాపాడుతూనే జిల్లా రాజకీయాల్లో తన మార్క్ కనబరుస్తున్నారు. జిల్లాల పునర్విభజన వెనుక జగన్ రెడ్డి రాజకీయ కుట్ర ఉందని, ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేయడానికి నిరసనగా నిరాహార దీక్షచేశారు. ధర్మవరం రెవన్యూ డివిజన్ రద్దు వల్ల 8 మండలాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో జేసీ వర్గానికి, పరిటాల వర్గానికి దశాబ్దాల శత్రుత్వం ఉంది. అలాంటి శత్రువర్గంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా కౌగలించుకునేట్టుగా ఆకర్షించడం శ్రీరామ్ ఇమేజ్ కు తార్కాణం అంటున్నారు.

ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ సామాజిక, రాజకీయ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి 40 శాతం సీట్లు యువతకే ఇస్తానని పార్టీ అధినేత ప్రకటించడం పరిటాల శ్రీరామ్ కు కలిసి వచ్చే అంశం అంటున్నారు. శ్రీరామ్ కు ధర్మవరం టీడీపీ టికెట్ వస్తే.. అతని గెలుపు నల్లేరు మీద నడక అవుతుందనేది స్థానికుల అంచనా. పోరాటాల రవన్న కుమారుడు.. రాజకీయాల్లో మంచి దూకుడు ప్రదర్శిస్తున్న శ్రీరామ్ ధర్మవరం నుంచి జెండా ఎగరేయడం ఖాయం అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.