Publish Date:Apr 17, 2026
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది. ఏకంగా ఎనిమిది మందికి అధిష్టానం పదవులు కట్టబెట్టడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నెలకొంది. టీడీపీ వారికి లభించిన ప్రాధాన్యత చూస్తూ పల్నాడు వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. పార్టీకి విధేయులుగా పని చేస్తున్న వారిని గుర్తించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక పదవుల్లో నియమించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఇప్పటికే పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన్ని కొత్తగా పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో మెంబర్గా తీసుకోవడంతో పార్టీలో పెద్ద పీట వేసినట్లైంది. సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జాతీయ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
మంత్రి పదవి ఆశించిన ఆ సీనియర్ నేతకు పార్టీ పరంగా ప్రాధాన్యత దక్కింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జోనల్ కోఆర్డినేటర్గా పదవులు దక్కించుకున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రత్తిపాటి ఈ సారి జోనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించనున్నారు. అలాగే సత్తెనపల్లికి చెందిన మన్నెం శివనాగమల్లేశ్వరారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్ధిగా, పెదకూరపాడు నేత మద్దిరాల గంగాధర్ , చిలకలూరిపేట మైనార్టీ నేత షేక్ కరీముల్లా, వినుకొండ మైనార్టీ లీడర్ షమీమ్ఖాన్లకు రాష్ట్ర కార్యదర్శులుగా పదవులు దక్కాయి.
మద్దిరాల గంగాధర్ పార్టీకి విధేయుల. తన వాక్చాతుర్యంతో అధిష్టానం గుడ్ లుక్స్లో ఉన్న ఆయన ఇప్పటికే రాష్ట్ర నాయీ బ్రాహ్మణ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. షమీమ్ ఖాన్, షేక్ కరీముల్లాలకు కార్యదర్శి పదవులు దక్కడంతో పల్నాడులో గణనీయంగా ఉన్న మైనార్టీలకు ప్రాధాన్యత దక్కినట్లైంది. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన శివనాగలమల్లేశ్వరరావు గత మూడు సార్లుగా సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. టికెట్ రాక పోయినా పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రస్థాయి కమటీలోకి తీసుకున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో వైసీపీ కమిటీలు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే జగన్ కొనసాగిస్తున్నారు.
2024 ఎన్నికల ముందు, తర్వాత కూడా ఆయన జిల్లా అధ్యక్షుడి ఉన్నారు. ఆ క్రమంలో ఎన్నికల హింస కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన పిన్నెల్లి పెద్దగా జనంలోకి రావడం లేదు. దాంతో పిన్నెల్లి స్థానంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని జిల్లా వైసీపీ శ్రేణులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే జగన్ మాత్రం పిన్నెల్లి వైపే చూపుతుండటం, ఆయన కేసుల భయంతో ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండటంతో జిల్లా వైసీపీకి పెద్దదిక్కు కరువైన పరిస్థితి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ పరాజయం పాలవ్వడం, సమర్ధమైన నాయకత్వం కరువవ్వడంతో అక్కడి కేడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇలాంటి తరుణంలో పల్నాడు నేతలకు టీడీపీలో ప్రాధాన్యత పెరుగుతుండటంతో వైసీపీ వర్గాల్లో అంతర్మధనం మొదలైందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-is-dominant-in-palnadu-district-39-217597.html
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.