పల్లెపల్లెకు పసుపు దండు.. డిసెంబర్ లో  గౌరవ సభలు

Publish Date:Nov 28, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి కార్యచరణ ప్రకటించింది ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ. డిసెంబర్ 1 నుంచి పల్లెపల్లెకు వెళ్లనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు డిమాండ్స్ తో కూడిన ఎజెండాను సిద్ధం చేసింది.  ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అసభ్య పదజాలంపై జనంలోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.  మొత్తం 17 అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది టీడీపీ.

అధికార వైసీపీని గద్దెదించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వరకు విశ్రమించకుండా పోరాటం సాగించాలని పొలిటిబ్యూరో సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. చట్టాలు చేయాల్సిన గౌరవ సభ .. జగన్ రెడ్డి అధ్యక్షతన కౌర సభగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా మహిళల వ్యక్తిత్వంపై ఏవిధంగా దాడి చేశారో ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగం డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని నిర్ణయించింది పొలిట్ బ్యూరో సమావేశం. సామాజంలో ఆడపడుచుల గౌరవంపై విస్తృత స్థాయిలో చైతన్యం కల్పించాలని పార్టీ భావిస్తోంది.

ఏపీ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పై అధికార పార్టీ నేతలు చేసిన వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వం హననం పై చంద్రబాబు భావోద్వేగానికి లోనై,తిరిగి ముఖ్యమంత్రి అయిన తరువాతే మళ్లీ అసెంబ్లీ అడుగుపెడుతానని శపథం చేశారు. చంద్రబాబు శపథంపై పొలిట్ బ్యూరో సభ్యులు ఏకగ్రీవంగా మద్దతును ప్రకటించారు. పార్టీ నాయకుల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు చంద్రబాబు అసెంబ్లీ శపథంపై కట్టుబడి ఉందని సభ్యులు పేర్కొన్నారు. దీనిబట్టిచూస్తే.. అందుకు తగిన విధంగా గ్రాస్ రూట్ లో పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రాయలసీమలో సంభవించిన వరదలు, మరణాలపై న్యాయ విచారణ డిమాండ్ తోపాటు వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు 25 నష్టపరిహారం చెల్లించాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ సీరియస్ వ్యాఖ్యలు, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం వంటి వాటిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాని, బీసీలకు రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని, పంచాయితీ నిధులను వెంటనే జమచేయాలని ఇలా పలు అంశాలతో కూడిన డిమాండ్స్ ను ఎజెండాగా సభ్యులు రూపొందించారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చైనా సరే.. ప్రజలకు మేలు జరిగేలా చూడాలని అధినేత చంద్రబాబు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. 

By
en-us Political News

  
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
జగన్ ధైర్యంగా జనంలోకి వచ్చి ఐదేళ్లయ్యింది. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర తరువాత ఆయన జనం ముఖం చూడటం మానేశారు. తన అధికారాన్ని ప్రత్యర్థులు, వ్యతిరేకులపై కక్ష సాధించుకోవడానికీ, సంక్షేమ పథకాల పేర లబ్ధిదారులకు అరకొరగా సొమ్ముల పందేరానికి అప్పుల వేటకీ పరిమితమైపోయారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (మార్చి 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.