Publish Date:Dec 14, 2022
కారు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. తన కారును దేశవ్యాప్తంగా షికారు చేయించేందుకు దేశ రాజధాని హస్తినలో సమాయత్తమైతే.. సైకిల్ పార్టీ అధినేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. తెలంగాణలో సైకిల్ సవారీకి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో డిసెంబర్ 21వ తేదీన ఖమ్మంలో తెలంగాణ టీడీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ లీడర్ నుంచి కేడర్ వరకు అంతా భారీ ర్యాలీగా వెళ్లనున్నారని సమాచారం. అయితే ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు బాధ్యతను ఇప్పటికే పార్టీలోని పలువురు సీనియర్లకు చంద్రబాబు అప్పగించారని.. అందుకు సంబంధించిన పనులు వారు.. వాయువేగంతో చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్ ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అలాగే పార్టీని మళ్లీ ప్రజలకు చేరువ చేసేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా తెలంగాణలోని పలువురు కీలక నేతలతో చంద్రబాబు భేటీ అయి చర్చించారు. ఆ క్రమంలో ఖమ్మం జిల్లాతోపాటు హైదరాబాద్ మహానగరంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తొలుత ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు టీటీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. అదీకాక.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొంది. కానీ ఆ తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కారు పార్టీలోకి జంప్ కొట్టేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా పేరు మార్చుకొని.. దేశ రాజధాని హస్తినలో చక్రం తిప్పి..బీజేపీకి ఝలక్ ఇవ్వాలని తెగ ఊవ్విళ్లూరుతోంది. దీంతో గులాబీ పార్టీ ప్రాంతీయ వాదాన్ని పక్కన పెట్టి జాతీయ వాదాన్ని చేపట్టినట్లు అయింది. అలాంటి వేళ.. టీడీపీ సైతం తెలంగాణలో పార్టీ బలోపేతానికి రంగం సిద్దం చేసుకొంటోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సైకిల్ పార్టీలోని కీలక నేతలంతా... కారు పార్టీలో చేరిపోయారు. దీంతో సదరు పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చనట్లు కనిపించింది. కానీ సైకిల్ పార్టీలో కేడర్ మాత్రం అలాగే జెండా కర్రలాగా నిలబడి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా..ఆ ఎన్నికల్లో తెలుగు దేశం తన సత్తా చాటుతోంది. తాజాగా కాసాని జ్జానేశ్వర్.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సైకిల్ సవారీ జోరందుకొందనే ఓ చర్చ అయితే తెలంగాణలో సవారీ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో కూడా తెలుగుదేశం పార్టీ భారీ సభ నిర్వహించేందుకు సన్నాహలు చేపట్టనుందని.. దీంతో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు నయా జోష్ వస్తుందనే ఓ టాక్ అయితే పసుపు దళంలో వైరల్ అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-eyes-on-khammam-25-148508.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.