Publish Date:Dec 14, 2022
హిందూపురం ఎమ్మెల్యే, యువరత్న నందమూరి బాలకృష్ణ రియల్ లైఫ్లో అయినా.. రీల్ లైఫ్లో అయినా.. ఏం చేసినా సన్సేషనే. నిర్ణయం తీసుకోవడం దానికి అమలు చేయడం అన్ స్టాపబుల్ స్పీడ్ లో జరిగిపోతుంటుంది. బాలయ్య ప్రతిపనిలోనూ ఆయన మార్క్ స్సష్టంగా కనబడుతుంది. తాజాగా బాలయ్య బాబు.. తన నియోజవర్గమైన హిందూపురంలో జస్ట్ 2 రూపాయిలకే చికెన్ బిర్యానీ అందుబాటులోకి తీసుకువచ్చారు. స్థానిక హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్ద దాదాపు 500 మందికి అన్న క్యాంటిన్ చికెన్ బిర్యానీ ఆయన అందించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించి 200 రోజులు పూర్తి కావడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెనూలో చికెన్ బిర్యానీ, గుడ్డు పాటు ఓ స్వీట్ అందించారు.
గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ జగన్ ముఖ్యమంత్రి అయన తర్వాత.. అన్న క్యాంటీన్లు ఎత్తివేశారు. కేవలం రెండు రూపాయిలకే అన్నం అందింస్తుండంతో ప్రజలు వీటిని బాగా ఆదరించారు. అయితే అలాంటి ప్రజాప్రయోజనమైనటువంటి వాటిని వైఎస్ ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నాయకులు అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసినా వాటిని కూడా వైసీపీ సర్కార్ తొలగిస్తోంది.
అలాంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో అన్న క్యాంటీన్లకు భారీ ప్రజాదరణ దక్కింది. అలాగే స్థానిక ప్రజల కోసం మొబైల్ వైద్యశాలను సైతం ఆయన ప్రారంభించారు. గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్.. తన ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు.. రెండు రూపాయిలకే కిలో బియ్యం అందించే పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ పథకమే.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వాలు అమలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు... వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ క్రమంలో గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందించిన అన్ని పథకాలు మళ్లీ అమలు చేస్తామని ఆయన క్లియర్ కట్గా ప్రజలకు స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం మంగళగిరిలో అన్న క్యాంటీను ఏర్పాటు చేయడమే కాకుండా.. మొబైల్ వైద్యశాలను సైతం ప్రారంభించారు. అలాగే జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానలను సైతం ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్న క్యాంటీన్ల అంశం టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుందనడంలో ఏటువంటి అతిశయోక్తి లేదనే ఓ చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/balayyya-chicken-biriyani-for-two-rupees-25-148512.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.