తెలంగాణా తెదేపా నేతల భవిష్యత్?

Publish Date:Aug 26, 2014

Advertisement

 

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమిని గెలిపించేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా కృషిచేసారు. కానీ బలమయిన తెలంగాణా సెంటిమెంటు ముందు ఎన్డీయే కూటమి నిలవలేక ఓడిపోయింది. కానీ ఆంద్రప్రదేశ్ లో వారి కూటమి ఘన విజయం సాధించడంతో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆప్పటి నుండి ఆయన రాష్ట్ర పాలన, దాని సమస్యల పరిష్కారం, తెలంగాణా ప్రభుత్వంతో వివిధ అంశాలపై యుద్ధం చేయడంలో క్షణం తీరికలేకుండా ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికలలో ఓటమితో డీలా పడిపోయిన తన పార్టీ తెలంగాణా నేతలు, కార్యకర్తలకు ఆయన దైర్యం చెపుతూ ఇకపై తాను తెలంగాణా తెదేపా శాఖపై, తెలంగాణా రాజకీయాలపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టి, అక్కడ కూడా పార్టీని మరింత పటిష్టం చేసి, వచ్చే ఎన్నికలలో పార్టీ తప్పకుండా గెలిచేలా చేస్తానని కొద్ది రోజుల క్రితం తెలిపారు. తెలంగాణాలో పార్టీని కాపాడుకొనేందుకే ఆయన ఇంకా హైదరాబాదును అంటిపెట్టుకొని ఉన్నారని కొందరు పార్టీ నేతలు చెపుతున్నారు. అంతే కాదు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇకపై తరచుగా తాను తెలంగాణాలో కూడా పర్యటిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, వాస్తవానికి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారనే విషయం అందరికీ కనబడుతూనే ఉంది.

 

ఏ రాజకీయ నాయకుడయినా తన రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే కోరుకొంటాడు. కనీసం దానిపై ఎంతో కొంత స్పష్టత అయినా ఉండాలని కోరుకొంటాడు. అటువంటప్పుడు తెలంగాణా తెదేపా నేతలు కూడా ఆవిధంగానే కోరుకోవడం సహజమే. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెదేపా నేతలు, ఇప్పుడు మళ్ళీ మరో ఐదేళ్ళ వరకు వేచి చూడక తప్పడం లేదు. అయినా అప్పటి పరిస్థితి ఎలాగుంటుందో ఎవరికీ తెలియదు. ఇక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమ వైపు దృష్టి సారించలేని పరిస్థితిలో ఉండటంతో వారిలో క్రమంగా నిరాశ నిస్పృహలు కలగడం సహజమే. అయితే ప్రస్తుతం వారి భవిష్యత్తుకి భరోసా ఇచ్చేవారు కాని, కనీసం ఆ విషయం గురించి సానుభూతితో చర్చించేవారు కానీ లేకపోవడంతో వారు తీవ్ర అభద్రతా భావానికి గురవడం సహజమే. బహుశః ఈ పరిస్థితులే పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని అధికార తెరాస పార్టీ వైపు ఆకర్షింపబడేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఆయన ఖమ్మం జిల్లాలో మరో నేత నామా నాగేశ్వరావుతో ఏర్పడిన విభేదాల కారణంగానే పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారని చెప్పుకొంటున్నా, వాస్తవానికి తన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందనే భయంతోనే ఆయన తెరాస వైపు ఆకర్షితులవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

అందుకు ఉదాహరణగా తెరాసలో చేరేందుకు క్యూ కడుతున్న వైకాపా నేతలను చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇక తెలంగాణాలో పోటీ చేసే ఆసక్తి లేదనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు అక్కడి పార్టీ నేతల రాజకీయ భవిష్యత్ అంతా శూన్యమే. కనుక వారు తెరాసలో చేరేందుకు సిద్దమవుతున్నారు. కానీ ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాలలో పార్టీని కాపాడుకొంటూ, ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెలంగాణాలో పార్టీని కాపాడుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంది.

 

పార్టీలో ముఖ్యమయిన తెలంగాణా నేతలు కొందరికి మోడీ మంత్రివర్గంలో పదవులు, కేంద్రం చేతిలో ఉండే కొన్ని నామినేటడ్ పదవులలో నియామకాలు చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అది చాల మంచి ఆలోచనే కానీ తెలంగాణాలో పార్టీని కాపాడుకొనేందుకు ఆ ప్రయత్నాలు ఏ మాత్రం సరిపోవు. చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రద్ధ తీసుకొని పార్టీ నేతలు, కార్యకర్తలకు వారి రాజకీయ భవిష్యత్తుపై నమ్మకం కలిగించే విధంగా ప్రణాళికలు, కార్యక్రమాలు తయారు చేయవలసి ఉంటుంది. వీలయినంత తరచుగా పార్టీ తెలంగాణా నేతలతో, కార్యకర్తలతో సమావేశామవుతూ, వారిని ఉత్సాహపరుస్తూ మార్గదర్శనం చేయవలసి ఉంటుంది. లేకుంటే మిగిలిన నేతలు వారి అనుచరులు కూడా తుమ్మలను అనుసరిస్తూ అధికార తెరాసవైపు నడిచే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.