ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రాజకీయాలొద్దు

Publish Date:Aug 27, 2014

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాజధాని ఏర్పాటుకు అవసరమయిన సూచనలు చేసేందుకు నియమింపబడిన శివరామ కృష్ణన్ కమిటీ నిన్న కేంద్ర హోం శాఖకు తన నివేదికను సమర్పించింది. కమిటీ చేసిన కొన్ని ప్రధాన ప్రతిపాదనలు, సూచనలు:

 

1. వినుకొండ-మార్టూరు రాజధానికి అనువయిన ప్రాంతం. 2. విశాఖలో ఐటీ హబ్ మరియు హైకోర్టు ఏర్పాటు (అనంతపురం లేదా కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు) 3. రాయలసీమలో ట్రాన్స్ పోర్ట్ కారిడార్ ఏర్పాటు. 4.శ్రీకాళహస్తిలో రైల్వే జోన్ ఏర్పాటు. 5. రాజధాని పరిపాలనా కేంద్రంగా ఉండాలి కనుక అక్కడే శాసనసభ, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం వగైరాలు ఏర్పాటు.5. ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఏర్పాటు చేసుకోవాలి. 6. స్మార్ట్ సిటీ లేదా సూపర్ సిటీ ఏర్పాటు అనవసరం. 7. రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే నాలుగు భాగాలుగా చేసుకుని పరిపాలనను, పరిశ్రమల ఏర్పాటును వికేంద్రీకరించినట్లయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి.

 

అధికార తెలుగుదేశం పార్టీ విజయవాడలో రాజధానిని ఏర్పాటు చేస్తామని చెపుతూ కమిటీ సభ్యులను ప్రభావితం చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని ఈ నివేదిక నిరూపించింది.

 

విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతం రాజధానికి ఏ మాత్రం అనువయినది కాదని, ఒకవేళ అక్కడే రాజధాని ఏర్పాటు చేసినట్లయితే ఆర్ధిక, సామాజిక, పర్యావరణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. గుంటూరు జిల్లాలో వినుకొండ-ప్రకాశం జిల్లాలో మార్టూరు మధ్య ప్రాంతం రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనువయిన ప్రాంతమని తేల్చి చెప్పింది. మొదటి నుండి విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధానిని ఏర్పాటు చేస్తామని గట్టిగా చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదిక కొంచెం ఇబ్బందికరంగానే ఉంది.

 

అభివృద్ధిని వికేంద్రీకరించాలనే కమిటీ సలహాపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరమూ లేకపోయినప్పటికీ, రాజధాని విషయంలో కమిటీ సలహాపై అప్పుడే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి అనుకూల, ప్రతికూల వాదనలు, దానిపై వాడివేడి చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఇదివరకోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు, తమ అభిప్రాయాన్ని బహుశః ఆయనకు అప్పుడే తెలియజేసి ఉండి ఉండవచ్చును. కానీ ఆయన ప్రజాభీష్టం మేరకే రాజధాని ఏర్పాటవుతుందని, రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలి అని చెప్పడం చూస్తే బహుశః ఆయన విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నందునే ఆవిధంగా చెపుతున్నారని అనుకోవలసి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పంతానికి, ప్రతిష్టకు పోకుండా ఆలోచించినట్లయితే, నిపుణుల కమిటీ సూచించిన ప్రాంతం కూడా అన్ని విధాల అనువుగా ఉంది, ఇంచుమించు రాష్ట్రానికి మధ్యలోనే ఉంది కనుక అక్కడే రాజధాని ఏర్పాటుకు అంగీకరించినట్లయితే అనేక తీవ్ర సమస్యలను నివారించుకోవచ్చును.

 

ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సలహాను పెడచెవిన పెట్టి రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలోనే నిర్మించాలని సిద్దపడితే బహుశః అధికార పార్టీ నేతలందరూ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తప్పుపడుతూ విజయవాడకు అనుకూలంగా తమ వాదనలు గట్టిగా వినిపించవచ్చును. అవసరమయితే తమ వాదనకు అనుకూలంగా గట్టిగా వాదించేందుకు నిపుణులను రంగంలోకి దింపవచ్చును. అప్పుడు ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఊరుకోవు కనుక ఈ అంశంపై కూడా రాజకీయాలు మొదలుపెడితే, ఇది కూడా రాష్ట్ర విభజన అంశం లాగే వివాదాస్పదంగా మరి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రమాదం ఉంది. అప్పుడు కమిటీ చెపుతున్న సమస్యలే కాకుండా అనేక కొత్త సమస్యలు కూడా ప్రభుత్వం తలకు చుట్టుకోవడం ఖాయం. కనుక, ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయడం కంటే, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కమిటీ చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించడం మంచిది. ఒకవేళ దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే ప్రభుత్వమే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమయిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడం మంచిది. కానీ ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా జాప్యం చేసినట్లయితే ఊహించని అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. అప్పుడు ఇది మరింత జటిలమయిన సమస్యగా మారే ప్రమాదం ఉంది కనుక చేతులు కాల్చుకోకుండా ముందే జాగ్రత్త పడటం మేలు. రాష్ట్ర విభజన రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్ర పరిస్థితిని, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని స్వార్ధ రాజకీయ నాయకుల మాటలకు లొంగకుండా ఈ విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.