జాతీయపార్టీగా ఎదిగేందుకు తెదేపా ముందున్న సవాళ్లు

Publish Date:May 29, 2015

Advertisement

 

మహానాడు సమావేశాలలో పార్టీ జాతీయ కమిటీ ఏర్పాటు, దానికి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియతో తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీని చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలలోకి విస్తరించాలని నిర్ణయం జరిగింది.. జాతీయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం వరకు పార్టీకి ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చును. కానీ పార్టీని జాతీయ పార్టీగా మార్చి ఇరుగు పొరుగు రాష్ట్రాలలో విస్తరించాలంటే అనేక సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది.

 

అన్నిటి కంటే ముందుగా పార్టీ పేరుతో ఒక చిక్కు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పేరుతో పార్టీ కొనసాగడానికి ఎటువంటి సమస్యా ఉండబోదు. కానీ తమిళనాడు, కర్నాటక, ఓడిశా, మహారాష్ట్ర, అండమాన్, నికోబార్ దీవులలో పార్టీని విస్తరించాలనుకొంటున్న తెలుగుదేశం అదే పేరుతో తనను తాను అక్కడి ప్రజలకు పరిచయం చేసుకోవడం చాలా కష్టం. మరాఠీ, ఒడియా,కన్నడ, తమిళ్ బాషలు మాట్లాడే ప్రజలను తెలుగుదేశం పేరుతో ఒప్పించడం చాలా కష్టం. అలాగని వారి కోసం పార్టీ పేరును మార్చుకోలేదు. బహుశః ఈ సమస్యను మొదటే గుర్తించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ చాలా దూరదృష్టితో ఆలోచించి తెదేపా బదులు ‘భారతదేశం పార్టీ’ అని పేరు పెట్టాలని ఆలోచించారేమో? ఏమయినప్పటికీ ముందుగా ఈ పేరు సమస్యను తెదేపా పరిష్కరించుకోవలసి ఉంటుంది.

 

ఇక పొరుగు రాష్ట్రాలలో ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా నిలద్రోక్కుకొని ఉన్నాయి. కనుక తమకు పోటీగా వస్తున్న తెదేపాను ఆ పార్టీలు వ్యతిరేకించవచ్చును. ఉదాహరణకి తమిళనాడులో అధికార అన్నాడీయంకె, ప్రధాన ప్రతిపక్షమయిన డీయంకెలతో బలంగా నిలద్రోక్కుకొని ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలతో సహా మరొక అరడజను పార్టీలు కూడా ఉన్నాయి. అవ్వన్నీ కూడా ప్రతీ ఎన్నికలలో స్థానిక తెలుగు ప్రజల ఓట్లను పొందుతున్నాయి. ఇప్పుడు తెదేపా ప్రవేశిస్తే వాటికి ఆ ఓట్లన్నీ పోయే అవకాశం ఉంది. కనుక వాటి నుండి వ్యతిరేకత ఎదుర్కోవలసి రావచ్చును. కానీ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో మాదిరిగానే ఆ రాష్ట్రాలలో కూడా బీజేపీతో కానీ లేదా ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీలతో గానీ లేదా ఏదో ఒక స్థానిక పార్టీతో గానీ పొత్తులు పెట్టుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చును. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో కూడా కొనసాగాలనే ఉద్దేశ్యంతోనే తెదేపా జాతీయస్థాయికి ‘అప్ గ్రేడ్’ అవ్వాలనుకొంటోంది తప్ప ఆయా రాష్ట్రాలలో ప్రధాన పార్టీలతో పోటీపడి అధికారం కైవసం చేసుకొనే ఆలోచనలేదనే చెప్పవచ్చును. కనుక ఆయా రాష్ట్రాలలో ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే తెదేపా పెద్దగా ఇబ్బంది లేకుండానే ఇతర రాష్ట్రాలకు విస్తరించగలదు.

 

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పూర్తి సమయం కేటాయించలేకపొతున్నారు. అటువంటప్పుడు మరిన్ని రాష్ట్రాలకు పార్టీని విస్తరించేమాటయితే వాటికీ తగినంత సమయం కేటాయించగలరా? లేకుంటే అక్కడ పార్టీలను ఏవిధంగా బలోపేతం చేసుకోవాలి? ఎటువంటి వ్యూహాలు అమలుచేయాలి? ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి? వివిధ రాష్ట్రాలలో పార్టీ శాఖలను, నేతలను పార్టీతో ఏవిధంగా అనుసదానించాలి? వంటి వాటి గురించి కూడా పార్టీ అధిష్టానం ముందుగానే ఆలోచించుకోవలసి ఉంటుంది. అందుకు జాతీయపార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు అమలుచేస్తున్న విధానాలను పరిశీలిస్తే మంచిది.

 

తెదేపాను ఇతర రాష్ట్రాలకు విస్తరించినప్పుడు ఆయా రాష్ట్రాలలో స్థానిక నేతలతోనే పార్టీని నిర్మించుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అధిగమించగలదు. కనుక ముందుగా తను విస్తరించాలనుకొంటున్న రాష్ట్రాలలో అటువంటి బలమయిన వ్యక్తులను, పార్టీ పట్ల అభిమానం ఉన్నవారినీ గుర్తించి వారితోనే పార్టీ నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంటుంది. త్వరలోనే కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ ద్వీపాలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆరంభించేందుకు తెదేపా కమిటీలను, వాటికి నేతృత్వం వహించేవారిని ఏర్పాటుచేసుకొంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో తెదేపా మొదలుపెట్టబోయే సభ్యత్వ నమోదు ప్రక్రియకు వచ్చే స్పందనను బట్టి ఏ ఏ రాష్ట్రాలలో తెదేపా త్వరగా విస్తరించే అవకాశం ఉందనే విషయంపై ఒక అవగాహన ఏర్పడుతుంది.

 

ప్రస్తుతానికి తెదేపా విస్తరించాలనుకొంటున్న రాష్ట్రాలలో ఏ రాజకీయ పార్టీకి తెదేపా ఎన్నికల చిహ్నమయిన ‘సైకిల్’ గుర్తు లేదు కనుక వాటి నుండి ఈ విషయంలో అభ్యంతరం ఉండకపోవచ్చును. కానీ ఉత్తరాదికి విస్తరించాలనుకొంటే మాత్రం సమాజ్ వాదీ పార్టీకి కూడా సైకిల్ ఎనికల గుర్తుగా ఉంది కనుక అక్కడ ఆ పార్టీతో సమస్య ఎదురవవచ్చును. ఇటువంటి అనేక సాంకేతిక, రాజకీయ సమస్యల గురించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసారు. ఆ కమిటీ ఇంకా తన నివేదిక ఈయవలసి ఉంది. దాని ద్వారా మరికొన్ని ఇటువంటి సమస్యలు బయటపడవచ్చును. వాటన్నిటికీ తెదేపా పరిష్కారాలు కనుగొనవలసి ఉంటుంది. అప్పుడే జాతీయస్థాయిలో సైకిల్ సవారీ సజావుగా సాగుతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.