ప్రత్యేక హోదా కల త్వరలోనే సాకారం కాబోతోందా?

Publish Date:May 30, 2015

Advertisement

 

కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాద్ సింగ్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం గురించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. “ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను తమ ప్రభుత్వం ఖచ్చితంగా అమలుచేస్తుందని, ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని” బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ప్రకటించడం గమనిస్తే త్వరలోనే కేంద్రం ఖచ్చితంగా ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేస్తుందనే నమ్మకం కలుగుతోంది.

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలని కోరుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రత్యేక హోదా అంశం పట్టుకొని పోరాడుతూ మళ్ళీ రాష్ట్రంలో బలం పుంజుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది చేస్తున్న పోరాటాలు నిజమయినవి కావని, కాంగ్రెస్ ఉనికిని, ఆ పార్టీ నేతల రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే చేస్తున్నవని ప్రజలందరికీ తెలిసినందునే దానిని పట్టించుకోవడం లేదు.

 

కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆలశ్యం చేసినట్లయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ బలపడే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కలలుగంటున్న బీజేపీ అప్పుడు మిగిలిన పార్టీలతో బాటు కాంగ్రెస్ పార్టీని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఒకవేళ మోడీ ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టును పట్టుకొని కేంద్రంపై తన పోరాటం కొనసాగించవచ్చును.

 

ఇక ఏదో ఒకనాడు బీజేపీతో జతకట్టాలనే ఆలోచనతోనే వైకాపా ఈ ప్రత్యేక హోదా, మిగిలిన హామీల గురించి గట్టిగా మాట్లాడటం లేదనే విషయం పెద్ద రహస్యమేమీ కాదు. కానీ బీజేపీతో తమ పార్టీతో జత కట్టే అవకాశం లేదని గ్రహించిన మరుక్షణం వైకాపా కూడా ప్రత్యేక హోదాతో సహా రాష్టానికి ఇచ్చిన అన్ని హామీలపై కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయం. అప్పుడు ప్రజలలో బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంటుంది.

 

ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటూ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న కారణంగా తెదేపా ప్రతిపక్షాలతో కలిసి పోరాటాలు చేయలేదు కనుక నేరుగా కేంద్ర ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో జరుగుతున్నఆలశ్యం వలన అధికార తెదేపాపై కూడా క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. ఆ కారణంగానే అది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ ఇంకా ఆలశ్యం జరిగినట్లయితే తెదేపా, బీజేపీలు రెండు కూడా ప్రజలకు జవాబు చెప్పుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కనుక తెదేపా కంటే బీజేపీకే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. బహుశః అందుకే ఇంతవరకు ప్రత్యేక హోదాపై కొంచెం ఊగిసలాడిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి సానుకూలంగా మాట్లాడుతోంది.

 

కానీ ప్రత్యేక హోదా కోసం  అనేక రాష్ట్రాలు అనేక ఏళ్లుగా పోరాడుతున్నాయి. తమిళనాడు, ఓడిషా,కర్నాటక వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాలు ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కేంద్రాన్ని గట్టిగా కోరుతున్నాయి. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమయిన అర్హతలు రాష్ట్రానికి లేవని 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకారం తెలపవలసి ఉంటుంది. వారివారి రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొందరు అభ్యంతరం చెప్పవచ్చు లేదా తమకీ ఇమ్మని మెలిక పెట్టవచ్చును. ఎన్డీయే ప్రభుత్వం ఈ సమస్యలను అన్నిటినీ అధిగమించగలిగితే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు. కనుక ప్రత్యేక హోదా ఇస్తానని ఖచ్చితంగా ప్రకటించకుండా త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకొంటామని చెపుతోంది.

 

ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకానట్లయితే అందుకు ప్రతిగా రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి భారీ ఆర్ధిక ప్యాకేజీ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమయిన సబ్సీడీలు, ఆకర్షణీయమయిన ప్రోత్సాహకాలు ప్రకటింస్తుందేమో? ఇంకా ఈ అంశాన్ని నాన్చడం వలన తమకే నష్టం జరిగే ప్రమాదం ఉందనే ఆలోచనతోనే ఇక ఏదోవిధంగా ఈ సమస్యను పరిష్కరించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించుకొని ఉండవచ్చును. ఇప్పటికే విలువయిన ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. కనుక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు తీసిపోని విధంగా ఏదయినా ప్రకటిస్తే దానిని వ్యతిరేకించకుండా స్వీకరించడమే రాష్ట్రానికి మేలు చేకూర్చుతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.