పన్నులు తెలంగాణకు.. సమస్యల తలనొప్పులు ఏపీకీనా?

Publish Date:Aug 11, 2025

Advertisement

తెలుగు చిత్రపరిశ్రమ తీరు పట్ల ఏపీలో ఆగ్రహం

 మీ ఇంటికొస్తే ఏమిస్తావ్.. మాయింటి కొస్తే ఏం తెస్తావ్ అన్నట్లుగా ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల తీరు. ఔను తెలుగు సినీ పరిశ్రమ తీరు అడ్డగోలుగా ఉంది. పన్నులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి కడతాం.. మా సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ దబాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  . ఉండేది తెలంగాణ రాజధానిలో ... టాక్స్ లు  కట్టేది అక్కడి ప్రభుత్వానికి, ఎనభై శాతం షూటింగ్ లు జరిపేది కూడా అక్కడే.  పనిచేసే కార్మికులు కూడా80 శాతం మంది తెలంగాణ వారే.  అక్కడ కార్మికులకు కడుపు కాలి ధర్నాలు చేస్తే.. ఏపీ సర్కార్ చర్చలు జరిపి పరిష్కరించాలని కోరుకుంటున్నారు.  అసలు తెలంగాణలో సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏపీకి సండంధం ఏమిటి; ఆ తలనొప్పి ఏపీ ప్రభుత్వానికి ఎందుకు అంట గట్టాలని చూస్తున్నారు? అన్నది అర్థం కాని పరిస్థితి.  

వాస్తవంలోకి వెళ్తే సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది. సినిమా వాళ్ళంతా ఉండేది ,జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, మణికొండ తదితర ప్రాంతాల్లోనే.  నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ,క్యారెక్టర్ ఆర్టిస్టులు  మొత్తం హైదరాబాద్ లోనే మకాం వేసి ఉన్నారు. కట్టే టాక్స్ లు కూడా ఎనభై శాతానికి పైగా  తెలంగాణ ప్రభుత్వానికే కడతారు. కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం పరిష్కారం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైపు చూస్తారు. అక్కడి సినీ పరిశ్రమకు కష్టం వస్తే..  హైదరాబాదులో సినీ కార్మికులు ధర్నాలు చేస్తుంటే..  ఏపీ ఈ వ్యవహారం పై  ఏపీ ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  తాజాగా  సినీ పరిశ్రమంలో సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు తెలంగాణలో  మకాం వేసి ఉంటారు?  ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ,ఏపీలోకి వచ్చి  హడావుడి చేసి వెళ్ళిపోతుంటారు.  ఇలాంటి వ్యవహార శైలి ఇటీవల కాలంలో సినీ పరిశ్రమ పెద్దలకు ఎక్కువైపోయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం దగ్గరకు నిర్మాతల బృందం వచ్చింది. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కావాలి..   మా సమస్యలు మొత్తం ఏకరువు పెట్టి తెలంగాణలో వచ్చిన సమస్య పరిష్కరించమని  కోరుకుంటామంటూ ఏపీ సినీమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తలెత్తిన సమస్య గురించి సీఎం దృష్టికీ, డిప్యూటీ సీఎం దృష్టికీ తీసుకువెడతానని హామీ ఇచ్చారు. అయితే అసలు ఎక్కడో హైదరాబాదులో జరుగుతున్న ధర్నాలు,సమ్మెల వ్యవహారానికి ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారు? అసలు ఏదైనా సరే ఎందుకు చేయాలి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడో ఒక సారి వారి అవసరాల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలలో షూటింగ్ లు జరుపుకుని వెళ్లిపోడం వినా.. ఇక్కడ మకాం వేయడం కానీ, ఇక్కడ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు ఏమైనా నిర్మించడానికి కనీసం ప్రతిపాదలైనా చేశారా? అగ్ర హీరోల దగ్గర నుండి ,నిర్మాతల వరకూ మొత్తం హైదరాబాద్ లోనే..  సినిమా రీలీజుల సమయంలో మాత్రం  టికెట్ల రేట్లు పెంచి..  ఏపీ ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడతాం అనుమతించండి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరడం వినా, వీరు ఏపీకి చేసిందేమిటి?  తమ నివాసాల దగ్గర నుంచి సినీమా వ్యవహారాలు, వ్యాపారాలూ అన్ని హైదరాబాద్ లో చేసుకుంటూ.. టాక్సులు కూడా అక్కడి ప్రభుత్వానికే కడుతూ.. మస్య రాగానే ఏపీ సర్కార్ వద్దకు పరుగులెత్తుకుంటూ వస్తారు.  సమస్య రాగానే ఏపీ, ఏపీ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు.  . అటువంటి వారి పట్ల ఏపీ ప్రభుత్వం ఎందుకు సానుకూలతతో, సానుభూతితో ఉండాలి? ఎందుకు బాధ్యత తీసుకోవాలి అన్నదే ఇప్పుడు సగటు ఆంధ్రుడి ప్రశ్న. ఏదన్నా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విరాళాలు ప్రకటించి... మొత్తం ఆంధ్రప్రదేశ్ ను ఆదుకున్నట్లు బిల్డప్ లు ఇవ్వడం తప్ప,  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ ఏపీకి నయాపైసా ప్రయోజనం ఏముందని సగటు ఆంధ్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.   ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడు సినీ పరిశ్రమలో తలెత్తిన సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకునే విషయంలో  ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి.    , సినీ పరిశ్రమ ఏపీకి  వచ్చే విధంగా,  ఏపీలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు నెలకొల్పే విధంగా షరతు విధించాలి. అలా కాకుండా పన్నులు కట్టేది తెలంగాణలో.. సమస్యలు పరిష్కారం అయ్యేది ఆంధ్రప్రదేశ్ లో అన్నట్లుగా వ్యవహరిస్తామంటే మాత్రం పరిశ్రమ సమస్యల విషయంలో ఏపీ ప్రభుత్వం  జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

By
en-us Political News

  
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.