వైసీపీలో సస్పెన్షన్లు ఉత్తుత్తివేనా?

Publish Date:Feb 13, 2026

Advertisement

వైసీపీలో సస్పెన్షన్లు ప్రజలను మభ్యపెట్టడానికేనా అంటే ఔనన్న సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే క్రమశిక్షణ ఉల్లంఘించినందుకో, నేరారోపణలు ఎదుర్కొంటున్నందుకో ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లేదా నాయకుడిని సస్పెండ్ చేస్తూ.. అలా సస్పెన్షన్ కు గురైన వ్యక్తిని పార్టీకి దూరంగా ఉంచుతుంది. పార్టీ కార్యక్రమాలలోకి ఎంట్రీ ఇవ్వదు. పార్టీ అధినేతనైతే అసలు కలిసే చాన్సే ఉండదు. సదరు సస్పెన్షన్ ఎత్తివేసేంత వరకూ ఆ సస్పెన్షన్ కు గురైన వారి నీడ కూడా పార్టీ దరిదాపుల్లో పడనీయరు. 

కానీ వైసీపీలో అటువంటి పరిస్థితి ఇసుమంతైనా కనిపించదు. పార్టీలో ఉన్న వారి కంటే సస్పెన్షన్ కు గురైన వారికే పార్టీలో ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందా అనిపించేలా పార్టీ అధినేత వ్యవహరిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు వైసీపీ అధినేత జగన్ తన ప్రతిపక్ష హోదా డిమాండ్ కు తిలోదకాలిచ్చి సభకు హాజరయ్యారు. తనతో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఆయన సభకు హాజరై ఓ పదకొండు నిముషాల పాటు సభలో కూర్చుని వాకౌట్ చేశారు. అది పక్కన పెడితే.. సభ నుంచి బయటకు వచ్చే సమయంలో అసెంబ్లీ ఆవరణలో ఆయనను పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు.  జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో వైసీపీలో సస్పెన్షన్లు ఉత్తుత్తివేనా అన్న చర్చకు తెరలేచింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరంటే.. 

కారు డ్రైవర్ ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఎమ్మెల్సీ అనంత్ బాబు,   కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాలలో రచ్చరచ్చ చేసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈ ఇరువురూ కూడా అసెంబ్లీ ఆవరణలో జగన్ వెంట ఉన్నారు. జగన్ వారితో మాట్లాడారు. పార్టీ వాయిస్ వినిపించమని ఆదేశించారు. తాడేపల్లి వచ్చి కలవమని చెప్పారు కూడా. వీరిరువురిలో ఎమ్మెల్సీ అనంతబాబు అయితే హత్య, డోర్ డెలివరీ కేసులో అరెస్టై బెయిలుపై ఉన్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జనాల నుంచి వీరిపై వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే  జగన్ తో వారు కలిసి నడవడం, జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడటం చూస్తుంటూ.. ఆ సస్పెన్షన్లు ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ఉత్తుత్తి సస్పెన్షన్లుగా కనిపిస్తున్నాయి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

By
en-us Political News

  
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.