Publish Date:Mar 19, 2025
సునీతా విలియమ్స్ 9 నెలల సుదీర్ఘ కాలం అంతరిక్షంలో చక్కుకుపోయి ఎట్టకేలకు భువికి చేరుకున్నారు. అయితే అంత కాలం అంతరిక్షంలో ఉన్న ఆమె ఇక్కడ భూమి మీద సాధారణ జీవితం గడపడం అంత సులభం కాదు. ఆమె కొంత కాలం ఐసోలేషన్ లో ఉండాల్సిందే.
దాదాపు నెలన్నర పాటు సునీతా విలియమ్స్ నాసా కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. వైద్యులు, మానసిక నిపుణులు ఈ నెలన్నర అంటే 45 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తారు. అలాగే రోజజుకు రెండు గంటల పాటు వివిధ వ్యాయామాలు చేయిస్తారు. ఎందుకంటే సుదీర్ఘకాలం రోదసిలో ఉండటం వల్ల సునీతా విలియమ్స్ పలు శారీరిక మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జీరో గ్రావిటీ వాతావరణంలో గడపడం వల్ల భూమి మీద ఆమె మళ్లీ మామూలు జీవితం గడపడానికి కొంత కాలం పడుతుంది. నడవడం, దృష్టిని స్థిరంగా ఉంచడంలో సునీతా విలియమ్స్ ఇబ్బందులు పడుతున్నారు.
ఆమెను క్యాప్సుల్ నుంచి స్ట్రెచ్చర్ పై తీసుకురావడాన్ని ప్రపంచమంతా దృశ్యమాధ్యమాల ద్వారా తిలకించింది. ఇదే కాకుండా శరీరంలో రేడియేషన్ స్థాయి ఎక్కువగా ఉండటం, అలాగే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు కూడా సునీతా విలియమ్స్ ఎదుర్కొంటున్నారు. గతంలో అంటే 1984లో భారత సంతతికి చెందిన రాకేష్ వర్మ రోదసిపై కాలు మోపిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చిన తరువాత కొన్ని రోజుల పాటు ఐసోలేషన్ లో గడపాల్సి వచ్చింది. రోదశిలోకి వెళ్లిన ప్రతి వారూ ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అప్పట్లో రాకేష్ శర్మ రోదశిలో ఏడు రోజుల 21 గంటల 40 నిముషాల సేపు గడిపారు. ఆ కారణంగా ఆయన నెలల తరబడి ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది.
అయితే ఇప్పుడు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్ లు 9 నెలల పాటు రోదశిలో చిక్కుకుపోయారు. దీంతో వీరు ఎక్కువ రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తోంది. నాసా కేంద్రంలో వీరికి 45 రోజుల పాటు మూడు దశలలో శిక్షణ ఇచ్చి భూమి వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. మొదటి దశలో కండరాల బలోపేతానికి సంబంధించి శరీర శక్తి, రక్త ప్రసరణ పెరిగేందుకు అవసరమైన చికిత్స, వ్యాయామాలు చేయిస్తారు. ఇక చివరిదైన మూడో దశలో వారిలో చురుకుదనం పెంచేందుకు అవసరమైన వ్యాయామాలతో పాటు, భూవాతావరణానికి అనుగుణంగా శరీకం అలవాటుపడేందుకు అవసరమైన చికిత్స అందిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 45 రోజులు పడుతుందని నాసా వర్గాలు తెలిపాయి. ఆ కారణంగానే అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వెంటనే సునీతా విలియమ్స్ ను వైట్ హౌస్ కు ఆహ్వానింలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకున్న తరువాత వైట్ హౌస్ కు ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతానని ఆయన అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sunitha-williams-confine-to-nasa-center-for-45days-39-194687.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.