బ‌డుల విలీనం..  త‌ల్లిదండ్రుల ఆగ్ర‌హం

Publish Date:Aug 10, 2022

Advertisement

అనుకున్నంతా అయింది. పాఠశాలల్లో తరగతుల విలీనం ప్రభుత్వబడులపై తీవ్ర ప్రభావం చూపింది. సర్కారు అంచనాలను తల కిందులు చేస్తూ ఏకంగా 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వబడులకు రాంరాం చెప్పేశారు. ఈ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లను 47.4 లక్షల మందికి ఇవ్వాలని అంచనా వేయగా ఈ ఆగస్టు 1వ తేదీ నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 41.2 లక్షలు మాత్రమే ఉంది. 

ఆరో తరగతి విద్యార్థుల సంఖ్య గతంలోకంటే పెరిగి సాధారణ స్థితికి వచ్చినా, ఒకటో తర గతిలో చేరేవారం సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది. ప్రభుత్వబడుల్లో విద్యార్థుల నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నం దున ఈ సంఖ్య స్వల్పంగా పెరిగి 42 లక్ష లకు చేరినా ఐదు లక్షలకు పైగా లోటు ఉంటుందని భావిస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో 45.71 లక్షల మంది విద్యా ర్థులు ప్రభుత్వబడుల్లో చదువుకున్నారు. కాగా ఇపుడు ఈ  గణాంకాల ప్రకారం చూస్తే, ఈసారి 4.55 లక్షల మంది బడికి దూరం కావ‌డం గ‌మ‌నార్హం. 

అస‌లు విలీనంతోనే స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.  ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన తరగతుల విలీన ప్రక్రియ తీవ్ర గందరగోళా నికి కారణమైంది. 5,870 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమికో న్నత, ఉన్నత పాఠ శాలల్లో విలీనం చేస్తున్నారు. చిన్న పిల్లలను దూరం పంపలేమని బడులు తెరిచిన రోజు నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ ప్రక్రియ ప్రాథమిక విద్యావ్యవస్థను గందరగోళం చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెట్టాయి. కానీ విధానపర నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వం విలీనంపై భీష్మించింది. మొండిగా ముందడుగు వేసింది. దీంతో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వబడుల్లో చేరిక‌ల‌పై ఆందో ళన మొదలైంది.

దాదాపు ప‌ది శాతం విద్యార్థులు ప్రైవేటు బాట పట్టే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. అంతదూరం పంపడం తప్ప దనుకుంటే మా పిల్లలకు ప్రభుత్వబడి అక్కర్లేదంటూ అనేకచోట్ల తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అందుకు అను గుణంగానే ప్రైవేటు పాఠశాలలకు క్యూ కట్టారు. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ స‌రికొత్త విధాన నిర్ణ‌యం ఎవ‌రినీ ఆక‌ట్టుకోవ‌డం లేదు. పైగా తీవ్ర నిర‌స‌న లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ స‌ర్కార్ త్వ‌ర‌లో మార్పులు చేర్పులు చేప‌ట్టి త‌ల్లిదండ్రుల‌కు న‌మ్మ‌కం క‌లిగించాలి. 

By
en-us Political News

  
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.