అమరావతి వేదికగా తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. చక్రం తిప్పుతున్న ఆర్ఎస్ఎస్ కీలక నేత

Publish Date:Aug 10, 2022

Advertisement

బీజేపీ తెలంగాణలో జోరు పెంచింది. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఏ పార్టీ నుంచైనా సరే కమలం గూటికి చేరేవారి గురించి దుర్భిణి పట్టి మరీ గాలిస్తోంది. చేరికల కమిటీ చైర్మన్ ఒక వైపు అదే పనిలో వచ్చేవారూ, రాని వారు అన్న తేడా లేకుండా పార్టీల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని నాయకులందరికీ ఫోన్లు చేసి మరీ కమలం గూటికి రావాలని ఆహ్వానించేస్తున్నారు.

అలా కమలం ఆహ్వానిస్తున్న నేతలలో కాంగ్రెస్ వారు ఉన్నారు, టీఆర్ఎస్ వారూ ఉన్నారు. చివరాఖరికి తెలంగాణలో ఉండీ లేనట్లుగా మిగిలిన వైసీపీ వారూ ఉన్నారు. ఇది చాలదన్నట్లు ఆపరేషన్ ఆకర్ష్ పని కోసం ఆర్ఎస్ఎస్ కూడా రంగంలోనికి దిగిందని చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ కీలక నాయకుడు కూడా కమంల ఆపరేషన్ ఆకర్ష్ కోసం చాలా సీరియస్ గా  పని చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఆరు నూరైనా.. నూరు ఆరైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా చేపట్టిందని పరిశీలకులు అంటున్నారు. ఒక వైపు తెలంగాణ నుంచి చేరికల కమిటీ చైర్మన్ ఈటల తన పని తాను చేసుకుపోతుంటే.. బీజేపీ మరో వైపు నుంచి అమరావతి వేదికగా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి సమాంతరంగా పావులు కదుపుతోంది. వ్యూహాలు రచిస్తోంది. 

ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీలలో గుర్తింపు లేని నాయకులను, అసంతృప్తితో ఉన్న నాయకులనూ, గుర్తింపు ఉన్నా కూడా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ లభిస్తుందో లభించదో అన్న డైలమాలో ఉన్న నేతలనూ బీజేపీ బీజేపీ వలవేసి పట్టుకుంటోందని అంటున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు.

ఆమె ఆ ఆహ్వానాన్ని మన్నించి పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా ఉండి ఆ తరువాత తెరాస గూటికి చేరిన నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావుకు కూడా కమలం పార్టీ నుంచి ఫోన్ వెళ్లిందని చెబుతున్నారు.  గతంలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల సందర్బంగా తన కుమార్తె కవిత కోసం కేసీఆర్ స్వయంగా మండవ వెంకటేశ్వరరావును ఆయన ఇంటికి వెళ్లి మరీ గులాబి కండువా కప్పారు.

ఆ తరువాత మండవను పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో ఆయన పరిస్థితి తెరాసలో ఉండీ లేనట్టుగా మారిపోయింది. ఇప్పుడు మండవకు కమలంగూటికి రావల్సిందిగా బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. ఇలా గతంలో రాజకీయంగా కీలకంగా వ్యవహరించి ఇప్పుడు పెద్దగా గుర్తింపు లేకుండా ఉన్న నేతలను వెతికి పట్టుకుని మరీ కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని సమాచారం. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ జోరును పెంచేందుకు ఏపీలోని అమరావతి వేదికగా వ్యూహాత్మకంగా ఓ ఆర్ఎస్ఎస్ అగ్ర నేత పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. 

ఇప్పటికే  పలువురు నేతలతో ఆయన టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. అలా ఆర్ఎస్ఎస్ నేత ఇప్పటికే సంప్రదించిన వారిలో తెరాస నాయకులే కాకుండా కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు.  మండవ వెంకటేశ్వరరావు, జయసుధలతో పాటు కాంగ్రెస్ కు చెందిన రామిరెడ్డి దామోదరరెడ్డి, జగ్గారెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా బీజేపీతో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. వీరే కాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, రసమయి బాలకిషన్, జూపల్లి కృష్ణారావు, రోహిత్ రెడ్డిలను కూడా కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా సంప్రదింపులు జరిపిందని చెబుతున్నారు. అమరావతి వేదికగా అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ సంప్రదింపులు సత్ఫలితాలను ఇస్తున్నాయని బీజేపీకి చెందిన విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

కాగా మునుగోడు ఉప ఎన్నిక తరువాత ఈ కార్యక్రమం మరింత జోరందుకుంటుందనీ, ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలపై బీజేపీ మరింతగా దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. అమరావతి వేదికగాఈ  సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుండటం, అదీ ఓ ఆర్ఎస్ఎస్ కీలక నేత దీనిని పర్యవేక్షిస్తుండటంతో టీఆర్ఎస్ వలసల నివారణకు ఎటు నుంచి ప్రయత్నించాలో కూడా అర్ధం కాని పరిస్థితులలో పడిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇతర పార్టీలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో గతంలో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిటి వలసలను ప్రోత్సహించడమే ఇప్పుడు టీఆర్ఎస్ కు బూమరాంగ్ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు.  అసంతృప్తులను బుజ్జగించడమెలా, వలసనలను నిరోధించడమెలా అని కేసీఆర్ తల పట్టుకుంటున్నట్లు తెరాస శ్రేణులు అంటున్నాయి.  జూపల్లి కృష్ణారావును బుజ్జగించడానికి కేసీఆర్, కేటీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమైన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఏది ఏమైనా రానున్న రోజులలో బీజేపీలోకి వలసలు మరింత పెరిగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.