బాల్యాన్ని కాపాడుకుందాం....!!

Publish Date:Jul 30, 2018

Advertisement

బాల్యం కనపడడం లేదు. బాల్యం బాగుండడం లేదు. బాల్యం బరువులు ఎత్తుతోంది. బాల్యం భారాన్ని  మోస్తోంది. బాల్యమంటే బంగారం కదా...! బాల్యమంటే దాచుకోవాల్సిన నెమలీక కదా...! బాల్యమంటే కొన్ని గురుతుల సంగమం కదా...! నేడు నలభైలు దాటిన వారందరి బాల్యం దాచుకున్నదే కదా.... ఆనందంగా... "ఆ రోజుల్లో మేం" అని చెప్పుకుంటున్నదే కదా...! మరి ఈనాటి బాల్యానికి ఆనాటి మన బాల్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. ఆవకాయ కలిపి ఎర్రటి అన్నం ముద్దలు ఎందుకు తినిపించలేకపోతున్నాం. ఓ పలకా... బలపం... కొంచెం ఎదిగితే రెండంటే రెండే పుస్తకాలు.... ఇవే కదా ఆనాటి చదువుల వనరులు. మరి నేడెందుకు బండెడు పుస్తకాల బరువును బాల్యం నడుముకి కట్టేస్తున్నాం. నలభై.. ఏభై, అరవై ఏళ‌్ల  క్రితం వాళ్లే కదా.... ఇప్పుడున్న ఉన్నతాధికారులు. ప్రధానులు... ముఖ్యమంత్రులు... మంత్రులు...వారంతా సర్కార్ బడుల్లో చదువుకునే ఇప్పుడు ఈ స్థితిలో వచ్చారు.  ఈ నారాయణలు... చైతన్యలు కూడా చదువుకున్నది... మోసింది ఆ పాఠశాలలు.... ఆ తేలిక పాటి చదువులే కదా... మరి మనమెందుకు ఈనాటి బాల్యాన్ని కష్టాల పాలు చేస్తున్నాం.

 

 

దేశంలో బాల్యానికి సంకెళ‌్లు పడ్డాయి. ర్యాంకుల జైళ్లలోకి ఎప్పుడెప్పుడు తోసేద్దామా అని తలిదండ్రులు రెట్టించిన ఉత్సాహం చూపుతున్నారు. నిజానికి ఇరవై సంవత్సరాల క్రితమే బాల్యానికి దేశ బహిష్కరణ జరిగిపోయింది. మన దేశం నుంచి బాల్యం అనే పదం ఎప్పుడో ఎగిరిపోయింది. మనది బాల్యం లేని దేశంగా.... పసితనం ఎరుగని దేశంగా.... చిన్నారుల నిషేధిత దేశంగా "ఎదిగిపోయింది ". మన వాళ్లు అమెరికా విమానాలకు క్యూలు కట్టడం... డాలర్ల మాయకు దాసోహమవ్వడం ఎప్పుడు ప్రారంభమైందో ఆనాడే మన ఇళ‌్ల నుంచి బాల్యం గెంటివేయబడింది. పల్లెటూళ్లు లేవు... పట్టణాలు కనుమరుగవుతున్నాయి. నగరాలు అత్యంత ఆధునికతలో " ఊగిపోతున్నాయి". ఇక భవిష్యత్‌ని గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుంది. ఉండదు.. ఉండకూడదు. ఒకవేళ ఒకరిద్దరికి ఉన్నా.... వారు అమయాకులు...బతకడం చేత కాని వారు... తమ పిల్లల " భవిష్యత్‌ని కాలరాస్తున్నవారు". " మా అబ్బాయికి మూడో తరగతిలోనే ఫస్ట్ ర్యాంకు వచ్చింది.  మాది కోనసీమే అయినా... మా అమ్మాయికి తెలుగులో మాట్లాడడం రాదు. ఇంచక్కగా ఇంగ్లీషులోనే మాట్లాడుతుంది" ఇది నేటి తలిదండ్రుల గొప్పతనం.

 

 

పరాయి భాష చుట్టంలాగో... ఆపదలో ఆదుకునే స్నేహతుడిలాగో ఉండాలి తప్ప తల్లి భాషలా... ఆ మాటకొస్తే తల్లినే ఏమార్చే భాషలా ఉండకూడదని మన జాతికి తెలియడం లేదు. బ్రిటీషు వారి పాలనలో తెలియక బానిసత్వంలో మగ్గిన భారతదేశం... ఇప్పుడు అన్నీ తెలిస.ి... కావాలనే... ఇష్టంతోనే....బానిసగా మారుతోంది. ఇదే ఇక్కడి అసలైన విషాదం. గందరగోళంలో పడి మన బాల్యం ఏం చేయాలో... ఎటు పోవాలో తెలియక అయోమయంలో ఉంది. దీన్ని మార్చాల్సిన ప్రభుత్వాలు కూడా తాత్కాలికంగా ఏమారుస్తున్నాయే తప్ప పట్టింపు లేకుండా ఉంటున్నాయి. దీనికి ఫలితం కొందరు ఇప్పుడే అనుభవిస్తున్నా... మరికొందరు భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదు. కాస్లులో ఇంగ్లీషు అర్ధం కావడం లేదని ఓ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కాలేజీలో సీటు రాలేదని మరో అమ్మాయి ఏకంగా 13 అంతస్తుల నుంచి దూకేసి చచ్చిపోయింది. చిన్నతనం నుంచి గ్రామంలోనే పెరిగిన ఆ అబ్బాయికి ఇంగ్లీషు ఎలా అర్ధం అవుతుంది. ఇంగ్లీషు రానంత మాత్రాన తనువు చాలించాల్సిందేనా... మరి పట్టణంలో పుట్టి పెరిగిన అమ్మాయికి మెడికల్ కాలేజీలో సీటు రాకపోతే మరణమే శరణ్యమా.... ఈ చదువులు ఎవరు చెబుతున్నారు. 

 

 

 

ఏ క్లాసుకు సంబంధించి అయినా... ఏ ప్రవేశ పరీక్షలకు సంబంధించి అయినా ఫలితాలు వస్తున్నాయంటే భయమేస్తోంది. ఎక్కడ ఎలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తుందో అని. చదువంటే మార్కులేనా... చదువంటే ర్యాంకులేనా... బాల్యమంటే పుస్తకాల మోతేనా.... అవే తప్ప మరింకేమీ లేకుండా చేసిన... చేస్తున్న ప్రభుత్వాలు... పాఠశాలలు... కళాశాలలను ఏం చేయాలి...? బాల్యానికి భరోసా ఇవ్వకుండా చేస్తున్న ప్రభుత్వాలను ఏం చేయాలి...? తాను పరీక్షలో తప్పినా... తన స్నేహితుడు పరీక్షలో నెగ్గాడనే ఆనందాన్ని తన తాతతో పంచుకున్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి మనమేం నేర్చుకోమా...? వీధి బడిలో చదువుకున్న అబ్దుల్ కలామ్ గొప్ప శాస్త్రవేత్త అయ్యాడని తెలిసీ మనం ఇలాగే మిగులుదామా...? సంతకం కూడా చేయడం రాని టంగుటూరి అంజయ్య సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పని చేశాడని గుర్తు చేసుకోమా...? బాల్యాన్ని చిదిమేసి... ఛిద్రం చేసి... అసలు అది లేకుండా చేసేసి మానవ జన్మలో ఓ అపురూప దశను కనుమరుగు చేసేద్దామా..?

 

 

బాల్యం అనేది ఒకటుందని... అది అత్యంత అపురూపమని... నేటి తరానికి అర్ధం అయ్యేలా చెప్పలేమా...? వీడియో గేమ్స్... టీవీలో వచ్చే నానా చెత్త... తెలుగు సినిమాల్లో చిన్నారుల చేత చేయించే విచిత్ర వేషాలు.... కొత్తగా దిగుమతి అవుతున్న బ్లూవేల్ గెమ్స్ వంటి దారుణాల నుంచి బాల్యాన్ని రక్షించాలి కదా... దీనికి ఎవరు నడుం కడతారు... దీనికి ఎవరు ముందుకురుకుతారు... దీనికి ఎవరు తొలి అడుగు వేస్తారు... ఎవరో కాదు... మనమే... ప్రతి కుటుంబమే.... ప్రతి వ్యక్తే... ప్రతి తల్లే... ప్రతి తండ్రే... ప్రతి తాతే... ప్రతి మామ్మే... ప్రతి మామయ్యే... ప్రతి అత్తమ్మే.. దేశం కోల్పోతున్న బాల్యాన్ని దేశానికి తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రాజకీయ నాయకులూ... నేటి బాలలే... రేపటి మీ ఓటర్లు.... కనీసం అందుకోసమైనా ఈ మన బాల్యాన్ని కాపాడండి. అక్కున చేర్చుకోండి...

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.